Farooq Abdullah: షాజహాన్, ఔరంగజేబ్, అక్బర్, బాబర్ని ఎలా మరిచిపోతారు..? మొఘలుల చరిత్ర తొలగింపుపై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farooq Abdullah: సీబీఎస్ఈ సిలబస్ నుంచి మొగలుల చరిత్రకు సంబంధించి కొన్ని పాఠ్యాంశాలను తొలగించడం చర్చనీయాంశం అయింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ విద్యను కాషాయీకరణం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. చరిత్రను చెరిపివేయలేరని శనివారం అన్నారు. షాజహాన్, ఔరంగజేబ్, అక్బర్, బాబర్, హుమాయూన్, జహంగీర్లను ఎలా మర్చిపోతారు? వారు 800 ఏళ్ల పాలించారని చెప్పారు.
Read Also: CSK vs MI: విజృంభించిన సీఎస్కే బౌలర్లు.. చెన్నైకి స్వల్ప లక్ష్యం
Also Read
మొఘలుల పాలనలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు ఎవరూ బెదిరింపులకు గురికాలేదని అన్నారు. తాజ్ మహల్ ను ఎప్పుడు కట్టారో అడిగితే ఏం చెబుతారు..? ఫతేపూర్ సిక్రీ గురించి ఏం చెబుతారు..? హుమాయున్ సమాధిని, ఎర్రకోటను ఎలా దాచిపెడతారు..? అని ప్రశ్నించారు. వారు గొడ్డలితో తమ పాదాలను తామే నరుక్కుంటున్నారని, మనం ఉండము కానీ చరిత్ర మిగిలిపోతుందని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని గ్రామాలకు చైనా పేర్లు మార్చడం, చైనా గతంలో చేసిన వాదనను అంగీకరించడానికి భారత్ సిద్ధంగా లేదని అబ్దుల్లా అన్నారు.
ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా గెలవాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. పొత్తు ఒక్కటే మనల్ని ఏకం చేసేది అని, మనం వ్యక్తిగతంగా పోరాడలేం అని అన్నారు. అందుకే జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఏకం కావాలనే మార్గాలను అణ్వేషిస్తున్నామని, తద్వారా ఎన్నికల్లో విజయం సాధించగలమని అనంత్ నాగ్ జిల్లాలో లార్నూలో విలేకరుల సమావేశంలో చెప్పారు.
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!