Kerala: 10వ తరగతి టాపర్గా సారంగ్.. చనిపోయి ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: 16 ఏళ్ల బాలుడు చనిపోయి మరో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. 10 తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించడానికి రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన సారంగ్ 10వ తరగతిలో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి టాపర్ గా నిలిచారు. సారంగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత, శుక్రవారం విడుదలైన పదో తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలవడం ఆ కుటుంబాన్ని మరింతగా బాధపెడుతోంది.
Read Also: MK Stalin: కర్ణాటక ఓటమిని కప్పిపుచ్చడానికే రూ.2000 నోట్ల రద్దు..
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
సారంగ్ తాను చనిపోయినా కూడా అవయవదానంతో మరో 6 మందిని బ్రతికించాడు. కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి ఫలితాలను ప్రకటిస్తూ సారంగ్ కు నివాళులు అర్పించారు. గ్రేస్ మార్కుల సహాయం లేకుండానే సారంగ్ పూర్తి A ప్లస్ స్కోర్ సాధించగలిగాడని మంత్రి భావోద్వేగానికి గురయ్యాడు. యువకుడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అభినందించారు. సారంగ్ రెండు కిడ్నీలు, లివర్, గుండె వాల్వులు, కళ్లను దానం చేసినట్లు ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
అట్టింగల్ లోని ప్రభుత్వ బాలుర హెచ్ఎస్ఎస్ చదువుతున్న సారంగ్ మే 13న మద్యాహ్నం కల్లంబలం-నగరూర్ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారు. మరో వాహనానికి దారివ్వాలనే తపనలో సారంగ్ ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన సారంగ్ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో తల్లిదండ్రుల అంగీకారంతో అతని అవయవాలను దానం చేశారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!