Jharkhand: 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. గ్యాంగ్ రేప్.. వీడియో తీసి..
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న 16 దళిత బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోని హుస్సేనాబాద్ లో జరిగింది. బాలికను కిడ్నాప్ చేసి, ఊరి చివరకు తీసుకెళ్లి ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి వైరల్ చేస్తామని సదరు బాలికను నిందితులు బెదిరించారు.
Read Also: Gold Standard Burger: ఈ బర్గర్ ధర రూ. 55,000.. ఎందుకంత స్పెషల్..?
Also Read
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
- Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
- Shocking: జిమ్కు వెళ్తుందని భార్య దారుణహత్య..
- IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
హుస్సెనాబాద్ పీఎస్ పరిధిలోని పాలమూలో ఈ ఘటన జరిగింది. గురువారం అర్థరాత్రి ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన ఆరుగురు నిందితులు బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లడంతో బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉంది. గ్రామ శివారుకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా అదే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులు ఈ మొత్తం అఘాయిత్యాన్ని వీడియో తీసి ఎవరికైనా చెబితే వైరల్ చేస్తామని బెదిరించారు.
శుక్రవారం తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాగానే, జరిగిన ఘటన గురించి బాలిక వారికి తెలియజేసింది. గ్రామస్తుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా బాధితురాలి ఇంటి చుట్టుపక్కల నివాసం ఉంటున్నారు. నిందితులను నితీష్ కుమార్ ఠాకూర్, సచిన్ ఠాకూర్, రాజు ఠాకూర్, రోహిత్ ఠాకూర్, సచిన్ ఠాకూర్ అలియాస్ మజిలా, దినేష్ ఠాకూర్లగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో గ్రామస్తులు నిందితుల్లో ఒకరిని పట్టుకోగా.. మిగతా ఐదుగురు పరారయ్యారు. వీరికోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!