PM Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ భేటీ.. యుద్ధం తర్వాత ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi:రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర కావస్తోంది. తొలిసారిగా భారత ప్రధాని నరేంద్రమోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీతో తొలిసారి భేటీ అయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ, జెలెన్స్కీ మధ్య వ్యక్తిగతంగా భేటీ కావడం ఇదే తొలిసారి. జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ-7 దేశాల సదస్సుకు అతిథిగా ప్రధాని మోడీ వెళ్లారు. జపాన్ వేదికగా ఇరు దేశాల నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు.
Read Also: Care Hospital: కేర్ ఆస్పత్రిలో కేర్ కనెక్ట్.. అవయవ మార్పిడి రోగుల ఆత్మీయ సమ్మేళనం
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా భారత్ మాత్రం రష్యాతో స్నేహంగానే ఉంటోంది. మరోవైపు ఈ యుద్ధానిక పరిష్కారం చూపాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో పాటు ఉక్రెయిన్ ఇతర మంత్రులు ప్రధాని మోడీని కోరాయి. అయితే శాంతి ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలతో పలుమార్లు మాట్లాడారు. గతేడాది అక్టోబరు 4న జెలెన్స్కీతో ఫోన్ సంభాషణలో, “సైనిక పరిష్కారం” ఉండదని, ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా భారత్ సహకరించేందుకు సిద్ధంగా ఉందని మోడీ అన్నారు.
శనివారం ప్రధాని మోడీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, వియత్నాం ప్రధాని ఫామ్మిన్ చిన్ లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జీ 7 దేశాల కూటమిలో భారత్ కు సభ్యత్వం లేకున్నా, జపాన్ ప్రధాని కిషిడా ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశం వెళ్లారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!