Power War: కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య “పవర్ వార్”.. మళ్లీ సుప్రీంకు చేరిన పంచాయతీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Power War: కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ అధికారాల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలపై దృష్టిసారించారు. దీనికి అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. సేవల విభాగం కార్యదర్శి ఆశిష్ మోరేను బదిలీ చేశారు. ఇదిలా ఉంటే అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరుతూ శనివారం రిప్యూ పిటిషన్ వేసింది.
Read Also: Rahul Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంతకం ఆ 5 హామీలపైనే.. అవి ఏంటంటే..?
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇదిలా ఉంటే కేంద్ర చర్యలపై అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ అవుతున్నారు. కేంద్రం సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తోందని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అన్నారు. కేంద్రం సుప్రీంకోర్టుకు సవాల్క విసురుతోందని విమర్శించారు. దీనిపై పోరాటానికి ఆప్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఆర్డినెన్స్ పై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ పార్లమెంట్ ఆమోదం పొందదని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తోన్న అభిషేక్ సింఘ్వీ అన్నారు. మీరు మ్యాచ్ ఓడిపోయినప్పుడు నిబంధనలు మార్చుతుంటారు అంటూ కేంద్రాన్ని విమర్శించారు.
కేంద్రం ఈ ఆర్డినెన్స్ ద్వారా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఇది ఢిల్లీ ప్రభుత్వంలోని ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. దీంట్లో ముఖ్యమంత్రి చైర్ పర్సన్ గా, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోం సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. మెజారిటీ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా ఓటింగ్ లో ఫలితం తేలకుంటే.. లెఫ్టినెంట్ గవర్నర్ దే తుది నిర్ణయంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!