Hafiz Saeed: దాయాది దేశం పాకిస్తాన్ లో ఏదో జరుగుతోంది వరసగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమవుతున్నారు. దీంతో అక్కడ ఉన్న ఉగ్రవాదుల్లో భయం మొదలైంది. రెండుమూడు రోజుల క్రితం జియావుర్ రెహ్మన్ అనే హిజ్బుల్ ముజాహిద్ధీన్ ఉగ్రవాదిన కరాచీలో హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తుల వచ్చి ఆయన్ని హతమార్చారు. కాశ్మీర్ లో హిజ్బుల్ తరుపున ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసే పనిని ఈ ఉగ్రవాది చేసేవాడు.
US Visa: భారత్, అమెరికాల మధ్య ఇటీవల కాలంలో బంధం బలపడుతోంది. ఇటీవల కాలంలో భారతదేశానికి అగ్రరాజ్యం పెద్దపీట వేస్తోంది. భారతీయులకు వీసాలను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది 10 లక్షల మంది భారతీయులకు అమెరికా వీసాలను మంజూరు అయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికార సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అన్ని రకాల వీసాలు కలిసి ఈ రికార్డు నమోదైంది.
Stroke: వాయుకాలుష్యం, స్రోక్ మధ్య సంబంధాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్వల్పకాలిక వాయు కాలుష్యానికి గురికావడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. న్యూరాలజీ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారు. స్వల్పకాలికంగా వాయుకాలుష్యానికి గురైన ఐదు రోజుల వ్యవధిలోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తేల్చింది.
Pakistan: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉన్న దాయాది దేశం దక్షిణాసియాతో పాటు యూరప్ దేశాలకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసింది. చివరకు తన ఆర్థిక కష్టాల నుంచి గట్టేక్కడానికి చైనాకు గాడిదనలు ఎగుమతి చేసింది. ఇప్పుడు ఆ దేశం బిచ్చగాళ్లు, దొంగలను కూడా ఎగుమతి చేస్తోంది. మీరు వింటుంది నిజమే పరాయి దేశాలకు వెళ్లిన పాకిస్తానీయులు దొంగలు, బిచ్చగాళ్లుగా మారుతున్నారు.
Ujjain Case: ఉజ్జయిని అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. 15 ఏళ్ల బాలిక దారుణంగా అత్యాచారానికి గురై సాయం కోసం బతిమిలాడితే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదు. చివరకు రూ.50, 100 ఇవ్వాలని ప్రయత్నించారే తప్పితే తీవ్ర వేధనతో బాధపడుతున్న బాలికను ఆస్పత్రిలో చేర్చాలని చూడలేదు. ఈ అత్యాచార ఘటనలో ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కళ్లకు కట్టినట్లు చూపించింది.
Zealandia భూమిపై ఖండాలెన్ని అని అడిగితే వెంటనే 7, అవి ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా అని చెబుతాం. కానీ 8వ ఖండం కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. 375 ఏళ్లుగా తప్పిపోయిన ఓ ఖండాన్ని కనుగోన్నారు. అయితే కొత్త ఖండం దాదాపుగా 94 శాతం నీటి అడుగు భాగాన ఉండిపోయింది. జియోలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన ఓ పరిశోధన బృందం
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఒకటిన్నరేళ్లు గడుస్తున్నాయి. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య యుద్ధం సద్దుమణగలేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలనై పట్టు నిలుపుకునేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కి అమెరికా, యూకే, కెనడా వంటి వెస్ట్రన్ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. దీంతో పాటు ఉక్రెయిన్ కి కావాల్సిన ఆయుధ, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి.
Khalistan: భారతదేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా ఖలిస్తాన్ ఉగ్రసంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో రాడికల్ సిక్కులు భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఇతను కూడా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్)పేరుతో ఉగ్రవాద సంస్థను నడుపుతున్నారు.
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ పేరుకు ఆర్మీనే కానీ పాకిస్తాన్ భవితవ్యాన్ని, రాజకీయాలు శాసిస్తుంది. దేశంలో పలు వ్యాపారాలు పాకిస్తాన్ ఆర్మీనే నిర్వహిస్తోంది, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి పలు బిజినెస్ లలో పాక్ ఆర్మీ పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది. నిజం చెప్పాలంటే పాక్ ఆర్మీ ఒక్క యుద్ధం తప్ప అన్నీ చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతోంది.
India: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యవివాదానికి దారి తీసింది. కెనడా ప్రధాని నేరుగా భారత్ పై విమర్శలు గుప్పించడంతో పాటు భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. ఇక భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలివెళ్లాలని ఆదేశించింది. కెనడియన్ పౌరులకు వీసాల జారీని భారత్ తాత్కాలికంగా నిలిపేసింది. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.