Venu Goapl Reddy
Author- NTV Telugu-
Ashwini Vaishnaw: లోకో పైలట్లు తాగి విధులకు వస్తున్నారా..? ఐదేళ్లలో బ్రీత్లైజర్ టెస్టుల్లో 1761 మంది ఫెయిల్..
Ashwini Vaishnaw: రైల్వేలో ఒక్క పొరపాటు, ఒక్కరి తప్పు వేల మందిని బలిగొంటుంది. అలాంటి రైల్వేలో సిబ్బంది, లోకో పైలట్లకు సంబంధించి పరీక్షలు కూడా నిక్కచ్చిగా ఉంటాయి. తాజాగా రాజ్యసభలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రైల్వే అధికారులు మొత్తం 8,28,03,387 బ్రీత్లైజర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. -
Tipu Sultan Row: మరోసారి “టిప్పు సుల్తాన్” వివాదం.. మైసూర్ ఎయిర్పోర్టు పేరు మార్పు ప్రతిపాదన..
Tipu Sultan Row: కర్ణాటకలో మరోసారి టిప్పు సుల్తాన్ వివాదం తెరపైకి వచ్చింది. గతంలో టిప్పు పేరు రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. మరోసారి మైసూరు విమానాశ్రయం పేరు మార్పు వివాదం నేపథ్యంలో టిప్పు వివాదం రాజుకుంది. మైసూర్ ఎయిర్ పోర్టు (మందకల్లి విమానాశ్రయం) పేరును టిప్పు సుల్తాన్ విమానాశ్రయంగా మార్చాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాదించారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. -
IPL 2024: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మకి చెక్..
IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్కి కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను శుక్రవారం ప్రకటించింది. రోహిత్ శర్మను పక్కన పెట్టింది. వారసత్వ నిర్మాణంలో భాగంగా, భవిష్యత్తు తరాన్ని సిద్ధం చేసేందుకే ఎంఐ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
Ayesha Omar: “నా సొంత దేశంలోనే నాకు భద్రత లేదు”.. పాకిస్తాన్ నటి సంచలన వ్యాఖ్యలు..
Ayesha Omar: పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని అందరికీ తెలుసు. అక్కడ మహిళకు కూడా భద్రత లేదు. ఒంటరిగా మహిళలు కనపిస్తే కిడ్నాప్కి గురవ్వడం, అత్యాచారానికి గురవ్వడం అక్కడ సర్వసాధారణంగా మారింది. అయితే, తాజాగా ఆ దేశ ప్రముఖ నటి అయేషా ఒమర్ కూడా పాకిస్తాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్నాన్ ఫైసల్ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడారు. -
Parliament security breach: పార్లమెంట్ దాడి.. ప్రధాన సూత్రధారికి 7 రోజుల పోలీస్ కస్టడీ..
Parliament security breach: పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించి, దాడికి యత్నించిన కేసులో మాస్టర్ మైండ్గా చెప్పబడుతున్న లలిత్ ఝాకి ఢిల్లీ పాటియాల హౌజ్ కోర్టు 7 ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఢిల్లీ పోలీసులు పోలీసులు 15 రోజలు కస్టడీ కోరగా.. కోర్టు 7 రోజులకు పరిమితం చేసింది. ఈ దాడి ఘటనలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే పరారీలో ఉన్న లలిత్ ఝా గురువారం పోలీసులకు లొంగిపోయాడు. -
Parliament Attack: పార్లమెంట్పై దాడికి ప్లాన్-బి కూడా ఉంది.. విచారణలో సంచలన విషయాలు..
Parliament Attack: బుధవారం పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన సంఘటన యావత్ దేశాన్ని కలవరపరిచింది. అత్యంత భద్రత ఉన్న సెక్యూరిటీని దాటుకుని ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ఛాంబర్లోకి వెళ్లి స్మోక్ కానస్టర్లను పేల్చడం ఆందోళన రేకెత్తించింది. 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి జరిగి డిసెంబర్ 13 తేదీ రోజునే నిందితులు ఈ ఘటనకు ఒడిగట్టారు. అయితే ఈ కేసులో పార్లమెంట్ లోపల ఘటనకు పాల్పడిన సాగర్ శర్మ, మనోరంజన్ తో పాటు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా చర్యలకు పాల్పడిన నీలందేవి, అమోల్ షిండేలను పోలీసులు… -
Rishi Sunak: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. పరిశీలిస్తున్న యూకే ప్రభుత్వం….
Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ బ్యాన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. అయితే దీనిపై చర్చల విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి అక్కడి ప్రభుత్వ వర్గాలు. సోషల్ మీడియా వల్ల పిల్లలపై ఎంత వరకు హాని కలుగుతుందనే విషయంపై మంత్రులు జనవరి నుంచి సంప్రదింపులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. -
Hamas War: ఇజ్రాయిల్ తదుపరి లక్ష్యం హమాస్ నాయకత్వమే.. అమెరికా కీలక వ్యాఖ్యలు..
Hamas War: హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తమ లక్ష్యాలు నెరవేరే దాకా యుద్ధాన్ని ఆపేది లేదని, ఎంత ఒత్తిడి ఎదురైనా కూడా యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల చెప్పారు. దానికి అనుగుణంగానే ఇజ్రాయిల, గాజస్ట్రిప్పై విరుచుకుపడుతోంది. దీంతో పాటు వెస్ట్ బ్యాంకులో కూడా దాడులు నిర్వహిస్తోంది. -
Iran: భారతీయులకు వీసా అవసరం లేదు.. ఇరాన్ కీలక నిర్ణయం..
Iran: భారతీయ సందర్శకులకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి వచ్చే భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే సందర్శకుల వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ మంత్రివర్గం నిర్ణయించిందని ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి తెలిపారు. భారత్తో సహా 33 దేశాలకు వీసా నిబంధనలను రద్దు చేస్తూ ఇరాన్ బుధవారం నిర్ణయం తీసుకుంది. -
Gurpatwant Singh Pannun: “చెక్ కోర్టుకు వెళ్లండి”.. పన్నూ హత్య కుట్ర కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు..
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలతో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిఖిల్ గుప్తా కుటుంబం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!