IND vs SL: స్మృతి మంధాన, షఫాలీ వర్మ ధనాధన్ బ్యాటింగ్.. నాల్గో టీ20లోనూ టీమిండియా జయభేరి..!
- మహిళల నాలుగో టీ20..
- 30 పరుగుల తేడాతో భారత్ విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL: తిరువనంతపురం వేదికగా జరిగిన నాల్గో మహిళల టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మల ధనాధన్ బ్యాటింగ్తో భారత్ భారీ స్కోర్ నమోదు చేయడంతో శ్రీలంకపై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువురు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
స్మృతి మంధాన 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు, షఫాలీ వర్మ 46 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ తో 79 పరుగులు సాధించారు. వీరిద్దరు అవుటైన తర్వాత రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 16 బంతుల్లో 40 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. ఆమెకు తోడుగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా 16 పరుగులు చేయడంతో జట్టుకు భారీ స్కోర్ అందుకుంది. ఈ ఇన్నింగ్స్ లో స్మృతి మంధాన ఇంటెర్నేషన్ క్రికెట్ లో 10000 పరుగుల మెయిలు రాయిని అందుకుంది. అలాగే షఫాలీ వర్మ వరుసగా మూడో హాఫ్ సెంచరీని నమోదు చేసింది.
ఇక 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక ఇన్నింగ్స్ లో చమరి అథపత్తు 37 బంతుల్లో 52 పరుగులు.. హసిని పెరెరా 33 పరుగులు చేసినా భారీ లక్ష్యాన్ని చేధించలేకపోయారు. మిగితావారి సహకారం అందకపోవడంతో 191 పరుగులకే పరిమితమైయింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, అరుంధతి రెడ్డిలు చెరో రెండు వికెట్లు తీసి కీలకంగా రాణించారు. ఇదివరకే సిరీస్ కైవసం చేసుకోగా.. దీంతో భారత్ ఈ సిరీస్ 4-0 ఆధిపత్యం మరింత పెంచింది.
తాజావార్తలు
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!