Stroke: వాయుకాలుష్యం, పక్షవాతం మధ్య సంబంధం.. పరిశోధకులు ఏం చెప్పారంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stroke: వాయుకాలుష్యం, స్రోక్ మధ్య సంబంధాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్వల్పకాలిక వాయు కాలుష్యానికి గురికావడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. న్యూరాలజీ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారు. స్వల్పకాలికంగా వాయుకాలుష్యానికి గురైన ఐదు రోజుల వ్యవధిలోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తేల్చింది.
స్ట్రోక్ వల్ల మెదడు దెబ్బతినడంతో పాటు దీర్ఘకాలిక వైకల్యం, మరణాలకు కారణమవుతుంది. ఒక్కోసారి పక్షవాతం వల్ల శరీరంలో ఒక వైపు భాగాలు పనిచేయకుండా పోతాయి. గతంలో దీర్ఘకాలిక వాయుకాలుష్యం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చిందని అమ్మాన్ లోని జోర్డాన్ యూనివర్సిటీ ప్రధాన రచయిత అహ్మద్ తౌబాసి చెప్పారు. అయితే స్వల్పకాలికంగా వాయుకాలుష్యం ఎలాంటి వ్రభావం చూపిస్తుందో అని పరిశోధిస్తే.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని, స్వల్పకాలిక వాయుకాలుష్యం కూడా కేవలం 5 రోజుల్లో స్ట్రోక్ కి కారణమవుతుందని తేలిందని వెల్లడించారు.
Also Read
- Ragi Punugulu - Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ఫాస్ట్.. సింపుల్గా ఇలా చేసేయండి!
- Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
- Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ 'పాలక్ పరోటా'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో 'గోంగూర పులిహోర'.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
Read Also: Salaar: సలార్ బ్లాక్ బస్టర్ హిట్.. కెజిఎఫ్ కు మించి ఉంది.. థియేటర్ లో అరుపులే
110 అధ్యయనాల్లో 18 మిలియన్లకు పైగా స్ట్రోక్ కేసుల్ని పరిశీలించారు. ఈ పరిశోధనలో నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్యాల ప్రభావాన్ని విశ్లేషించారు. 1 మైక్రాన్, PM2.5, PM10, PM1 వంటి పరిమాణాలు ఉన్న వాయుకాలుష్య రేణువుల్ని పరిశీలించారు. PM2.5 కాలుష్య రేణువుల వాహనాలు, పవర్ ప్లాంట్లు, ఇతర ఇంధనాలు కాల్చడం వల్ల వెలువడుతుంది. అధిక సాంద్రత కలిగిన కాలుష్యం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం 28 శాతం, ఓజోన్ స్థాయిలు వల్ల 5 శాతం పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ 26 శాతం, సల్ఫర్ డయాక్సైడ్ 15 శాతం స్ట్రోక్ ప్రమాదం ఉందని తెలిపారు. PM1 అధిక సాంద్రత వల్ల 9 శాతం, PM2.5 కాలుష్యం వల్ల 15 శాతం, PM10 వల్ల 14 శాతం స్ట్రోక్ ప్రమాదం ఉన్నట్లు తేలింది. అయితే 60 శాతం నైట్రోజన్ డయాక్సడ్ సాంద్రత ఉంటే 33 శాతం స్ట్రోక్స్ మరణాలకు దారి తీస్తుందని, సల్ఫర్ డయాక్సైడ్ వల్ల 60 శాతం, పీఎ 2.5 వల్ల 9 శాతం, పీఎం 10 వల్ల 2 శాతం వల్ల స్ట్రోక్ రిలేటెడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని తేలింది.
తాజావార్తలు
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!