Stroke: వాయుకాలుష్యం, పక్షవాతం మధ్య సంబంధం.. పరిశోధకులు ఏం చెప్పారంటే.?
Stroke: వాయుకాలుష్యం, స్రోక్ మధ్య సంబంధాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్వల్పకాలిక వాయు కాలుష్యానికి గురికావడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. న్యూరాలజీ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారు. స్వల్పకాలికంగా వాయుకాలుష్యానికి గురైన ఐదు రోజుల వ్యవధిలోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తేల్చింది.
స్ట్రోక్ వల్ల మెదడు దెబ్బతినడంతో పాటు దీర్ఘకాలిక వైకల్యం, మరణాలకు కారణమవుతుంది. ఒక్కోసారి పక్షవాతం వల్ల శరీరంలో ఒక వైపు భాగాలు పనిచేయకుండా పోతాయి. గతంలో దీర్ఘకాలిక వాయుకాలుష్యం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చిందని అమ్మాన్ లోని జోర్డాన్ యూనివర్సిటీ ప్రధాన రచయిత అహ్మద్ తౌబాసి చెప్పారు. అయితే స్వల్పకాలికంగా వాయుకాలుష్యం ఎలాంటి వ్రభావం చూపిస్తుందో అని పరిశోధిస్తే.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని, స్వల్పకాలిక వాయుకాలుష్యం కూడా కేవలం 5 రోజుల్లో స్ట్రోక్ కి కారణమవుతుందని తేలిందని వెల్లడించారు.
Also Read
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
- Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
- Bad Breath Remedies: నోటి దుర్వాసనతో విసిగిపోయారా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.!
Read Also: Salaar: సలార్ బ్లాక్ బస్టర్ హిట్.. కెజిఎఫ్ కు మించి ఉంది.. థియేటర్ లో అరుపులే
110 అధ్యయనాల్లో 18 మిలియన్లకు పైగా స్ట్రోక్ కేసుల్ని పరిశీలించారు. ఈ పరిశోధనలో నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్యాల ప్రభావాన్ని విశ్లేషించారు. 1 మైక్రాన్, PM2.5, PM10, PM1 వంటి పరిమాణాలు ఉన్న వాయుకాలుష్య రేణువుల్ని పరిశీలించారు. PM2.5 కాలుష్య రేణువుల వాహనాలు, పవర్ ప్లాంట్లు, ఇతర ఇంధనాలు కాల్చడం వల్ల వెలువడుతుంది. అధిక సాంద్రత కలిగిన కాలుష్యం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం 28 శాతం, ఓజోన్ స్థాయిలు వల్ల 5 శాతం పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ 26 శాతం, సల్ఫర్ డయాక్సైడ్ 15 శాతం స్ట్రోక్ ప్రమాదం ఉందని తెలిపారు. PM1 అధిక సాంద్రత వల్ల 9 శాతం, PM2.5 కాలుష్యం వల్ల 15 శాతం, PM10 వల్ల 14 శాతం స్ట్రోక్ ప్రమాదం ఉన్నట్లు తేలింది. అయితే 60 శాతం నైట్రోజన్ డయాక్సడ్ సాంద్రత ఉంటే 33 శాతం స్ట్రోక్స్ మరణాలకు దారి తీస్తుందని, సల్ఫర్ డయాక్సైడ్ వల్ల 60 శాతం, పీఎ 2.5 వల్ల 9 శాతం, పీఎం 10 వల్ల 2 శాతం వల్ల స్ట్రోక్ రిలేటెడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని తేలింది.
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!