Stroke: వాయుకాలుష్యం, పక్షవాతం మధ్య సంబంధం.. పరిశోధకులు ఏం చెప్పారంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stroke: వాయుకాలుష్యం, స్రోక్ మధ్య సంబంధాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్వల్పకాలిక వాయు కాలుష్యానికి గురికావడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. న్యూరాలజీ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారు. స్వల్పకాలికంగా వాయుకాలుష్యానికి గురైన ఐదు రోజుల వ్యవధిలోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తేల్చింది.
స్ట్రోక్ వల్ల మెదడు దెబ్బతినడంతో పాటు దీర్ఘకాలిక వైకల్యం, మరణాలకు కారణమవుతుంది. ఒక్కోసారి పక్షవాతం వల్ల శరీరంలో ఒక వైపు భాగాలు పనిచేయకుండా పోతాయి. గతంలో దీర్ఘకాలిక వాయుకాలుష్యం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చిందని అమ్మాన్ లోని జోర్డాన్ యూనివర్సిటీ ప్రధాన రచయిత అహ్మద్ తౌబాసి చెప్పారు. అయితే స్వల్పకాలికంగా వాయుకాలుష్యం ఎలాంటి వ్రభావం చూపిస్తుందో అని పరిశోధిస్తే.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని, స్వల్పకాలిక వాయుకాలుష్యం కూడా కేవలం 5 రోజుల్లో స్ట్రోక్ కి కారణమవుతుందని తేలిందని వెల్లడించారు.
Also Read
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- Vaping: యువతకి షాక్ ఇచ్చిన సైంటిస్టులు.. ఇలా చేస్తే లంగ్, ఓరల్ క్యాన్సర్!
- Bellam Rava Laddu: నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! 10 నిమిషాల్లో హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు’.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేయొచ్చు!
Read Also: Salaar: సలార్ బ్లాక్ బస్టర్ హిట్.. కెజిఎఫ్ కు మించి ఉంది.. థియేటర్ లో అరుపులే
110 అధ్యయనాల్లో 18 మిలియన్లకు పైగా స్ట్రోక్ కేసుల్ని పరిశీలించారు. ఈ పరిశోధనలో నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్యాల ప్రభావాన్ని విశ్లేషించారు. 1 మైక్రాన్, PM2.5, PM10, PM1 వంటి పరిమాణాలు ఉన్న వాయుకాలుష్య రేణువుల్ని పరిశీలించారు. PM2.5 కాలుష్య రేణువుల వాహనాలు, పవర్ ప్లాంట్లు, ఇతర ఇంధనాలు కాల్చడం వల్ల వెలువడుతుంది. అధిక సాంద్రత కలిగిన కాలుష్యం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం 28 శాతం, ఓజోన్ స్థాయిలు వల్ల 5 శాతం పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ 26 శాతం, సల్ఫర్ డయాక్సైడ్ 15 శాతం స్ట్రోక్ ప్రమాదం ఉందని తెలిపారు. PM1 అధిక సాంద్రత వల్ల 9 శాతం, PM2.5 కాలుష్యం వల్ల 15 శాతం, PM10 వల్ల 14 శాతం స్ట్రోక్ ప్రమాదం ఉన్నట్లు తేలింది. అయితే 60 శాతం నైట్రోజన్ డయాక్సడ్ సాంద్రత ఉంటే 33 శాతం స్ట్రోక్స్ మరణాలకు దారి తీస్తుందని, సల్ఫర్ డయాక్సైడ్ వల్ల 60 శాతం, పీఎ 2.5 వల్ల 9 శాతం, పీఎం 10 వల్ల 2 శాతం వల్ల స్ట్రోక్ రిలేటెడ్ మరణాలు సంభవించే అవకాశం ఉందని తేలింది.
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..