Pakistan: తుపాకులు వదిలి నాగళ్లు పట్టనున్న పాకిస్తాన్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ పేరుకు ఆర్మీనే కానీ పాకిస్తాన్ భవితవ్యాన్ని, రాజకీయాలు శాసిస్తుంది. దేశంలో పలు వ్యాపారాలు పాకిస్తాన్ ఆర్మీనే నిర్వహిస్తోంది, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి పలు బిజినెస్ లలో పాక్ ఆర్మీ పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది. నిజం చెప్పాలంటే పాక్ ఆర్మీ ఒక్క యుద్ధం తప్ప అన్నీ చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతోంది.
దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు నేరుగా పాకిస్తాన్ సైన్యమే రంగంలోకి దిగుతోంది. ఇక తుపాకులను వదిలి నాగళ్లను పట్టనుంది. వ్యవసాయం చేసేందుకు తమకు 10 లక్షల ఎకరాల భూమి కావాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. పంజాబ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చోలిస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ భూమి కావాలని కోరింది. ఢిల్లీ నగర విస్తీర్ణంతో పోలిస్తే మూడు రెట్ల భూమిని పాక్ సైన్యం హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది.
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Sheikh Hasina: "నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు": షేక్ హసీనా
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
Read Also: Lentil imports: కెనడా నుంచి ఇండియాకి తగ్గిన పప్పు ధాన్యాల దిగుమతులు..
దాదాపుగా 30 ఏళ్ల పాటు ఈ భూమిని పాక్ ఆర్మీ లీజుకు తీసుకోబోతోంది. గోధుమ, ప్రత్తి, చెరకు వంటి వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, పండ్లను పండించనుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేయకుండా మేం చూస్తామని పాక్ ఆర్మీ చెబుతోంది. దీనిపై వచ్చే లాభంలో 20 శాతం వ్యవసాయ అభివృద్ధి పరిశోధనకు కేటాయిస్తామని చెబుతోంది.40 శాతం ఆర్మీకి, 40 శాతం పంజాబ్ ప్రభుత్వానికి వెళ్తాయి. అయితే ఇందులో పాక్ ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుందని పలువరు ప్రశ్నలు లేవనెత్తతున్నారు.
దీనికోసం పాక్ ఆర్మీ ఫామ్ గ్రో అనే సంస్థ ఏర్పాటు చేసి రిటైర్డ్ ఆర్మీ అధికారిని చీఫ్ గా నియమించింది. అయితే ఈ భూబదలాయింపులపై లాహోర్ హైకోర్టులో వ్యతిరేకిస్తూ కేసు ఉంటే, జూలై నెలలో మరో బెంజ్ పాక్ ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూ బదలాయింపు వేగంగా జరుగుతోంది. ఈ ప్రణాళిక వల్ల సాధారణ పాకిస్తాన్ రైతులు రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడుతుందని కొందరు నిపుణులు భయపడుతున్నారు.
తాజావార్తలు
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!