Pakistan: తుపాకులు వదిలి నాగళ్లు పట్టనున్న పాకిస్తాన్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ పేరుకు ఆర్మీనే కానీ పాకిస్తాన్ భవితవ్యాన్ని, రాజకీయాలు శాసిస్తుంది. దేశంలో పలు వ్యాపారాలు పాకిస్తాన్ ఆర్మీనే నిర్వహిస్తోంది, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి పలు బిజినెస్ లలో పాక్ ఆర్మీ పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది. నిజం చెప్పాలంటే పాక్ ఆర్మీ ఒక్క యుద్ధం తప్ప అన్నీ చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతోంది.
దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు నేరుగా పాకిస్తాన్ సైన్యమే రంగంలోకి దిగుతోంది. ఇక తుపాకులను వదిలి నాగళ్లను పట్టనుంది. వ్యవసాయం చేసేందుకు తమకు 10 లక్షల ఎకరాల భూమి కావాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. పంజాబ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చోలిస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ భూమి కావాలని కోరింది. ఢిల్లీ నగర విస్తీర్ణంతో పోలిస్తే మూడు రెట్ల భూమిని పాక్ సైన్యం హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది.
Also Read
- Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
- US Airstrikes on Iran: ఆపండ్రోయ్.. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్పై అమెరికా బాంబులు, పేలుళ్లతో వణికిన ఇరాన్
- Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
Read Also: Lentil imports: కెనడా నుంచి ఇండియాకి తగ్గిన పప్పు ధాన్యాల దిగుమతులు..
దాదాపుగా 30 ఏళ్ల పాటు ఈ భూమిని పాక్ ఆర్మీ లీజుకు తీసుకోబోతోంది. గోధుమ, ప్రత్తి, చెరకు వంటి వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, పండ్లను పండించనుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేయకుండా మేం చూస్తామని పాక్ ఆర్మీ చెబుతోంది. దీనిపై వచ్చే లాభంలో 20 శాతం వ్యవసాయ అభివృద్ధి పరిశోధనకు కేటాయిస్తామని చెబుతోంది.40 శాతం ఆర్మీకి, 40 శాతం పంజాబ్ ప్రభుత్వానికి వెళ్తాయి. అయితే ఇందులో పాక్ ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుందని పలువరు ప్రశ్నలు లేవనెత్తతున్నారు.
దీనికోసం పాక్ ఆర్మీ ఫామ్ గ్రో అనే సంస్థ ఏర్పాటు చేసి రిటైర్డ్ ఆర్మీ అధికారిని చీఫ్ గా నియమించింది. అయితే ఈ భూబదలాయింపులపై లాహోర్ హైకోర్టులో వ్యతిరేకిస్తూ కేసు ఉంటే, జూలై నెలలో మరో బెంజ్ పాక్ ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూ బదలాయింపు వేగంగా జరుగుతోంది. ఈ ప్రణాళిక వల్ల సాధారణ పాకిస్తాన్ రైతులు రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడుతుందని కొందరు నిపుణులు భయపడుతున్నారు.
తాజావార్తలు
-
Faiza Ali: భర్త ఉన్నాక మరో హీరో చేతుల్లో ఊగలేను.. నటి ఫైజా అలీ ఓపెన్ కామెంట్స్
-
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికులకు షాకింగ్ న్యూస్.. 5 రోజుల్లోనే! అసలు ఏం జరిగింది?
-
Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
-
Gautam Gambhir: ‘వీ వాంట్ సంజూ’.. కోచ్ కీలక వ్యాఖ్యలు.!
-
Dada FirstLook : సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ ఫస్ట్ లుక్ రిలీజ్
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!