Pakistan: తుపాకులు వదిలి నాగళ్లు పట్టనున్న పాకిస్తాన్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ పేరుకు ఆర్మీనే కానీ పాకిస్తాన్ భవితవ్యాన్ని, రాజకీయాలు శాసిస్తుంది. దేశంలో పలు వ్యాపారాలు పాకిస్తాన్ ఆర్మీనే నిర్వహిస్తోంది, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి పలు బిజినెస్ లలో పాక్ ఆర్మీ పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది. నిజం చెప్పాలంటే పాక్ ఆర్మీ ఒక్క యుద్ధం తప్ప అన్నీ చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ వ్యవసాయం చేసేందుకు సిద్ధమవుతోంది.
దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు నేరుగా పాకిస్తాన్ సైన్యమే రంగంలోకి దిగుతోంది. ఇక తుపాకులను వదిలి నాగళ్లను పట్టనుంది. వ్యవసాయం చేసేందుకు తమకు 10 లక్షల ఎకరాల భూమి కావాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. పంజాబ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చోలిస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ భూమి కావాలని కోరింది. ఢిల్లీ నగర విస్తీర్ణంతో పోలిస్తే మూడు రెట్ల భూమిని పాక్ సైన్యం హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది.
Also Read
- Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
- Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
- Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
Read Also: Lentil imports: కెనడా నుంచి ఇండియాకి తగ్గిన పప్పు ధాన్యాల దిగుమతులు..
దాదాపుగా 30 ఏళ్ల పాటు ఈ భూమిని పాక్ ఆర్మీ లీజుకు తీసుకోబోతోంది. గోధుమ, ప్రత్తి, చెరకు వంటి వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, పండ్లను పండించనుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేయకుండా మేం చూస్తామని పాక్ ఆర్మీ చెబుతోంది. దీనిపై వచ్చే లాభంలో 20 శాతం వ్యవసాయ అభివృద్ధి పరిశోధనకు కేటాయిస్తామని చెబుతోంది.40 శాతం ఆర్మీకి, 40 శాతం పంజాబ్ ప్రభుత్వానికి వెళ్తాయి. అయితే ఇందులో పాక్ ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుందని పలువరు ప్రశ్నలు లేవనెత్తతున్నారు.
దీనికోసం పాక్ ఆర్మీ ఫామ్ గ్రో అనే సంస్థ ఏర్పాటు చేసి రిటైర్డ్ ఆర్మీ అధికారిని చీఫ్ గా నియమించింది. అయితే ఈ భూబదలాయింపులపై లాహోర్ హైకోర్టులో వ్యతిరేకిస్తూ కేసు ఉంటే, జూలై నెలలో మరో బెంజ్ పాక్ ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూ బదలాయింపు వేగంగా జరుగుతోంది. ఈ ప్రణాళిక వల్ల సాధారణ పాకిస్తాన్ రైతులు రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడుతుందని కొందరు నిపుణులు భయపడుతున్నారు.
తాజావార్తలు
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
-
Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
-
Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
-
Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు సొంతం..
-
Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!