Lentil imports: కెనడా నుంచి ఇండియాకి తగ్గిన పప్పు ధాన్యాల దిగుమతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lentil imports: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యవివాదానికి దారి తీసింది. కెనడా ప్రధాని నేరుగా భారత్ పై విమర్శలు గుప్పించడంతో పాటు భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. ఇక భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలివెళ్లాలని ఆదేశించింది. కెనడియన్ పౌరులకు వీసాల జారీని భారత్ తాత్కాలికంగా నిలిపేసింది. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే ఈ దౌత్య వివాదం, వాణిజ్య వివాదంగా మారుతుందా..? అనే భయాలు పట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా నుంచి భారత్ దిగుమతి చేసుకునే పప్పు ధాన్యాల దిగుమతులు మందగించినట్లు తెలుస్తోంది. భారత దేశానికి దిగుమతులు తగ్గితే కెనడా రైతులకు తక్కువ ధరకు దారి తీయవచ్చు. ఇదే సమయంలో భారతదేశంలో ధరలు పెరిగే అవకాశం ఉంది.
Also Read
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
దేశంలో లభ్యత తగ్గడంతో గతేడాది భారత్ గోధుల ఎగుమతులపై నిషేధం విధించింది. బాస్మతీయేతర వైట్ రైస్ పై కూడా నిషేధం విధించింది. దీని ద్వారా దేశీయంగా లభ్యత పెంచడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో వాణిజ్య ఆంక్షలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Read Also: UNFPA: రాబోయే దశాబ్దాల్లో యువభారతం వృద్ధాప్య సమాజంగా మారుతుంది..
ఇండియాలో ప్రధాన దిగుమతిదారుగా ఉన్న ఓలమ్ అగ్రి ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ గుప్తా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాణిజ్య ఆంక్షలు రావచ్చనే ఆందోళన వెలిబుచ్చారు. కెనడా నుంచి దిగుమతులను తిరస్కరించాలని ప్రభుత్వం దిగుమతిదారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఓ అధికారి వెల్లడించారు.
ఇదిలా ఉండగా, కెనడా గ్లోబల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అధికారులు కెనడా ప్రస్తుతం భారత్తో వాణిజ్యంపై ప్రభావం చూపే ఎలాంటి ప్రత్యక్ష చర్య తీసుకోలేదని తెలిపారు. ఇండియాలో పప్పు ధాన్యాలకు డిమాండ్ ఉంది. భారత్ లో పప్పు ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఇతర దేశాలపై ఆధారపడుతోంది. కెనడా ప్రధాని భారత్ పై ఆరోపణలు చేసిన తర్వాత కెనడా నుంచి సప్లైలో 6 శాతం తగ్గాయని విన్నిపెగ్ కు చెందిన క్రాప్ ట్రేడర్ పారిష్ అండ్ హెమ్ బేకర్ వ్యాపారి కెవిన్ ప్రైస్ తెలిపారు.
పప్పు ధాన్యాల దిగుమతుల్లో కెనడా నుంచి సగం ఉన్నాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కెనడియన్ పప్పు ధాన్యాల దిగుమతులు ఏడాదికి 420 శాతం పెరిగి 1,90,784 టన్నులకు చేరుకుంది. అయితే వాణిజ్య ఆంక్షల భయంతో కెనడాపై ఎక్కువగా ఆధారపడకుండా భారతీయ కొనుగోలుదారులు ఆస్ట్రేలియా వంటి ప్రత్నామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!