TG Assembly: కాంగ్రెస్ ఇరుకునపెట్టే బీఆర్ఎస్ వ్యూహాలేంటి?
- అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఫోకస్
- నదీ జలాల అంశంతో కాంగ్రెస్కు ఇబ్బంది
- సభ రోజులపై అధికార–విపక్ష ఘర్షణ
- హెల్త్ పాలసీ, గురుకులాలపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Assembly: రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వాడివేడిగా సాగనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు , ఇతర రాజకీయ పరిణామాలను గమనిస్తే, ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీకి హాజరు కానుండటం చర్చనీయాంశంగా మారింది. సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే పకడ్బందీ వ్యూహాలను సిద్ధం చేసుకుంది.
కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నదీ జలాల కేటాయింపులు, ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా, తమకు కూడా తమ వాదన వినిపించేందుకు సమాన అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
అసెంబ్లీ నిర్వహణ విషయంలో కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వం కేవలం మూడు రోజులే సమావేశాలు నిర్వహించాలని చూస్తోందని, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కనీసం 15 రోజుల పాటు సభను నడపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గతంలో తమ హయాంలో సగటున 32 రోజులు సభ సాగేదని, ఇప్పుడు ఆ సంఖ్య 20కి పడిపోవడం ప్రభుత్వానికి అసెంబ్లీ అంటే ఉన్న వణుకును సూచిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
నూతన హెల్త్ పాలసీలో జరిగిందని ఆరోపిస్తున్న రూ. 5 లక్షల కోట్ల కుంభకోణం, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై బీఆర్ఎస్ గట్టిగా పోరాడేందుకు సిద్ధమైంది. మరోవైపు హౌస్ కమిటీల ఏర్పాటు చేయకపోవడాన్ని కూడా విపక్షాలు తప్పుబడుతున్నాయి. కేసీఆర్ రాకతో సభలో చర్చలు ఏ స్థాయికి చేరుతాయోనని రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
-
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
-
China halts J10CE Delivery: భారత్ రఫేల్పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!