TG Assembly: కాంగ్రెస్ ఇరుకునపెట్టే బీఆర్ఎస్ వ్యూహాలేంటి?
- అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఫోకస్
- నదీ జలాల అంశంతో కాంగ్రెస్కు ఇబ్బంది
- సభ రోజులపై అధికార–విపక్ష ఘర్షణ
- హెల్త్ పాలసీ, గురుకులాలపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Assembly: రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వాడివేడిగా సాగనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు , ఇతర రాజకీయ పరిణామాలను గమనిస్తే, ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీకి హాజరు కానుండటం చర్చనీయాంశంగా మారింది. సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే పకడ్బందీ వ్యూహాలను సిద్ధం చేసుకుంది.
కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నదీ జలాల కేటాయింపులు, ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా, తమకు కూడా తమ వాదన వినిపించేందుకు సమాన అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
అసెంబ్లీ నిర్వహణ విషయంలో కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వం కేవలం మూడు రోజులే సమావేశాలు నిర్వహించాలని చూస్తోందని, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కనీసం 15 రోజుల పాటు సభను నడపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గతంలో తమ హయాంలో సగటున 32 రోజులు సభ సాగేదని, ఇప్పుడు ఆ సంఖ్య 20కి పడిపోవడం ప్రభుత్వానికి అసెంబ్లీ అంటే ఉన్న వణుకును సూచిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
నూతన హెల్త్ పాలసీలో జరిగిందని ఆరోపిస్తున్న రూ. 5 లక్షల కోట్ల కుంభకోణం, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై బీఆర్ఎస్ గట్టిగా పోరాడేందుకు సిద్ధమైంది. మరోవైపు హౌస్ కమిటీల ఏర్పాటు చేయకపోవడాన్ని కూడా విపక్షాలు తప్పుబడుతున్నాయి. కేసీఆర్ రాకతో సభలో చర్చలు ఏ స్థాయికి చేరుతాయోనని రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!