TG Assembly: కాంగ్రెస్ ఇరుకునపెట్టే బీఆర్ఎస్ వ్యూహాలేంటి?
- అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఫోకస్
- నదీ జలాల అంశంతో కాంగ్రెస్కు ఇబ్బంది
- సభ రోజులపై అధికార–విపక్ష ఘర్షణ
- హెల్త్ పాలసీ, గురుకులాలపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Assembly: రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వాడివేడిగా సాగనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు , ఇతర రాజకీయ పరిణామాలను గమనిస్తే, ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీకి హాజరు కానుండటం చర్చనీయాంశంగా మారింది. సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే పకడ్బందీ వ్యూహాలను సిద్ధం చేసుకుంది.
కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నదీ జలాల కేటాయింపులు, ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా, తమకు కూడా తమ వాదన వినిపించేందుకు సమాన అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
అసెంబ్లీ నిర్వహణ విషయంలో కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వం కేవలం మూడు రోజులే సమావేశాలు నిర్వహించాలని చూస్తోందని, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కనీసం 15 రోజుల పాటు సభను నడపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గతంలో తమ హయాంలో సగటున 32 రోజులు సభ సాగేదని, ఇప్పుడు ఆ సంఖ్య 20కి పడిపోవడం ప్రభుత్వానికి అసెంబ్లీ అంటే ఉన్న వణుకును సూచిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
నూతన హెల్త్ పాలసీలో జరిగిందని ఆరోపిస్తున్న రూ. 5 లక్షల కోట్ల కుంభకోణం, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై బీఆర్ఎస్ గట్టిగా పోరాడేందుకు సిద్ధమైంది. మరోవైపు హౌస్ కమిటీల ఏర్పాటు చేయకపోవడాన్ని కూడా విపక్షాలు తప్పుబడుతున్నాయి. కేసీఆర్ రాకతో సభలో చర్చలు ఏ స్థాయికి చేరుతాయోనని రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!