Afghanistan: భారతదేశంలో ఆఫ్ఘానిస్తాన్ తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. న్యూఢిల్లీలో ఆఫ్గాన్ ఎంబసీ మూసివేసింది. గత కొన్ని నెలలుగా భారత్ లో ఆఫ్ఘాన్ రాయబారి లేరు. ఢిల్లీలోని ఆఫ్ఘాన్ దౌత్యవేత్తలు కూడా యూకే, అమెరికా వెళ్లి ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత్ లో ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయం అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ముగ్గురు రాయబార కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
Women Reservation Bill: చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. ఇటీవల పార్లమెంట్ లోని ఉభయసభలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాయి. తాజాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది.
ISKCON: ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్) బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి రూ. 100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపింది. ఇటీవల ఆమె ఇస్కాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమపై పూర్తి నిరాధార ఆరోపణలు చేయడంతో భక్తులు తీవ్రమైన బాధను వ్యక్తం చేశారని ఇస్కాన్ పేర్కొంది. ఇస్కాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా తాము న్యాయం కోసం ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టమని ఇస్కాన్ కోల్కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ అన్నారు.
Google Layoff: ఆర్థిక మందగమనం, ఆర్థికమంద్యం భయాలు టెక్ కంపెనీల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి టెక్ సంస్థల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు స్వస్తి పలికాయి. అయితే ఈ లేఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Disney+ Hotstar: వీడియో స్ట్రీమింగ్, ఓటీటీ ఫ్లాట్ఫారాలు కొత్త నిబంధనలు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు పాస్వర్డ్ షేరింగ్ కు స్వస్తి పలకాలని అనుకుంటున్నాయి.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. 2015 మాదకద్రవ్యాల కేసులో పంజాబ్కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాను ఆప్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆప్ ప్రభుత్వం తమపై రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ ఆరోపించింది. అయితే అతనిపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని ఆప్ విమర్శలను తోసిపుచ్చింది. మరోవైపు ఇరు పార్టీలు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి.
Gyanvapi Mosque: కాశీలో జ్ఞానవాపి మసీదుపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గతంలో వారణాసి కోర్టు తీర్పును అనుసరించి వీడియో సర్వే చేయగా, మసీదులోని వాజుఖానాలోని బావిలో శివలింగం వంటి నిర్మాణం వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా మసీదు వెలుపలి గోడలపై హిందూ దేవీదేవతల బొమ్మలను గుర్తించారు. ఈ కేసుపై అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా విచారించాయి. హిందువులు వాజూఖానాలోని కనిపించింది శివలింగం అని చెబుతుంటే.. ముస్లింలు మాత్రం ఇది ఫౌంటేన్ అని తమ వాదన వినిపిస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంది. ఇదే కాకుండా ఆ దేశంలో రాజకీయ అస్థిరత దేశ పరిస్థితులను మరింతగా దిగజారుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దైంది. తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
ICC World Cup 2023: ఇండియా వేదికగా ఐసీసీ ప్రపంచకప్ 2023 క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. అందరి కళ్లు అహ్మదాబాద్ లో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచు ప్రారంభానికి ముందు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పన్నూపై అహ్మదాబాద్ పోలీసులు పన్నూపై ఎ
Manipur Violence: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఖాళీగా ఉన్న ఇంటిని అల్లరిమూకలు టార్గెట్ చేశాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో ఈ ఘటన జరిగింది. గత కొన్ని నెలల నుంచి మణిపూర్ అగ్నిగుండంగా ఉంది. మైయిటీ, కుకీ తెగల మధ్య జాతి ఘర్షణలు జరుగుతున్నాయి.