Aadhaar App Alert: ఆన్లైన్ మోసాల నుంచి తప్పించుకోవడానికి UIDAI సూచించిన 5 కీలక చిట్కాలు తెలుసుకోవాల్సిందే..!
- ఆన్లైన్ మోసాలను అడ్డుకునేందుకు UIDAI కీలక హెచ్చరిక
- కొత్త ఫీచర్లతో వచ్చిన ఆధార్ యాప్ ద్వారా డిజిటల్ ఐడెంటిటీ సురక్షితం
- ఆధార్ వివరాలు లీక్ అయితే సైబర్ ఫ్రాడ్ ప్రమాదం అధికం
- ఆధార్ OTPను ఎప్పటికీ ఎవరితోనూ షేర్ చేయకూడదు
- ముఖ్యమైన సేవల కోసం మాస్క్డ్ ఆధార్ కార్డ్ వాడాలని UIDAI సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar App Alert: ఇటీవల UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ ను లాంచ్ చేసిన సంగతి విధితమే. ఈ యాప్ ద్వారా పేపర్ డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా.. ఆధార్ కార్డును జారీ చేసే సంస్థ UIDAI తన అధికారిక X అకౌంట్ ద్వారా వినియోగదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ ఐడెంటిటీని సురక్షితంగా ఉంచేందుకు, ఆన్లైన్ మోసాలను అడ్డుకునేందుకు 5 ముఖ్యమైన మార్గాలను UIDAI సూచించింది.
ఆధార్ కార్డును ఎందుకు కాపాడుకోవాలి?
మీ ఆధార్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కితే.. ఆన్లైన్ ఫ్రాడ్, సైబర్ మోసాలు, స్కామ్లకు ఉపయోగించే ప్రమాదం ఉంది. ఆధార్ అనేది అనేక కీలక సేవలకు గేట్వే లాంటిదని UIDAI చెబుతోంది. అందుకే దీనిని ఎప్పుడూ సురక్షితంగా ఉంచాలని సూచిస్తోంది.
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
వన్ ప్లస్ ధమాకా ఆఫర్.. 7100mAh బ్యాటరీతో రానున్న కొత్త ఫోన్.. రూ. 25 వేలకే.!
ఈ తప్పు మాత్రం ఎప్పుడూ చేయవద్దు..
మీ ఆధార్కు సంబంధించిన OTP (One-Time Password) ను ఎవరితోనూ షేర్ చేయకండి. ఆధార్ OTP షేర్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. OTP లేకుండా మీ ఆధార్ వివరాలను ఎవరూ యాక్సెస్ చేయలేరు.
మాస్క్డ్ ఆధార్ కార్డ్:
అనేక పథకాలు, సేవల్లో ఆధార్ అవసరం అవుతుంది. ముఖ్యమైన సేవల కోసం మాస్క్డ్ ఆధార్ (Masked Aadhaar) కార్డ్ వాడాలని UIDAI సూచిస్తోంది. ఇందులో మీ 12 అంకెల ఆధార్ నంబర్ పూర్తిగా కనిపించదు. ఇందులో కొన్ని అంకెలు మాత్రమే కనపడుతాయి. దీనివల్ల మీ ఆధార్ నంబర్ గోప్యంగా ఉంటుంది. ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ లభిస్తుంది.
ఫింగర్ప్రింట్ లాక్ చేయండి:
UIDAI యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా మీ ఆధార్పై “ఫింగర్ ప్రింట్ లాక్”ను యాక్టివేట్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఆధార్కు లింక్ అయిన ఫింగర్ప్రింట్, ఐరిస్, ఫేస్ రికగ్నిషన్ డేటా లాక్ అవుతుంది. దాంతో ఎవరైనా దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు.
Harman “Golden Ear” ఆడియోతో 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తో Xiaomi Buds 6 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!
వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు:
సోషల్ మీడియా లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో మీ ఆధార్ కార్డు ఫోటోలను పోస్ట్ చేయవద్దని UIDAI హెచ్చరిస్తోంది. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత వివరాలు ఇతరులకు చేరే ప్రమాదం ఉంటుంది.
హెల్ప్లైన్ నంబర్లను వినియోగించండి:
మీరు ఇప్పటికే మోసం లేదా సైబర్ క్రైమ్కు గురయ్యుంటే, వెంటనే చర్యలు తీసుకోండి. ఇందుకోసం UIDAI హెల్ప్లైన్ 1947 నెంబర్ కు, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930కు కాల్ చేయవచ్చు. ఈ నంబర్లకు వెంటనే కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..