Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీద్ కమిటీకి ఎదురుదెబ్బ.. సర్వే ఆపేది లేదని స్పష్టం చేసిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque: కాశీలో జ్ఞానవాపి మసీదుపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గతంలో వారణాసి కోర్టు తీర్పును అనుసరించి వీడియో సర్వే చేయగా, మసీదులోని వాజుఖానాలోని బావిలో శివలింగం వంటి నిర్మాణం వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా మసీదు వెలుపలి గోడలపై హిందూ దేవీదేవతల బొమ్మలను గుర్తించారు. ఈ కేసుపై అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా విచారించాయి. హిందువులు వాజూఖానాలోని కనిపించింది శివలింగం అని చెబుతుంటే.. ముస్లింలు మాత్రం ఇది ఫౌంటేన్ అని తమ వాదన వినిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో శాస్త్రీయ సర్వేను చేపట్టింది. అయితే దీనిని నిలిపివేయాలని జ్ఞాన్వాపి మసీదు నిర్వహణ కమిటీ అంజుమన్ ఇంతేజామియా కోర్టుకును కోరింది. కమిటీ వేసిన పిటిషన్ ని విచారించిన వారణాసి జిల్లా కోర్టు సర్వేను ఆపేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికీ ఈ సర్వేకు అలహాబాద్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు అనుమతి లభించిందని జస్టిస్ ఎకే విశ్వేష్ అన్నారు. అందువల్ల కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని న్యాయమూర్తి తెలిపారు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Pakistan: టీవీ లైవ్ డిబెట్లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. పాకిస్తాన్ అంటే ఇంతే మరి..!
17వ శతాబ్ధపు మసీదు హిందూదేవాలయంపై నిర్మించబడిందో లేదో తెలుసుకోవడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న మసీదు ప్రాంతంలో శాస్త్రీయ సర్వే నిర్వహిస్తోంది. అయితే నిర్దేశిత నిబంధనలకు విరుద్ధంగా ఏఎస్ఐ సర్వే జరుగుతోతందని మసీదు కమిటీ జిల్లా కోర్టులో వాదించిందని ప్రభుత్వం తరుపు న్యాయవాది రాజేష్ మిశ్రా తెలిపారు. పిటిషన్ వేసిన వారికి ఎలాంటి నోటీసులు అందలేదని, ఎలాంటి ఫీజు చెల్లించలేదని మసీదు కమిటీ వాదించింది.
జ్ఞాన్వాపి మసీదులోని వాజూఖానాలో సర్వే చేయాలన్న హిందూ పక్షం పిటిషన్ ను కూడా కోర్టు విచారించిందని, ఈ అంశంపై అక్టోబర్ 5వ తేదీకి కోర్టు విచారణను వాయిదా వేసిందని మిశ్రా తెలిపారు. వారణాసి జిల్లా కోర్టు సర్వే ఉత్తర్వులను అలహాబాద్ హైకోర్టు సమర్థించిన తర్వాత సర్వే ప్రారంభమైంది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా సర్వే అవసరం అని కోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!