ICC World Cup 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్కు బెదిరింపు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై కేసు నమోదు..
ICC World Cup 2023: ఇండియా వేదికగా ఐసీసీ ప్రపంచకప్ 2023 క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. అందరి కళ్లు అహ్మదాబాద్ లో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచు ప్రారంభానికి ముందు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పన్నూపై అహ్మదాబాద్ పోలీసులు పన్నూపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల పన్నూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డాడు. సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) ఉగ్ర సంస్థకు చీఫ్ గా ఉన్న పన్నూ.. ‘‘ఇది ప్రపంచ కప్ క్రికెట్ ప్రారంభం కాదు.. ఇది ప్రపంచ టెర్రర్ కప్ ప్రారంభం’’ అని బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు. షహీన్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చకోబోతున్నాం అని ఆడియో రికార్డ్ సందేశంలో బెదిరించాడు.
Read Also: TRAI: జియో, ఎయిర్టెల్ కు కస్టమర్ల వెల్లువ.. చేజార్చుకున్న వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
అనేక బెదిరింపు కాల్స్ రావడంతో కొంతమంది స్థానికులు అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉగ్రవాద చర్యలకు పాల్పడున్న ఇతనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 2019లో మొదటి కేసు నమోదు చేసింది. దేశంలో, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో భీభత్సం సృష్టించాలనే ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో పన్నూపై ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అదే సంవత్సరంలో అతడిని కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల పలు సందర్బాల్లో ప్రధాని మోడీతో పాటు మంత్రులు జై శంకర్, అమిత్ షా, నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ని బెదిరిస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు.
మరోవైపు కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అయితే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఖలిస్తాన్ అంశం తీవ్ర వివాదాన్ని రాజేసింది. అప్పటి నుంచి నిజ్జర్ మృతిపై పన్నూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. కెనడాలోని భారత దౌత్యవేత్తలను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల కెనడాలోని హిందువులను భారత దేశం వెళ్లాలని బెదిరించాడు. దీనిపై అక్కడి హిందూ సంఘాలు కెనడాలోకి పన్నూ రాకుండా అడ్డుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!