ICC World Cup 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్కు బెదిరింపు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC World Cup 2023: ఇండియా వేదికగా ఐసీసీ ప్రపంచకప్ 2023 క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. అందరి కళ్లు అహ్మదాబాద్ లో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచు ప్రారంభానికి ముందు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పన్నూపై అహ్మదాబాద్ పోలీసులు పన్నూపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల పన్నూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డాడు. సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) ఉగ్ర సంస్థకు చీఫ్ గా ఉన్న పన్నూ.. ‘‘ఇది ప్రపంచ కప్ క్రికెట్ ప్రారంభం కాదు.. ఇది ప్రపంచ టెర్రర్ కప్ ప్రారంభం’’ అని బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు. షహీన్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చకోబోతున్నాం అని ఆడియో రికార్డ్ సందేశంలో బెదిరించాడు.
Read Also: TRAI: జియో, ఎయిర్టెల్ కు కస్టమర్ల వెల్లువ.. చేజార్చుకున్న వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్
Also Read
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
అనేక బెదిరింపు కాల్స్ రావడంతో కొంతమంది స్థానికులు అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉగ్రవాద చర్యలకు పాల్పడున్న ఇతనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 2019లో మొదటి కేసు నమోదు చేసింది. దేశంలో, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో భీభత్సం సృష్టించాలనే ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2021 ఫిబ్రవరిలో పన్నూపై ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అదే సంవత్సరంలో అతడిని కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల పలు సందర్బాల్లో ప్రధాని మోడీతో పాటు మంత్రులు జై శంకర్, అమిత్ షా, నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ని బెదిరిస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు.
మరోవైపు కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అయితే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఖలిస్తాన్ అంశం తీవ్ర వివాదాన్ని రాజేసింది. అప్పటి నుంచి నిజ్జర్ మృతిపై పన్నూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. కెనడాలోని భారత దౌత్యవేత్తలను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల కెనడాలోని హిందువులను భారత దేశం వెళ్లాలని బెదిరించాడు. దీనిపై అక్కడి హిందూ సంఘాలు కెనడాలోకి పన్నూ రాకుండా అడ్డుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరాయి.
తాజావార్తలు
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!