Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మొదలై 7 రోజులు గడిచాయి. గత శనివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్లతో విరుచుకుపడింది. కేవలం 20 నిమిషాల్లోలనే 5000 రాకెట్లను ప్రయోగించింది. ఇంతే కాకుండా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి దొరికినవాళ్లను దొరికినట్లు కాల్చి చంపారు. వందల మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇప్పటికే హమాస్ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజలు మరణించారు.
Honour killing: మరో పరువు హత్యకు 20 ఏళ్ల యువతి బలైంది. కులాంత సంబంధం పెట్టుకుందని 20 ఏళ్ల కూతురిని తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈఘటన కర్ణాటకలోని దేవనహళ్లీ తాలూకాలోని బిదలూర్ గ్రామంలో బుధవారం జరిగింది. దళిత వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందకు కూతురుని హత్య చేశాడు. తక్కువ కులానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించినప్పటికీ, మారకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు.
Israel-Hamas War: హమాస్ ఉగ్రవాద దాడిని, ఎంత పాశవికంగా ప్రజల్ని, ముఖ్యంగా చిన్న పిల్లల్ని హతమార్చిందనే వివరాలను ఇజ్రాయిల్ ప్రపంచానికి తెలియజేస్తోంది. మెరుపుదాడిలో అనేక మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. హమాస్ దాడిలో చనిపోయిన వారి సంఖ్య 1200కు చేరుకుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని అత్యంత అమానుషంగా చంపిన విధానం అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.
USA: ఇజ్రాయిల్కి అగ్రరాజ్యం అమెరికా పూర్తి మద్దతును ప్రకటించింది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ దేశానికి సంపూర్ణ సహకారం అందిస్తోంది. తాజాగా గురువారం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ ఇజ్రాయిల్ వెళ్లారు.
D K Shivakumar: కర్ణాటక రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ముఖ్యంగా బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా, జనతాదళ్ సెక్యులర్(జడీఎస్) ప్రభావం దారుణంగా పడిపోయింది. దీంతో జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, ఆయన కుమారుడు మాజీ సీఎం కుమారస్వామి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి.
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీల్లో చీలికలు ఏర్పడ్డాయి. ఈ రెండు చీలిక వర్గాలు బీజేపీతో ప్రభుత్వాన్ని పంచుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ని కాదని అజిత్ పవార్ బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ తో పాటు శరత్ పవార్ నమ్మినబంట్లుగా పేరున్న నేతలు కూడా అజిత్ వర్గంలోనే ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యే ఈ వర్గంతోనే జతకట్టారు.
Israel: ఇజ్రాయిల్పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల దారుణ దాడుల తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాలోని తాగునీరు, కరెంట్, ఇంధనం, నిత్యావసరాలను కట్ చేసింది. ఇదిలా ఉంటే హమాస్ దాడులకు మద్దతుగా లెబనాన్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయల్
Modi-Putin: భారత ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో భేటీ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రష్యన్ మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఇరు దేశాధినేతల మధ్య సమావేశం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మాస్కోలోని భారత రాయబారి పవన్ కపూర్ మాట్లాడుతూ..
Accenture: ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం కారణంగా గతేడాది నవంబర్ నుంచి ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. కొత్తగా రిక్రూట్మెంట్లను నిలిపేశాయి. కరోనా మహమ్మారి కాలంలో వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని చెప్పాయి, ఒకవేళ ఎవరైనా రాకుంటే ఉద్యోగం ఉండదని హెచ్చరించాయి.
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కి కేంద్రం భద్రతను పెంచింది. ఇప్పటి వరకు ఉన్న వై కేటగిరి భద్రతను పెంచుతూ ‘జెడ్ కేటగిరి’గా అప్గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.