D K Shivakumar: బీజేపీ, జేడీఎస్ నుంచి కాంగ్రెస్లో 40 మంది.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
D K Shivakumar: కర్ణాటక రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ముఖ్యంగా బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా, జనతాదళ్ సెక్యులర్(జడీఎస్) ప్రభావం దారుణంగా పడిపోయింది. దీంతో జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, ఆయన కుమారుడు మాజీ సీఎం కుమారస్వామి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి.
Read Also: Israel: సిరియాపై ఇజ్రాయిల్ దాడి..2 ఎయిర్పోర్టులు ధ్వంసం.
Also Read
ఇదిలా ఉంటే ఈ రెండు పార్టీల పొత్తును ఆ పార్టీల్లోనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. బీజేపీ, జేడీఎస్ పార్టీల నుంచి 40 మంది వరకు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గురువారం ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున శిరహట్ట సెగ్మెంట్ ననుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ నిరాకరించిన మాజీ ఎమ్మెల్యే రామప్పలమాని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, నేను వారి పేర్లను వెల్లడించాలని అనుకోలేదని, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. స్థానిక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉత్తరాన బీదర్ నుంచి దక్షిణాన చామరాజనగర వరకు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ-జేడీఎస్ పొత్తును వ్యతిరేకిస్తూ ఈ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని డీకే శివకుమార్ అన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!