Accenture: ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన ఆక్సెంచర్.. ఈ సారి శుభవార్త లేనట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accenture: ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం కారణంగా గతేడాది నవంబర్ నుంచి ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. కొత్తగా రిక్రూట్మెంట్లను నిలిపేశాయి. కరోనా మహమ్మారి కాలంలో వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని చెప్పాయి, ఒకవేళ ఎవరైనా రాకుంటే ఉద్యోగం ఉండదని హెచ్చరించాయి.
ఇక జీతాల పెంపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తాజాగా ఐటీ దిగ్గజం ఆక్సెంచర్ భారత్ లోని తన ఉద్యోగులకు ఈ సారి జీతాల పెంపు, బోనస్ ఉండదని ప్రకటించింది. భారత్ తో పాటు శ్రీలంకలోని ఉద్యోగులకు కూడా జీతాల పెంపుదల లేదని ఉద్యోగులకు మెయిల్ పంపింది. అయితే ఈ ప్రకటన అందరికి వర్తించదని తెలిపింది. ఎవరైతే క్రిటికల్ స్కిల్స్ ఏరియాల్లో పనిచేస్తున్న వారికి ఇది వర్తించదని నివేదికలు చెబుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే ఆక్సెంచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ ఉద్యోగులకు తెలియజేశారు.
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
ఐటీ కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, ఆక్సెంచర్ తన సొంత వృద్ధిని ప్రారంభ ప్రణాళిక కన్నా తక్కువగా పడిపోయిన సమయంలో ఈ ప్రకటన వచ్చింది. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో కంపెనీ 19000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సెప్టెంబర్-ఆగస్టు ఫైనాన్షియల్ ఇయర్ ని అనుసరించే ఆక్సెంచర్.. మునుపటి త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను నివేదించింది. 2024 ఆర్థిక సంవత్సరం గైడెన్స్ గత 16 ఏళ్లలో అతితక్కువ.
Read Also: S Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్కి భద్రత పెంపు.. వై నుంచి “జెడ్ కేటగిరి”గా అప్గ్రేడ్..
అయితే ఆక్సెంచర్ పంపిన ఈమెయిళ్లలో.. వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్ ఇవ్వబడుతుందని, అయితే ఇది గతేడాది కన్నా తక్కువగా ఉంటుందని పేర్కొంది. ప్రమోషన్లను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ నెల వరకు అసోసియేట్ డైరెక్టర్(లెవల్ 5) వరకు ప్రమోషన్లు కొనసాగుతాయని, ఇది గతేడాదితో పోలిస్తే తక్కువగా ఉంటుందని తెలిపింది. కంపెనీ గ్రోత్ టార్గెట్లకు అనుగుణంగా 1 నుంచి 4 లెవల్స్ వరకు ప్రమోషన్లు జూన్ 2024 వరకు వాయిదా పడ్డాయి.
ఇక్క ఆక్సెంచరే కాదు.. ఇండియాలో పలు ఐటీ కంపెనీలు జీతాల పెరుగుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. హెచ్సీఎల్ గత త్రైమాసికంలో సీనియర్ మేనేజ్మెంట్లకు జీతాల పెంపును దాటవేసింది, జూనియర్ ఉద్యోగుల వేతనాలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.విప్రో తన జీతాల పెంపులను సెప్టెంబరు నుండి డిసెంబర్ 2023 వరకు ఆలస్యం చేసింది మరియు ఇన్ఫోసిస్ ఏప్రిల్ మరియు జూలైలో ప్రారంభంలో అనుకున్న జీతాల పెంపులను ఇంకా అమలు చేయలేదు. ఆక్సెంచర్ కి భారత్ లో 3,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
తాజావార్తలు
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!