Accenture: ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన ఆక్సెంచర్.. ఈ సారి శుభవార్త లేనట్లే..
Accenture: ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం కారణంగా గతేడాది నవంబర్ నుంచి ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. కొత్తగా రిక్రూట్మెంట్లను నిలిపేశాయి. కరోనా మహమ్మారి కాలంలో వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని చెప్పాయి, ఒకవేళ ఎవరైనా రాకుంటే ఉద్యోగం ఉండదని హెచ్చరించాయి.
ఇక జీతాల పెంపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తాజాగా ఐటీ దిగ్గజం ఆక్సెంచర్ భారత్ లోని తన ఉద్యోగులకు ఈ సారి జీతాల పెంపు, బోనస్ ఉండదని ప్రకటించింది. భారత్ తో పాటు శ్రీలంకలోని ఉద్యోగులకు కూడా జీతాల పెంపుదల లేదని ఉద్యోగులకు మెయిల్ పంపింది. అయితే ఈ ప్రకటన అందరికి వర్తించదని తెలిపింది. ఎవరైతే క్రిటికల్ స్కిల్స్ ఏరియాల్లో పనిచేస్తున్న వారికి ఇది వర్తించదని నివేదికలు చెబుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే ఆక్సెంచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ ఉద్యోగులకు తెలియజేశారు.
Also Read
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
ఐటీ కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, ఆక్సెంచర్ తన సొంత వృద్ధిని ప్రారంభ ప్రణాళిక కన్నా తక్కువగా పడిపోయిన సమయంలో ఈ ప్రకటన వచ్చింది. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో కంపెనీ 19000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సెప్టెంబర్-ఆగస్టు ఫైనాన్షియల్ ఇయర్ ని అనుసరించే ఆక్సెంచర్.. మునుపటి త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను నివేదించింది. 2024 ఆర్థిక సంవత్సరం గైడెన్స్ గత 16 ఏళ్లలో అతితక్కువ.
Read Also: S Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్కి భద్రత పెంపు.. వై నుంచి “జెడ్ కేటగిరి”గా అప్గ్రేడ్..
అయితే ఆక్సెంచర్ పంపిన ఈమెయిళ్లలో.. వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్ ఇవ్వబడుతుందని, అయితే ఇది గతేడాది కన్నా తక్కువగా ఉంటుందని పేర్కొంది. ప్రమోషన్లను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ నెల వరకు అసోసియేట్ డైరెక్టర్(లెవల్ 5) వరకు ప్రమోషన్లు కొనసాగుతాయని, ఇది గతేడాదితో పోలిస్తే తక్కువగా ఉంటుందని తెలిపింది. కంపెనీ గ్రోత్ టార్గెట్లకు అనుగుణంగా 1 నుంచి 4 లెవల్స్ వరకు ప్రమోషన్లు జూన్ 2024 వరకు వాయిదా పడ్డాయి.
ఇక్క ఆక్సెంచరే కాదు.. ఇండియాలో పలు ఐటీ కంపెనీలు జీతాల పెరుగుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. హెచ్సీఎల్ గత త్రైమాసికంలో సీనియర్ మేనేజ్మెంట్లకు జీతాల పెంపును దాటవేసింది, జూనియర్ ఉద్యోగుల వేతనాలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.విప్రో తన జీతాల పెంపులను సెప్టెంబరు నుండి డిసెంబర్ 2023 వరకు ఆలస్యం చేసింది మరియు ఇన్ఫోసిస్ ఏప్రిల్ మరియు జూలైలో ప్రారంభంలో అనుకున్న జీతాల పెంపులను ఇంకా అమలు చేయలేదు. ఆక్సెంచర్ కి భారత్ లో 3,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో