Venu Goapl Reddy
Author- NTV Telugu-
Gujarat: శ్రీరాముడి శోభాయాత్రపై రాళ్ల దాడి.. గుజరాత్లో ఘటన..
Gujarat: అయోధ్యలో రేపు రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో భవ్య రామ మందిరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని మోహసానా జిల్లాలో శ్రీరాముడి శోభాయాత్రపై రాళ్లు రువ్వడం కలకలం రేపింది. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. -
Rahul Gandhi: రాహుల్ గాంధీ ముందు “మోడీ,మోడీ” నినాదాలు.. “ఫ్లయింగ్ కిస్”తో సమాధానం..
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అస్సాంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోజు యాత్రలో పాల్గొన్న తమ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడులు చేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ రాష్ట్రంలో నాగోన్లో రాహుల్ యాత్ర బస్సు ముందు బీజేపీ కార్యకర్తలు ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా ‘‘మోడీ..మోడీ’’ అంటూ నినాదాలు చేశారు. -
Top 10 richest temples: అయోధ్య రామ మందిరానికి ముందు.. దేశంలో 10 అత్యంత ధనిక దేవాలయాలు ఇవే..
Top 10 richest temples: అయోధ్యలో రేపు రామ మందిర ప్రారంభోత్సవ వేడుక జరగబోతోంది. దాదాపుగా రూ.1800 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది విరాళాలు ఇచ్చారు. రేపు జరగబోయే ప్రాణ ప్రతిష్టకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరవుతున్నారు. 7000 మందికి పైగా అతిథులు, లక్షల్లో ప్రజలు హాజరుకానున్నారు. రామ మందిరానికి వేడుక వేళ భారతదేశంలో 10 అంత్యంత ధనిక దేవాలయాలు ఇవే.. 1) తిరుమల తిరుపతి దేవస్థానం, […] -
Ram Mandir: అయోధ్య రామ మందిరానికి ఏ రాష్ట్రం ఏం ఇచ్చింది..?
Ram Mandir: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రామనామంతో నిండిపోయింది. హిందువులు, రామభక్తుల శతాబ్ధాల కోరిక రేపటితో నెరవేవబోతోంది. రేపు(జనవరి22)న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సం జరగబోతోంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టతో ఆలయ ప్రారంభం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. -
Ayodhya Ram Temple: ‘‘నేను దావూద్ అనుచరుడిని అయోధ్య రామాలయాన్ని పేల్చేస్తా’’.. వ్యక్తి అరెస్ట్..
Ayodhya Ram Temple: దేశవ్యాప్తంగా ప్రస్తుతం రామనామ స్మరణతో నిండిపోయింది. రేపు(జనవరి22)న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం హిందువులు, రామ భక్తులు ఎదురుచూస్తు్న్నారు. శ్రీ రామ్ లల్లా (బాల రాముడి) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్య ముస్తాబైంది. -
Matrimonial site: మాట్రిమోనీ సైట్లో పరిచయం.. మోసపోయిన మహిళ..
Matrimonial site: ఇటీవల కాలంలో మాట్రిమోనియల్ సైట్లలో పరిచయాలు మోసాలకు కారణమవుతున్నాయి. అమ్మాయిలకు మంచి వరుడిని తెవాలనే తల్లిదండ్రులు తపన కొందరు దుర్మార్గులకు ఆసరాగా మారుతోంది. ఉద్యోగం లేకున్నా, తనకు మంచి ఉద్యోగం, కోట్లలో ఆస్తులు ఉన్నాయని ఫోజ్ ఇస్తూ యువతులను వలలో వేస్తున్నారు. అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు కూడా ముందు వెనక ఆలోచించకుండా వారి చేతుల్లో మోసపోతున్నారు. -
Ram Mandir: రామ మందిర వేడుక వేళ.. 100కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన కేంద్రం..
Ram Mandir: రామ మందిర వేడుకకు యావత్ దేశం సిద్ధమైంది. రేపు జరిగే కార్యక్రమం కోసం ప్రజలంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా, 7000 మందికి పైగా అతిథులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి యూపీ సర్కార్తో పాటు కేంద్ర భద్రత ఏజెన్సీలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉంటే కొన్ని ఉగ్రవాద సంస్థల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో భద్రతా ఎజెన్సీలు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్, ఏఐ కెమెరాలతో భద్రతను పటిష్టం చేశారు. -
Wed in India: విదేశాల్లో పెళ్లి చేసుకోవడం సరైనదేనా..? భారత్లోనే పెళ్లిళ్లు చేసుకోవాలని పీఎం మోడీ పిలుపు..
Wed in India: విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్పై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడంపై ఆదివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ సంపద దేశంలోనే ఉండేలా ‘వెడ్ ఇన్ ఇండియా’ని ప్రోత్సహించాని ప్రజల్ని ఆయన కోరారు. గుజరాత్లోని అమ్రేలి నగరంలో ఖోడల్ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో వాస్తవంగా ప్రసంగించిన ప్రధాని, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో సహాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
Ram Mandir Holiday: రామ మందిర వేడుక రోజు ఏ రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి..? ఏ సంస్థలకు హాలిడే..?
Ram Mandir Holiday: రేపు(జనవరి 22)న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి యావత్ దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం జరిగే అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. రామ్ లల్లా(బాల రాముడి) ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రధాని ముఖ్యపోషకుడి హోదాలో ఈ కార్యక్రమానికి హాజవుతున్నారు. మరోవైపు దేశంలోని బిజినెస్, సినీ, స్పో్ర్ట్స్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతో సహా […] -
Pawan Kalyan: అయోధ్య ప్రాణ ప్రతిష్ట.. లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్..
Pawan Kalyan: అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ అంతా సిద్ధమైంది. రేపు రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పలు రంగాల నుంచి 7000 మందికి పైగా అతిథులు వస్తున్నారు. తాజాగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర వేడుకకు బయలుదేరారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకి చేరుకున్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!