Mahua Moitra: తప్పుడు ప్రశ్నలు అడిగారు.. ఎథిక్స్ ప్యానెల్ సమావేశం నుంచి మోయిత్రా, విపక్ష ఎంపీల వాకౌట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: ‘‘క్యాష్ ఫర్ క్వేరీ’’ కేసులో టీఎంసీ మహువా మోయిత్రా ఈ రోజు పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ ముందు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం రసాభాసగా మారినట్లు తెలుస్తోంది. మోయిత్రాకు అండగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. ప్యానెల్ తప్పుడు ప్రశ్నలు అడుగుతోందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో పాటు మహువా మోయిత్రా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
ఇది ఎథిక్స్ కమిటీనా..? స్క్రిప్ట్ నుంచి చదవడం అని మహువా మోయిత్రా అన్నారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన ప్రతిపక్ష ఎంపీలు కూడా ప్యానెల్ మోయిత్రాను అనైతిక ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఎథిక్స్ కమిటీ చైర్పర్సన్ ప్రశ్నలు అనైతికంగా ఉన్నాయని మేము గుర్తించామని కాంగ్రెస్ ఎంపీ, ప్యానెల్ లో సభ్యుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అతను ఎవరి ఆదేశాలతో వ్యవహరిస్తున్నారో తెలుస్తోందని, పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. ఎక్కడికి వెళ్లారు..? ఎక్కడ కలిశారు.? మీరు మీ ఫోన్ రికార్డులను ఇవ్వగలరా..? అంటూ ప్రశ్నించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జేడీయూ ఏంపీ గిరిధారి యాదవ్ మాట్లాడుతూ.. మహువా వ్యక్తిగత ప్రశ్నలు అడిగే హక్కు ప్యానెల్కి లేదని అన్నారు.
Also Read
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
Read Also: Bombay High Court: బిడ్డను కిడ్నాప్ చేశాడని కన్నతండ్రిపై కేసు పెట్టలేం..
ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి మాట్లాడుతూ.. మోయిత్రా ప్రవర్తన ఖండించేలా ఉందని, ఆమె ఎథిక్స్ ప్యానెట్ ముందు అన్ పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించారని ఆరోపించారు. కమిటీ చైర్పర్సన్ హీరానందానీ అఫిడవిట్ పై ప్రశ్నలు అడుగుతున్నారని, అందుకు ఆమె సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదని అన్నారు.
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఎంపీ మహువామోయిత్రా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. దీని కోసం విచారణ కోరుతూ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. ఇదే కాకుండా ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వ్యక్తులకు వెళ్లడించిందని, వారు దుబాయ్ నుంచి ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో తాను తన స్నేహితుడు దర్శన్ హీరానందానీకి లాగిన్ వివరాలు ఇచ్చానని మోయిత్రా ఒప్పుకున్నారు. అయితే ప్రశ్నలు మాత్రం తానే అడిగానన్నారు. తాను లంచం తీసుకున్నా అనే వాదనల్ని ఖండించారు.
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..