Pakistan: పాకిస్తాన్ వదిలిపోతున్న ఆఫ్ఘాన్ ప్రజలు.. బహిష్కరణకు కారణాలేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం అల్టిమేటంతో ఆ దేశంలో ఉంటున్న లక్షలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు సొంతదేశానికి ప్రయాణమయ్యారు. ఇప్పటికే 1,40,000 మందికి పైగా వలసదారులు స్వచ్ఛందంగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేని వలసదారులు పాకిస్తాన్ వదిలి వెళ్లాలని, ఇందుకు నవంబర్ 1ని డెడ్లైన్గా పెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఆఫ్ఘాన్లు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు.
Read Also: Google: 18 ఏళ్లు పనిచేసినా వదల్లేదు.. కొత్త ఉద్యోగం కోసం వెతుకులాట..
Also Read
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
- Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
ఎందుకు బహిష్కరిస్తోంది..?
గతం కొంత కాలంగా పాకిస్తాన్ పరిస్థితులు దారుణంగా దిగజారాయి. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఒక్కొక్కర్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. వీరంతా కూడా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ, భారత్కి వ్యతిరేకంగా పనులు చేస్తున్నవారే. దీంతో పాటు పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు ఎక్కువయ్యాయి. వీటిన్నింటిలో ఆఫ్ఘన్ల ప్రమేయం ఉన్నట్లు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ ఏడాది 24 ఆత్మాహుతి బాంబు దాడుల్లో ఆఫ్ఘన్ జాతీయలు ప్రమేయం ఉన్నట్లు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణల్ని కాబూల్ తిరస్కరిస్తోంది. ఐక్యరాజ్యసమితితో పాటు హక్కుల సంఘాలు పాకిస్తాన్ తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నాయి.
ఎంత మంది విదేశీయులు ఉన్నారు..?
పాకిస్తాన్ లో డాక్యుమెంట్లు లేకుండా ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఉంటున్నారు. వీరితో పాటు ఇరాన్, మధ్య ఆసియాకు చెందిన కొంతమంది కూడా ఇందులో ఉన్నారు. పాకిస్తాన్ లో 40 లక్షల ఆఫ్ఘన్ వలసదారులు ఉన్నారు. వీరిలో 17 లక్షల మంది డాక్యుమెంట్లు లేకుండా ఉన్నారు. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత 6 లక్షల మంది పాకిస్తాన్ లోకి వచ్చారు. ఇలా బలవంతంగా బహిష్కరించద్దని ఆఫ్ఘనిస్తాన్ కోరింది. తమకు తగినంత సమయం ఇవ్వాలని అంది. ఉగ్రవాద దాడుల్లో తమ వారు పాల్గొనడం లేదని పేర్కొంది.
తాజావార్తలు
-
UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!