Pakistan: పాకిస్తాన్ వదిలిపోతున్న ఆఫ్ఘాన్ ప్రజలు.. బహిష్కరణకు కారణాలేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం అల్టిమేటంతో ఆ దేశంలో ఉంటున్న లక్షలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు సొంతదేశానికి ప్రయాణమయ్యారు. ఇప్పటికే 1,40,000 మందికి పైగా వలసదారులు స్వచ్ఛందంగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేని వలసదారులు పాకిస్తాన్ వదిలి వెళ్లాలని, ఇందుకు నవంబర్ 1ని డెడ్లైన్గా పెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఆఫ్ఘాన్లు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు.
Read Also: Google: 18 ఏళ్లు పనిచేసినా వదల్లేదు.. కొత్త ఉద్యోగం కోసం వెతుకులాట..
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఎందుకు బహిష్కరిస్తోంది..?
గతం కొంత కాలంగా పాకిస్తాన్ పరిస్థితులు దారుణంగా దిగజారాయి. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఒక్కొక్కర్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. వీరంతా కూడా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ, భారత్కి వ్యతిరేకంగా పనులు చేస్తున్నవారే. దీంతో పాటు పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు ఎక్కువయ్యాయి. వీటిన్నింటిలో ఆఫ్ఘన్ల ప్రమేయం ఉన్నట్లు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ ఏడాది 24 ఆత్మాహుతి బాంబు దాడుల్లో ఆఫ్ఘన్ జాతీయలు ప్రమేయం ఉన్నట్లు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణల్ని కాబూల్ తిరస్కరిస్తోంది. ఐక్యరాజ్యసమితితో పాటు హక్కుల సంఘాలు పాకిస్తాన్ తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నాయి.
ఎంత మంది విదేశీయులు ఉన్నారు..?
పాకిస్తాన్ లో డాక్యుమెంట్లు లేకుండా ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఉంటున్నారు. వీరితో పాటు ఇరాన్, మధ్య ఆసియాకు చెందిన కొంతమంది కూడా ఇందులో ఉన్నారు. పాకిస్తాన్ లో 40 లక్షల ఆఫ్ఘన్ వలసదారులు ఉన్నారు. వీరిలో 17 లక్షల మంది డాక్యుమెంట్లు లేకుండా ఉన్నారు. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత 6 లక్షల మంది పాకిస్తాన్ లోకి వచ్చారు. ఇలా బలవంతంగా బహిష్కరించద్దని ఆఫ్ఘనిస్తాన్ కోరింది. తమకు తగినంత సమయం ఇవ్వాలని అంది. ఉగ్రవాద దాడుల్లో తమ వారు పాల్గొనడం లేదని పేర్కొంది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!