Mahua Moitra: “వ్యక్తిగత సంబంధమే” ఈ వివాదానికి కారణం.. ఎథిక్స్ కమిటీ ముందు మహువా మోయిత్రా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా నేడు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఆమె డబ్బులు, గిఫ్టులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించించారు. అంతే కాకుండా ఆమెకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను ఇతరులతో పంచుకున్నారని, దుబాయ్ వేదికగా పలుమార్లు లాగిన్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరై తన వాదనల్ని వినిపించారు.
ఎంపీ మహువా మోయిత్రా ఈ రోజు ఎథిక్స్ కమిటీ ముందు ‘‘వ్యక్తిగత సంబంధం’’లోని అపార్థాలే తనపై క్యాష్ ఫర్ క్వేరీ కేసుకు కారణమైనట్లు తెలిపిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడదించాయి. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి తన అధికార లాగిన్ వివరాలు ఇచ్చినట్లు ఆమె అంగీకరించిందని, అయితే ప్రశ్నలు తనవే అని అన్నారు. కేంద్ర హోం, ఐటీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన వివరాలను, ఇతర సాక్ష్యాల ఆధారంగా ఎథిక్స్ ప్యానెట్ ఆమెను ప్రశ్నిస్తోంది. ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: BJP 3rd list: బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
అయితే ప్రతిపక్ష ఎంపీలు మహువా మోయిత్రాకు మద్దతు నిలిచినట్లు సమాచారం. ఈ కేసుకు మూలం అయిన డబ్బు ఎక్కడ ఉందని ఆరా తీశారు. ఎంపీలు ఎవరి సాయం లేకుండా తమ ప్రశ్నలు పార్లమెంట్ వెబ్సైట్ లో పోస్టు చేస్తారా..? అని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రశ్నలను పోస్ట్ చేయడానికి మాత్రమే లాగిన్ ఉపయోగపడుతుందని, ఇందులో జాతీయ భద్రత సమస్య లేదని ప్రతిపక్ష ఎంపీలు తెలిపారు. అధికారిక లాగిన్ పంచుకోవడంపై బీజేపీ జాతీయ భద్రతా ఆందోళనల్ని లేవనెత్తింది.
మహువా మోయిత్రా డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రధాని మోడీ టార్గెట్గా అదానీ వ్యవహారంపై ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇండియాలో ఉన్న సమయంలోనే దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెట్కి అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తన వద్ద నుంచి మోయిత్రా డబ్బులు, గిఫ్టులు తీసుకుందని అందులో ఆరోపించారు.
తాజావార్తలు
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!