Mahua Moitra: “వ్యక్తిగత సంబంధమే” ఈ వివాదానికి కారణం.. ఎథిక్స్ కమిటీ ముందు మహువా మోయిత్రా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా నేడు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఆమె డబ్బులు, గిఫ్టులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించించారు. అంతే కాకుండా ఆమెకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను ఇతరులతో పంచుకున్నారని, దుబాయ్ వేదికగా పలుమార్లు లాగిన్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరై తన వాదనల్ని వినిపించారు.
ఎంపీ మహువా మోయిత్రా ఈ రోజు ఎథిక్స్ కమిటీ ముందు ‘‘వ్యక్తిగత సంబంధం’’లోని అపార్థాలే తనపై క్యాష్ ఫర్ క్వేరీ కేసుకు కారణమైనట్లు తెలిపిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడదించాయి. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి తన అధికార లాగిన్ వివరాలు ఇచ్చినట్లు ఆమె అంగీకరించిందని, అయితే ప్రశ్నలు తనవే అని అన్నారు. కేంద్ర హోం, ఐటీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన వివరాలను, ఇతర సాక్ష్యాల ఆధారంగా ఎథిక్స్ ప్యానెట్ ఆమెను ప్రశ్నిస్తోంది. ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
Read Also: BJP 3rd list: బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
అయితే ప్రతిపక్ష ఎంపీలు మహువా మోయిత్రాకు మద్దతు నిలిచినట్లు సమాచారం. ఈ కేసుకు మూలం అయిన డబ్బు ఎక్కడ ఉందని ఆరా తీశారు. ఎంపీలు ఎవరి సాయం లేకుండా తమ ప్రశ్నలు పార్లమెంట్ వెబ్సైట్ లో పోస్టు చేస్తారా..? అని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రశ్నలను పోస్ట్ చేయడానికి మాత్రమే లాగిన్ ఉపయోగపడుతుందని, ఇందులో జాతీయ భద్రత సమస్య లేదని ప్రతిపక్ష ఎంపీలు తెలిపారు. అధికారిక లాగిన్ పంచుకోవడంపై బీజేపీ జాతీయ భద్రతా ఆందోళనల్ని లేవనెత్తింది.
మహువా మోయిత్రా డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రధాని మోడీ టార్గెట్గా అదానీ వ్యవహారంపై ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇండియాలో ఉన్న సమయంలోనే దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెట్కి అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తన వద్ద నుంచి మోయిత్రా డబ్బులు, గిఫ్టులు తీసుకుందని అందులో ఆరోపించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!