Mahua Moitra: “వ్యక్తిగత సంబంధమే” ఈ వివాదానికి కారణం.. ఎథిక్స్ కమిటీ ముందు మహువా మోయిత్రా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: ‘క్యాష్ ఫర్ క్వేరీ’ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా నేడు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఆమె డబ్బులు, గిఫ్టులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించించారు. అంతే కాకుండా ఆమెకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను ఇతరులతో పంచుకున్నారని, దుబాయ్ వేదికగా పలుమార్లు లాగిన్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరై తన వాదనల్ని వినిపించారు.
ఎంపీ మహువా మోయిత్రా ఈ రోజు ఎథిక్స్ కమిటీ ముందు ‘‘వ్యక్తిగత సంబంధం’’లోని అపార్థాలే తనపై క్యాష్ ఫర్ క్వేరీ కేసుకు కారణమైనట్లు తెలిపిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడదించాయి. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి తన అధికార లాగిన్ వివరాలు ఇచ్చినట్లు ఆమె అంగీకరించిందని, అయితే ప్రశ్నలు తనవే అని అన్నారు. కేంద్ర హోం, ఐటీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన వివరాలను, ఇతర సాక్ష్యాల ఆధారంగా ఎథిక్స్ ప్యానెట్ ఆమెను ప్రశ్నిస్తోంది. ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
Read Also: BJP 3rd list: బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
అయితే ప్రతిపక్ష ఎంపీలు మహువా మోయిత్రాకు మద్దతు నిలిచినట్లు సమాచారం. ఈ కేసుకు మూలం అయిన డబ్బు ఎక్కడ ఉందని ఆరా తీశారు. ఎంపీలు ఎవరి సాయం లేకుండా తమ ప్రశ్నలు పార్లమెంట్ వెబ్సైట్ లో పోస్టు చేస్తారా..? అని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రశ్నలను పోస్ట్ చేయడానికి మాత్రమే లాగిన్ ఉపయోగపడుతుందని, ఇందులో జాతీయ భద్రత సమస్య లేదని ప్రతిపక్ష ఎంపీలు తెలిపారు. అధికారిక లాగిన్ పంచుకోవడంపై బీజేపీ జాతీయ భద్రతా ఆందోళనల్ని లేవనెత్తింది.
మహువా మోయిత్రా డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రధాని మోడీ టార్గెట్గా అదానీ వ్యవహారంపై ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇండియాలో ఉన్న సమయంలోనే దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెట్కి అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తన వద్ద నుంచి మోయిత్రా డబ్బులు, గిఫ్టులు తీసుకుందని అందులో ఆరోపించారు.
తాజావార్తలు
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Nandini : “ఆమె నా కోడలు కాదు.. కూతురు.. భట్టి సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
-
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!