Tamil Nadu: ముస్లిం మహిళను ఉద్దేశించి ఓ కానిస్టేబుల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మహిళ ధరించిన బురఖాను ఉద్దేశించి అనుచిత వ్యాక్యలు చేశాడు. దీంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఫిబ్రవరి 22, గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. పోలీస్ వివక్షాపూరిత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెళ్లువెత్తాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాతగా పేరున్న మనోజ్ రాజ్పుత్పై అత్యాచార అభియోగాలు నమోదయ్యాయి. తనను పెళ్లి చేసుకుంటానని 13 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. 29 ఏళ్ల బాధితురాలు మనోజ్ రాజ్పుత్కి బంధువు. శుక్రవారం దుర్గ్ జిల్లాలోని అతని కార్యాలయం నుంచి అదుపులోకి తీసుకున్నారు.
Haldwani violence: ఉత్తరాఖండ్ హల్ద్వానీ ప్రాంతంలో ఫిబ్రవరి 8న తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అక్రమంగా నిర్మించిన మదర్సాను అధికారులు కోర్టు ఆదేశాల మేరకు కూల్చవేస్తున్న తరుణంలో హింస చోటు చేసుకుంది. పోలీసులు, ఇతర అధికారులే టార్గెట్గా స్థానికులు విరుచుకుపడ్డారు. పోలీసులను నిర్బంధించి నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు వారిపై దాడి చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు.
Mahindra Thar 5-Door: మహీంద్రా థార్.. ఈ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ లోనే నెంబర్ వన్ ఆఫ్ రోడర్గా ఉంది. యువత దీని స్టైలిష్ లుక్స్కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం 3-డోర్గా ఉన్న థార్, మరికొన్ని రోజుల్లో 5-డోర్ వెర్షన్లో రాబోతోంది. ఈ ఏడాది మధ్యలో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా థార్ 5- డోర్ వెర్షన్ టెస్ట్ రన్ జరుగుతోంది. చాలా సందర్భాల్లో ఈ కార్ టెస్టింగ్ ఫేజ్కి సంబంధించిన ఫోటోలు కనిపించాయి.
PM Modi: కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించదని, దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఎప్పుడూ లేని పీఎం దుయ్యట్టారు. స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ దేశాన్ని చాలా ఏళ్లు పాలించిందని, అయితే వారి దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని, దేశ భవిష్యత్తుపై లేదన్నారు. శనివారం ‘విక్షిత్ భారత్ విక్షిత్ ఛత్తీస్గఢ్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Assam: అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం అతిపెద్ద చర్చకు దారి తీసింది. ఇది రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుకు ముందడుగుగా పరిగణించబడుతోంది.
New Criminal Laws: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం శనివారం తెలిపింది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో ఈ చట్టాలు అమలు చేయబడుతాయి.
Blood transfusion: రక్తమార్పిడి విషయంలో వైద్య సిబ్బంది చాలా సీరియస్గా ఉండాలి. ఒక గ్రూపుకు బదులుగా వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే రోగి మరణించడం ఖాయం. అయితే, రాజస్థాన్లో ఓ వ్యక్తి ఇలాగే మరణించాడు. రాష్ట్రంలోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 23 ఏళ్ల యువకుడికి తప్పుడు రక్తం ఎక్కించారు. చివరకు రోగి మరణించాడు.
Pakistan: పాకిస్తాన్లో ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. 13 ఏళ్ల బాలుడు పెళ్లి చేస్తేనే తాను చదువుకుంటానని బెదిరించడంతో అతని పేరెంట్స్ ఒప్పుకోక తప్పలేదు. ప్రస్తుతం అబ్బాయి, అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోలు, వీడియోలో వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రుల్ని విమర్శిస్తున్నారు.
Top 5 Smartphones: ఇండియాలో స్మార్ట్ఫోన్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికేడాది వినియోగదారులు తమ ఫోన్లను మారుస్తున్నారు. ఇది మొబైల్ కంపెనీలకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రోజుల వ్యవధిలోనే కొత్త మోడళ్లు, సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. మార్చి నెలలో లాంచ్కి పలు మొబైళ్లు సిద్ధమవుతున్నప్పటికీ అందరి దృష్టి మాత్రం టాప్ మొబైళ్లపై దృష్టి నెలకొంది.