T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ మ్యాచ్లు.. ఐసీసీకి పీసీబీ స్పెషల్ ఆఫర్!
- భారత్, బంగ్లాదేశ్ మధ్య దెబ్బతిన్న సంబంధాలు
- ఐపీఎల్ 2026 నుంచి ముస్తాఫిజుర్ రిలీజ్
- వేదిక తరలించాలని బీసీబీ డిమాండ్
- ఐసీసీకి పీసీబీ స్పెషల్ ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2026 వేలంలో రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కానీ బీసీసీఐ సూచనల మేరకు కేకేఆర్ అతడిని విడుదల చేసింది. దాంతో వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్లను భారతదేశంలో కాకుండా వేరే వేదికకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) డిమాండ్ చేసింది.
భారత్లో జరిగే టీ20 ప్రపంచకప్ 2026లో బంగ్లాదేశ్ నాలుగు లీగ్ మ్యాచ్లు ఆడనుంది. అందులో మూడు కోల్కతాలో, ఒకటి ముంబైలో షెడ్యూల్ అయి ఉంది. భారత్ నుంచి మరో వేదికకు మ్యాచ్లను తరలించాలనే బీసీబీ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. దాంతో భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ ఆటగాళ్లను ప్రపంచకప్ మ్యాచ్ల కోసం భారత్కు పంపబోమని బీసీబీ పట్టుదలతో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చూస్తోంది.
Also Read
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
- VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
Also Read: MSVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవర్సీస్ రివ్యూ.. అనిల్ రావిపూడి దొరికేశాడా?
టీ20 ప్రపంచకప్ 2026లో బంగ్లాదేశ్ మ్యాచ్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పీసీబీ ప్రతిపాదించింది. అయితే పీసీబీ ప్రతిపాదనను ఐసీసీ అంగీకరించే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే హోటల్, ప్రయాణ టిక్కెట్లు ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం బుక్ చేయబడ్డాయి. బంగ్లాదేశ్ తప్పక భారత్ రావాల్సి ఉంటుంది. లేదా మెగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ తన అన్ని మ్యాచ్లను శ్రీలంకలోనే ఆడుతుంది. ఫిబ్రవరి 7 ఆరంభం అయ్యే టీ20 ప్రపంచకప్.. మార్చి 8న ముగుస్తుంది.
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!