Venu Goapl Reddy
Author- NTV Telugu-
PM Modi: కుంభమేళాని ప్రశంసించిన ప్రధాని మోడీ.. ప్రతిపక్షాల విమర్శలు..
PM Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరిగిన ‘‘మహాకుంభమేళా’’ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్లో కొనియాడారు. లోక్సభలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. కుంభమేళా విజయవంతం కావడానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారతదేశ కొత్త తరం మహా కుంభమేళాతో కనెక్ట్ అయిందని, న్యూ జనరేషన్ సంప్రదాయాలు, విశ్వాసాన్ని గర్వంగా స్వీకరిస్తోందని, కుంభమేళ ప్రపంచం మొత్తానికి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిందని, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత, -
Dihuli Massacre: “దిహులి దళితుల ఊచకోత”.. 44 ఏళ్ల తర్వాత తీర్పు.. ముగ్గురికి ఉరిశిక్ష..
Dihuli Massacre: నవంబర్ 18, 1981న సాయుధ దుండగుల గుంపు ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్లోని జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని దిహులి గ్రామంలోని ఎస్సీ కాలనీపై విరుచకుపడ్డారు. ఇళ్లలోని పురుషులు, మహిళలు, పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 మంది మరణించారు. ఈ ఘటన ‘‘దిహులి ఊచకోత’’గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఘటన జరిగిన 44 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడింది. దోషులుగా తేలిన ముగ్గురికి కోర్టు ‘‘మరణశిక్ష’’ విధించింది. దోషుల్లో ఒకరు పరారీలో ఉన్నారు. -
Chhaava: ‘‘ఛావా’’ ఔరంగజేబుపై ఆగ్రహానికి కారణం.. నాగ్పూర్ హింసపై సీఎం ఫడ్నవీస్..
Chhaava: నాగ్పూర్ అల్లర్ల, హింస నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ‘‘ఛావా’’ సినిమాపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర తెరపైకి వచ్చిందని, ఇది మొఘల్ పాలకుడు ఔరంగజేబుపై ఆగ్రహాన్ని రేకెత్తించిందని ఆయన అన్నారు. సోమవారం రాత్రి నాగ్పూర్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడుతూ, ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
Viral video: ‘‘నన్ను మోసం చేసి, కొత్త భార్యకు ఫోన్ కొంటున్నావా?’’.. వ్యక్తిపై గర్ల్ఫ్రెండ్ దాడి..
Viral video: తన భార్యకు మొబైల్ ఫోన్ కొనిస్తున్న వ్యక్తిపై ‘‘గర్ల్ ఫ్రెండ్’’ దాడి చేసిన సంఘటన వైరల్గా మారింది. బీహార్ చాప్రాలో ఒక వ్యక్తి తనను మోసం చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న అతడి గర్ల్ ఫ్రెండ్, మొబైల్ షాపులోనే అతడిని పట్టుకుని చితకబాదింది. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. -
PM Modi: సునీతా విలియమ్స్కి ప్రధాని మోడీ లేఖ.. ఏమన్నారంటే..
PM Modi: దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. సునీతాతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గతేడాది ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)’’లో కొన్ని నెలలుగా చిక్కుబడిపోయారు. వీరిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ ‘‘స్టార్ లైనర్’’లో సాంకేతిక సమస్యలు ఏర్పడం, హీలియం లీకేజీ, థ్రస్టర్ల వైఫల్యం వంటి సమస్యలను ఎదుర్కోవడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. -
Nagpur Violence: నాగ్పూర్ హింస ఒక “కుట్ర”.. “ఛావా”పై షిండే కామెంట్స్..
Nagpur Violence: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వివాదం మహారాష్ట్రలో అగ్గిరాజేస్తోంది. నాగ్పూర్లో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒక్కసారి ముస్లిం మూక దాడులకు పాల్పడింది. దీంతో నగరంలో హింస చెలరేగింది. ప్రైవేట్ ఆస్తులు, వాహనాలు, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ అల్లర్లు జరిగాయి. ఇదిలా ఉంటే, ఈ అల్లర్లపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు ‘‘కుట్ర’’ ప్రకారం జరిగాయని, మణిపూర్ జాతి […] -
PM Modi: ఆర్ఎస్ఎస్ ద్వారానే జీవిత లక్ష్యం ఏంటో తెలిసింది..
PM Modi: ఆర్ఎస్ఎస్ ద్వారానే తనకు జీవిత లక్ష్యం గురించి తెలిసిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ గొప్పతనాన్ని ఆయన వివరించారు. ఆర్ఎస్ఎస్ వల్లే సేవ గొప్పతనం, దేశ స్పూర్తి పెరిగిందని వెల్లడించారు. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ తాను ఒక వ్యక్తిగా ఎదిగేందుకు కీలక పాత్ర పోషించిందని చెప్పారు. -
PM Modi: “గుజరాత్ అల్లర్ల” గురించి మాట్లాడిన మోడీ.. ఏమన్నారంటే..
PM Modi: 2002 సబర్మతి ఎక్స్ప్రెస్పై దాడి, గుజరాత్ అల్లర్ల గురించి ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడారు. గోద్రాలో 2002 సబర్మతి ఎక్స్ప్రెస్పై జరిగిన దాడి "ఊహించలేని స్థాయిలో జరిగిన విషాదం" అని ఆయన అన్నారు. దీని తర్వాత జరిగిన అల్లర్లు ‘‘ప్రతీ ఒక్కరికి విషాదకరమైనవి’’గా చెప్పారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్లో ఒక్క అల్లరి కూడా జరగలేదని చెప్పారు. -
Lex Fridman: ప్రధాని మోడీ ఇంటర్వ్యూ కోసం 45 గంటలు లెక్స్ ఫ్రిడ్మాన్ ఉపవాసం..
Lex Fridman: అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్, ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని వర్తమాన అంతర్జాతీయ పరిణామాలు, పాక్ అంశం, ఉక్రెయిన్ వార్, డొనాల్డ్ ట్రంప్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, ఈ ఇంటర్వ్యూ కోసం తాను 45 గంటల పాటు ‘‘ఉపవాసం’’లో ఉన్నట్లు లెక్స్ ఫ్రిడ్మాన్ చెప్పారు. ‘‘సరైన మనస్తత్వాన్ని పొందడానికి’’ దాదాపుగా 2 రోజలు ఉపవాసం ఉన్నానని చెప్పి ప్రధాని మోడీని ఆశ్చర్యపరిచారు. -
Hafiz Saeed: ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ హతం..? పాక్ ఎస్ఎంలో వైరల్ న్యూస్..
Hafiz Saeed: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ హతమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ జీలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడుల్లో అతడి మేనల్లుడు అబూ ఖతత్ మరణించాడు. అయితే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హఫీస్ సయీద్ రావల్పిండిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, చికిత్స తీసుకుంటూ మరణించినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
తాజావార్తలు
-
FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
-
Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!