Ramtek bungalow: ‘‘రామ్టెక్ బంగ్లా’’ పేరు వింటేనే ‘మహా’ మంత్రులకు భయం.. కారణాలేంటి..?
- ‘‘రామ్టెక్ బంగ్లా’’కు వెళ్లేందుకు భయపడుతున్న మహారాష్ట్ర మంత్రులు..
- గతంలో పలువురు మంత్రులు అవినీతి, రాజీనామాలు చేయడంతో భయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramtek bungalow: మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్, శివసేన ఏక్నాథ్ షిండేల ‘‘మహాయుతి’’ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు మంత్రులు నియామకం కూడా జరిగింది. ప్రస్తుతం మంత్రులకు బంగ్లాలు కేటాయించే పని జరుగుతోంది. అయితే, మంత్రులు మాత్రం ఒక్క బంగ్లా అంటే మాత్రం విపరీతంగా భయపడుతున్నారు. ఆ బంగ్లా తమకు వద్దు అంటూ వెనక్కి తగ్గుతున్నారు.
‘‘రామ్టెక్ బంగ్లా’’ ముంబైలోని మలబార్ హిల్లోని ఈ బంగ్లాను ఎవరూ కోరుకోవడం లేదు. విలాసవంతమైన ఈ బంగ్లాను అత్యంత దురదృష్టకరమైన బంగ్లాగా పేరొందింది. అయితే, ప్రస్తుతం ఈ బంగ్లాను మహారాష్ట్ర రెవెన్యూ మినిస్టర్, మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన చంద్రశేఖర్ బవాన్కులేకి కేటాయించారు. ఆయన కూడా ఇందులోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. రామ్టెక్ బంగ్లాను తనకు కేటాయించిన బంగ్లాకు మార్చుకునేందుకు బవాన్కులే సహచర క్యాబినెట్ మంత్రి పంకజా ముండేతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
నిజానికి ఈ బంగ్లాలో నివసించిన మంత్రులు ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం, అవినీతి ఆరోపణలు, పదవులు కోల్పోవడం జరిగింది. కానీ, పంకజా ముండేకి మాత్రం ఈ బంగ్లాతో భావోద్వేగ సంబంధం ఉంది. ఆమె తండ్రి దివంగత గోపీనాథ్ ముండే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడే నివసించారు.
Read Also: CM Revanth Reddy: అదానీ పెట్టుబడుల ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేం..
మంత్రులకు బంగ్లా అంటే భయం ఎందుకు..?
ఛగన్ భుజ్బల్(ఎన్సీపీ): కాంగ్రెస్-ఎన్సిపి సంకీర్ణ ప్రభుత్వ హయాంలో, భుజ్బల్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో రామ్టెక్ బంగ్లాలోనే నివసించారు. 2003 తెల్గీ స్టాంప్ పేపర్ స్కామ్లో ఈయన పేరు బయటకు రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఏక్నాథ్ ఖడ్సే (ఎన్సిపి): బిజెపి-శివసేన ప్రభుత్వ హయాంలో 2014 నుండి 2016 వరకు వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. ఈయనపై కూడా అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఛగన్ భుజ్బల్ (NCP): 2019లో మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వంలో ఆహారం మరియు పౌర సరఫరాల మంత్రిగా మరోసారి ఈ బంగ్లాలోనే ఉన్నారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం పడిపోవడంతో పదవి కోల్పోయారు.
దీపక్ కేసర్కర్ (షిండే సేన): గతంలో పాఠశాల విద్య, మరాఠీ భాషా మంత్రిగా పనిచేసిన కేసర్కర్ కూడా బంగ్లా బాధితుల్లో ఉన్నారు. ఇటీవల మహాయుతి కూటమి విజయం సాధించినా, ఫడ్నవీస్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కలేదు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!