Delhi: ఢిల్లీ అల్లర్ల నిందితుడి ఇంటికి ఎంఐఎం నేత.. ఎన్నికల్లో పోటీ చేస్తాడనే ప్రచారం..
- ఢిల్లీ అల్లర్ల నిందితుడి ఇంటికి ఎంఐఎం నేత..
- పోలీసులకు గన్ గురిపెట్టిన వ్యక్తిగా ప్రచారం..
- అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరుపున పోటీకి దించుతారని వార్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: 2020 ఢిల్లీ అల్లర్లలో పోలీసులకు తుపాకీ గురిపెట్టి ప్రాచుర్యం పొందిన నిందితుడు షారుక్ పఠాన్ కుటుంబాన్ని ఢిల్లీ ఎంఐఎం పార్టీ చీఫ్ డాక్టర్ సోయబ్ జమై కలిశారు. ఇప్పుడు ఈ కలయిక వివాదాస్పదంగా మారింది. అల్లర్ల సమయంలో పోలీసులకు తుపాకీని గురిపెట్టిని ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జమై, షారుక్ పఠాన్ ఇంటికి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పఠాన్ తీహార్ జైలులో ఉన్నాడు. ఢిల్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఇతడిని తన అభ్యర్థిగా దింపొచ్చనే చర్చ నడుస్తోంది.
అయితే, ఈ పుకార్లపై షోయబ్ జమై మాట్లాడుతూ.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాజకీయాల్లో ఏదైనా జరుగొచ్చని అన్నారు. మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గమైన సీలంపూర్కు మంచి అభ్యర్థి అవసరం ఉందని చెప్పారు. పఠాన్ అభ్యర్థిత్వానికి సంబంధించి ఎంఐఎం నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Also Read
- Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
Read Also: Venu Swamy : అల్లు అర్జున్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..
ఎంఐఎం నేత నిందితుడి ఇంటికి వెళ్లి కలవడంపై రాజకీయ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీ శాంతి, సామరస్యానికి భంగం కలిగించేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోందని బీజేపీ నేత విజేందర్ గుప్తా అన్నారు. అశాంతి సృష్టించడం, నగరాన్ని విభజించడం వారి ఏకైక ఉద్దేశ్యమని చెప్పారు. పఠాన్ కుటుంబాన్ని సందర్శించిన తర్వాత… విచారణ లేకుండా జైలులో మగ్గుతున్న వారికి సంఘీభావం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘‘ఇటీవల నేను జైలులో ఉన్న షారుక్ పఠాన్ తల్లిని అతని ఇంట్లో కలిశాను. ఢిల్లీలో న్యాయ పోరాటంలో మా ఈ చిన్న అడుగు విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్న ఎన్నో కుటుంబాలకు ధైర్యాన్నిస్తుంది. సుప్రీం కోర్టు ప్రకారం బెయిల్ అనేది పెండింగ్లో ఉన్న ఖైదీల హక్కు. అరవింద్ కేజ్రీవాల్ కోరిక మేరకు తన కొడుకుపై కేసు పెట్టారని అతని తల్లి చెప్పింది’’ అని జమై చెప్పుకొచ్చారు.
ఢిల్లీ అల్లర్లో హెడ్ కానిస్టేబుల్ దీపక్ దహియాకు గన్ గురిపెట్టిన కేసుతో పాటు రోహిత్ శుక్లా అనే వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో షారుక్ పఠాన్ నిందితుడిగా ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆప్ తరుపున చౌదరి జుబేర్ అహ్మద్ని బరిలోకి దించగా, కాంగ్రెస్ అబ్దుల్ రెహ్మాన్ని ప్రకటించింది. బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. సీలంపూర్ సంప్రదాయంగా కాంగ్రెస్ కంచుకోట. అయితే గత రెండు సార్లు ఇక్కడ నుంచి ఆప్ గెలుపొందింది. అల్లర్ల కేసులో షారూక్ పఠాన్కి బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు అక్టోబర్లో నిరాకరించింది.
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!