Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Aimim Leader Meets Family Of Man Who Brandished Gun At Cop During Delhi Riots

Delhi: ఢిల్లీ అల్లర్ల నిందితుడి ఇంటికి ఎంఐఎం నేత.. ఎన్నికల్లో పోటీ చేస్తాడనే ప్రచారం..

Published Date :December 25, 2024 , 3:52 pm
By venugopal reddy
  • ఢిల్లీ అల్లర్ల నిందితుడి ఇంటికి ఎంఐఎం నేత..
  • పోలీసులకు గన్ గురిపెట్టిన వ్యక్తిగా ప్రచారం..
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరుపున పోటీకి దించుతారని వార్తలు..
Delhi: ఢిల్లీ అల్లర్ల నిందితుడి ఇంటికి ఎంఐఎం నేత.. ఎన్నికల్లో పోటీ చేస్తాడనే ప్రచారం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi: 2020 ఢిల్లీ అల్లర్లలో పోలీసులకు తుపాకీ గురిపెట్టి ప్రాచుర్యం పొందిన నిందితుడు షారుక్ పఠాన్ కుటుంబాన్ని ఢిల్లీ ఎంఐఎం పార్టీ చీఫ్ డాక్టర్ సోయబ్ జమై కలిశారు. ఇప్పుడు ఈ కలయిక వివాదాస్పదంగా మారింది. అల్లర్ల సమయంలో పోలీసులకు తుపాకీని గురిపెట్టిని ఫోటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జమై, షారుక్ పఠాన్ ఇంటికి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పఠాన్ తీహార్ జైలులో ఉన్నాడు. ఢిల్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఇతడిని తన అభ్యర్థిగా దింపొచ్చనే చర్చ నడుస్తోంది.

అయితే, ఈ పుకార్లపై షోయబ్ జమై మాట్లాడుతూ.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాజకీయాల్లో ఏదైనా జరుగొచ్చని అన్నారు. మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గమైన సీలంపూర్‌కు మంచి అభ్యర్థి అవసరం ఉందని చెప్పారు. పఠాన్ అభ్యర్థిత్వానికి సంబంధించి ఎంఐఎం నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Read Also: Venu Swamy : అల్లు అర్జున్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..

ఎంఐఎం నేత నిందితుడి ఇంటికి వెళ్లి కలవడంపై రాజకీయ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీ శాంతి, సామరస్యానికి భంగం కలిగించేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోందని బీజేపీ నేత విజేందర్ గుప్తా అన్నారు. అశాంతి సృష్టించడం, నగరాన్ని విభజించడం వారి ఏకైక ఉద్దేశ్యమని చెప్పారు. పఠాన్ కుటుంబాన్ని సందర్శించిన తర్వాత… విచారణ లేకుండా జైలులో మగ్గుతున్న వారికి సంఘీభావం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘‘ఇటీవల నేను జైలులో ఉన్న షారుక్ పఠాన్ తల్లిని అతని ఇంట్లో కలిశాను. ఢిల్లీలో న్యాయ పోరాటంలో మా ఈ చిన్న అడుగు విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్న ఎన్నో కుటుంబాలకు ధైర్యాన్నిస్తుంది. సుప్రీం కోర్టు ప్రకారం బెయిల్ అనేది పెండింగ్‌లో ఉన్న ఖైదీల హక్కు. అరవింద్ కేజ్రీవాల్ కోరిక మేరకు తన కొడుకుపై కేసు పెట్టారని అతని తల్లి చెప్పింది’’ అని జమై చెప్పుకొచ్చారు.

ఢిల్లీ అల్లర్లో హెడ్ కానిస్టేబుల్ దీపక్ దహియాకు గన్ గురిపెట్టిన కేసుతో పాటు రోహిత్ శుక్లా అనే వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో షారుక్ పఠాన్ నిందితుడిగా ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆప్ తరుపున చౌదరి జుబేర్ అహ్మద్‌ని బరిలోకి దించగా, కాంగ్రెస్ అబ్దుల్ రెహ్మాన్‌ని ప్రకటించింది. బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. సీలంపూర్ సంప్రదాయంగా కాంగ్రెస్ కంచుకోట. అయితే గత రెండు సార్లు ఇక్కడ నుంచి ఆప్ గెలుపొందింది. అల్లర్ల కేసులో షారూక్ పఠాన్‌కి బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు అక్టోబర్‌లో నిరాకరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2020 Delhi Riots
  • AAP
  • AIMIM
  • Delhi Assembly elections

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత

  • T20 WC 2026 Semi Final Schedule: సెమీస్‌ షెడ్యూల్‌.. భారత్‌ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Sanju Samson : సంజు శాంసన్‌పై మలయాళ స్టార్ హీరో ప్రశంసలు

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions