Maharashtra: కాంట్రాక్ట్ ఉద్యోగి రూ. 21 కోట్ల ఘరానా మోసం.. గర్ల్ఫ్రెండ్కి BMW కార్, 4 BHK ఫ్లాట్ గిఫ్ట్..
- సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘరానా మోసం..
- ప్రభుత్వం నుంచి రూ. 21 కోట్ల దొంగతనం..
- గర్ల్ఫ్రెండ్కి బీఎండబ్లూ కారు, విలాసవంతమైన ఫ్లాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్లో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి జీతం నెలకు రూ. 13,000. అయితే, తన గర్ల్ఫ్రెండ్కి మాత్రం బీఎండబ్ల్యూ కారు, 4BHK ఫ్లాట్ని గిఫ్ట్గా ఇవ్వడం సంచలనంగా మారింది. ఏకంగా ప్రభుత్వం నుంచే రూ. 21 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇంత లగ్జరీ లైఫ్స్టైల్ ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితుడు హర్ష్ కుమార్ క్షీరసాగర్ తనకు తెలిసిన మరో వ్యక్తితో కలిసి ప్రభుత్వం నుంచి రూ. 21 కోట్ల 59 లక్షలు మోసం చేశారు. ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఛత్రపతి శంభాజీనగర్లోని డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ డబ్బును స్వాహా చేశారు. దొంగిలించిన నిధులతో, నిందితుల్లో ఒకరు తన ప్రియురాలి కోసం ఎయిర్పోర్టుకు ఎదురుగా ఉండే విలాసవంతమైన 4 BHK ఫ్లాట్ను కొనుగోలు చేశారు. బీఎండబ్ల్యూ కారు, బీఎండబ్ల్యూ బైక్ కొనుగోలు చేశారు. ప్రియురాలి కోసం నగరంలోని ఒక నగల వ్యాపారి నుంచి వజ్రాలు పొదిగిన గాజులను ఇచ్చాడు.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
Read Also: Hyderabad Crime: బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై అత్యాచారయత్నం.. నలుగురు అరెస్ట్
ఈ మోసంలో ప్రమేయం ఉన్న మరో మహిళా కాంట్రాక్ట్ వర్కర్ భర్త రూ. 35 లక్షల విలువైన ఎస్యూవీని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు హర్ష్ కుమార్ తన కారు తీసుకుని ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రభుత్వ నిధుల కోసం ఉద్దేశించిన ఇండియన్ బ్యాంక్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో అకౌంట్ తెరిచి ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. లావాదేవీల కోసం డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం అవసరం. అయితే, కాంప్లెక్స్లోని కాంట్రాక్టు ఉద్యోగులైన హర్ష్కుమార్ క్షీరసాగర్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్లు బ్యాంకుకు అందజేసేందుకు కల్పిత పత్రాలను రూపొందించారు.నకిలీ పత్రాలను ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్టివేట్ చేసిన తర్వాత, వారు తమ ఖాతాలకు నిధులను బదిలీ చేశారు. డిపార్ట్మెంటల్ డిప్యూటీ డైరెక్టర్ ఆరు నెలల తర్వాత మాత్రమే ఈ కుంభకోణాన్ని గుర్తించడం గమనార్హం.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!