Maharashtra: కాంట్రాక్ట్ ఉద్యోగి రూ. 21 కోట్ల ఘరానా మోసం.. గర్ల్ఫ్రెండ్కి BMW కార్, 4 BHK ఫ్లాట్ గిఫ్ట్..
- సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘరానా మోసం..
- ప్రభుత్వం నుంచి రూ. 21 కోట్ల దొంగతనం..
- గర్ల్ఫ్రెండ్కి బీఎండబ్లూ కారు, విలాసవంతమైన ఫ్లాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్లో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి జీతం నెలకు రూ. 13,000. అయితే, తన గర్ల్ఫ్రెండ్కి మాత్రం బీఎండబ్ల్యూ కారు, 4BHK ఫ్లాట్ని గిఫ్ట్గా ఇవ్వడం సంచలనంగా మారింది. ఏకంగా ప్రభుత్వం నుంచే రూ. 21 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇంత లగ్జరీ లైఫ్స్టైల్ ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితుడు హర్ష్ కుమార్ క్షీరసాగర్ తనకు తెలిసిన మరో వ్యక్తితో కలిసి ప్రభుత్వం నుంచి రూ. 21 కోట్ల 59 లక్షలు మోసం చేశారు. ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఛత్రపతి శంభాజీనగర్లోని డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ డబ్బును స్వాహా చేశారు. దొంగిలించిన నిధులతో, నిందితుల్లో ఒకరు తన ప్రియురాలి కోసం ఎయిర్పోర్టుకు ఎదురుగా ఉండే విలాసవంతమైన 4 BHK ఫ్లాట్ను కొనుగోలు చేశారు. బీఎండబ్ల్యూ కారు, బీఎండబ్ల్యూ బైక్ కొనుగోలు చేశారు. ప్రియురాలి కోసం నగరంలోని ఒక నగల వ్యాపారి నుంచి వజ్రాలు పొదిగిన గాజులను ఇచ్చాడు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
Read Also: Hyderabad Crime: బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై అత్యాచారయత్నం.. నలుగురు అరెస్ట్
ఈ మోసంలో ప్రమేయం ఉన్న మరో మహిళా కాంట్రాక్ట్ వర్కర్ భర్త రూ. 35 లక్షల విలువైన ఎస్యూవీని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు హర్ష్ కుమార్ తన కారు తీసుకుని ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రభుత్వ నిధుల కోసం ఉద్దేశించిన ఇండియన్ బ్యాంక్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో అకౌంట్ తెరిచి ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. లావాదేవీల కోసం డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం అవసరం. అయితే, కాంప్లెక్స్లోని కాంట్రాక్టు ఉద్యోగులైన హర్ష్కుమార్ క్షీరసాగర్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్లు బ్యాంకుకు అందజేసేందుకు కల్పిత పత్రాలను రూపొందించారు.నకిలీ పత్రాలను ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్టివేట్ చేసిన తర్వాత, వారు తమ ఖాతాలకు నిధులను బదిలీ చేశారు. డిపార్ట్మెంటల్ డిప్యూటీ డైరెక్టర్ ఆరు నెలల తర్వాత మాత్రమే ఈ కుంభకోణాన్ని గుర్తించడం గమనార్హం.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!