Maharashtra: కాంట్రాక్ట్ ఉద్యోగి రూ. 21 కోట్ల ఘరానా మోసం.. గర్ల్ఫ్రెండ్కి BMW కార్, 4 BHK ఫ్లాట్ గిఫ్ట్..
- సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘరానా మోసం..
- ప్రభుత్వం నుంచి రూ. 21 కోట్ల దొంగతనం..
- గర్ల్ఫ్రెండ్కి బీఎండబ్లూ కారు, విలాసవంతమైన ఫ్లాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్లో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి జీతం నెలకు రూ. 13,000. అయితే, తన గర్ల్ఫ్రెండ్కి మాత్రం బీఎండబ్ల్యూ కారు, 4BHK ఫ్లాట్ని గిఫ్ట్గా ఇవ్వడం సంచలనంగా మారింది. ఏకంగా ప్రభుత్వం నుంచే రూ. 21 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇంత లగ్జరీ లైఫ్స్టైల్ ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితుడు హర్ష్ కుమార్ క్షీరసాగర్ తనకు తెలిసిన మరో వ్యక్తితో కలిసి ప్రభుత్వం నుంచి రూ. 21 కోట్ల 59 లక్షలు మోసం చేశారు. ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఛత్రపతి శంభాజీనగర్లోని డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ డబ్బును స్వాహా చేశారు. దొంగిలించిన నిధులతో, నిందితుల్లో ఒకరు తన ప్రియురాలి కోసం ఎయిర్పోర్టుకు ఎదురుగా ఉండే విలాసవంతమైన 4 BHK ఫ్లాట్ను కొనుగోలు చేశారు. బీఎండబ్ల్యూ కారు, బీఎండబ్ల్యూ బైక్ కొనుగోలు చేశారు. ప్రియురాలి కోసం నగరంలోని ఒక నగల వ్యాపారి నుంచి వజ్రాలు పొదిగిన గాజులను ఇచ్చాడు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
Read Also: Hyderabad Crime: బలవంతంగా ఇంట్లోకి దూరి బాలికపై అత్యాచారయత్నం.. నలుగురు అరెస్ట్
ఈ మోసంలో ప్రమేయం ఉన్న మరో మహిళా కాంట్రాక్ట్ వర్కర్ భర్త రూ. 35 లక్షల విలువైన ఎస్యూవీని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు హర్ష్ కుమార్ తన కారు తీసుకుని ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రభుత్వ నిధుల కోసం ఉద్దేశించిన ఇండియన్ బ్యాంక్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో అకౌంట్ తెరిచి ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. లావాదేవీల కోసం డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం అవసరం. అయితే, కాంప్లెక్స్లోని కాంట్రాక్టు ఉద్యోగులైన హర్ష్కుమార్ క్షీరసాగర్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్లు బ్యాంకుకు అందజేసేందుకు కల్పిత పత్రాలను రూపొందించారు.నకిలీ పత్రాలను ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్టివేట్ చేసిన తర్వాత, వారు తమ ఖాతాలకు నిధులను బదిలీ చేశారు. డిపార్ట్మెంటల్ డిప్యూటీ డైరెక్టర్ ఆరు నెలల తర్వాత మాత్రమే ఈ కుంభకోణాన్ని గుర్తించడం గమనార్హం.
తాజావార్తలు
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!