Bangladesh: యూనస్ ప్రభుత్వంపై షేక్ హసీనా కుమారుడి సంచలన ఆరోపణలు..
- యూనస్ ప్రభుత్వంపై హసీనా కుమారుడి ఆరోపణలు..
- న్యాయవ్యవస్థను ఆయుధం ఉపయోగిస్తున్నారని వాజెద్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సంజీబ్ వాజెద్ సంచలన ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ నాయకులపై వేధింపుల కోసం న్యాయవ్యవస్థను యూనస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు పక్షపాత విచారణ నిర్వహించాలని వాజెద్ కోరారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా ఆగస్టు 05న బంగ్లా నుంచి పారిపోయి భారత్ వచ్చారు. ప్రస్తుతం యూనస్ ప్రభుత్వం ఆమెపై అనేక నేరాలు మోపింది, తమకు ఆమెను అప్పగించాలని భారత్ని బంగ్లాదేశ్ కోరుతోంది. ఈ నేపథ్యంలోనే వాజెద్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: MS Dhoni: కుమార్తె కోసం శాంతా క్లాజ్గా మారిన మహీ.. ఫోటో వైరల్
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ICT) హసీనా మరియు పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, సైనిక , పౌర అధికారులకు “మానవత్వం మరియు మారణహోమంపై నేరాలకు” అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ‘‘ఎన్నికలు లేకుండా యూనస్ ప్రబుత్వం నియమించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ ద్వారా హాస్యాస్పదమైన విచారణ ప్రక్రియ నిర్వహిస్తున్నారి, ఇది న్యాయమాన్ని వదిలేసి అవామీ లీగ్ నాయకత్వాన్ని హింసించేందుకు జరుగుతున్న దాని సూచిస్తుంది’’ అని వాజెద్ మంగళవారం తన పోస్టులో తెలిపారు.
వందలాది నాయకుల్ని, కార్యకర్తల్ని చట్టవిరుద్ధంగా చంపారని, వేలాది మందిని అక్రమంగా నిర్బంధించారని ఆయన విమర్శించారు. యూనస్ పాలన న్యాయవ్యవస్థను ఆయుధాలుగా మార్చిందని, న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం లేదని ఆయన వాజెద్ అన్నారు. హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో 1500 మంది మరణించగా, 19931 మంది గాయపడినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే, తాజాగా బంగ్లాదేశ్లో నిర్మితమవుతున్న తొలి అణువిద్యుత్ కేంద్రం ఒప్పందానికి సంబంధించి షేక్ హసీనా, ఆమె కుటుంబం 5 బిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?