Serial killer: “లిఫ్ట్ ఇచ్చి హత్య”..11 మందిని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్..
- 18 నెలల వ్యవధిలో 11 హత్యలు..
- బాధితులంతా మగవాళ్లే.. లిఫ్ట్ ఇచ్చి హత్య..
- పంజాబ్ సీరియల్ కిల్లర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial killer: పంజాబ్లో గత 18 నెలల వ్యవధిలో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత వారిని దోచుకుని హత్యలకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం రూపనగర్ జిల్లాలో పట్టుకున్నారు. నిందితుడిని హోషియార్పూర్ జిల్లాలో గర్శంకర్లోని చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల రామ్ సరూప్గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులందరూ పురుషులే అని, వారితో కిల్లర్ లైంగిక చర్యలకు పాల్పడినట్లు చెప్పారు. ప్రధానంగా వారికి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత, నిందితుడు ఆ వ్యక్తుల్ని దోచుకునే వాడు. డబ్బులు ఇవ్వడానికి బాధితులు నిరాకరించిన పక్షంలో వారిని చంపేవాడు. చాలా కేసుల్లో నిందితుడు, బాధితుల గొంతుకు వస్త్రాన్ని బిగించి చంపారు. కొన్ని కేసుల్లో తలకు గాయాలై చనిపోయారని అధికారులు తెలిపారు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
Read Also: Indigo: రైలు అనుకున్నాడో ఏమో? విమానంలో తిరిగి ప్రయాణికులకు టీ అందించిన వ్యక్తి (వీడియో)
ఒక హత్యలో నిందితుడు చంపేసిన వ్యక్తి వీపుపై ‘ధోకేబాజ్’ (మోసగాడు) అని రాశాడు. హత్యకు గురైన వ్యక్తి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మాజీ సైనికుడు. ఆగస్టు 18న టోల్ప్లాజా మెడ్రా వద్ద టీ, నీళ్లు అందించే 37 ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో సరూప్ మరో 10 మందిని హత్య చేసినట్ల వెల్లడైంది. ఇప్పటి వరకు 5 కేసుల్ని నిర్ధారించగా, మిగిలిన హత్యల కోసం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు రూపనగర్, హోషియార్పూర్, ఫతేగర్ జిల్లాల ప్రజల్ని హత్య చేశాడు. కూలీ పనులు చేసుకునే కిల్లర్ డ్రగ్స్కి బానిసైనట్లు అధికారులు తెలిపారు. చంపిన తర్వాత పశ్చాత్తాపంతో మరణించిన వ్యక్తుల పాదాలకు నమస్కరించి, క్షమించమని కోరే వాడని, మద్యం మత్తులో ఉన్న తర్వాతే నేరాలకు పాల్పడుతున్నాడని నిందితుడు వెల్లడించాడు. నిందితుడికి పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారని, స్వలింగ సంపర్కం కారణంగా రెండేళ్ల క్రితం అతడి కుటుంబ సభ్యులు అతడిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేశామని, త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!