Serial killer: “లిఫ్ట్ ఇచ్చి హత్య”..11 మందిని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్..
- 18 నెలల వ్యవధిలో 11 హత్యలు..
- బాధితులంతా మగవాళ్లే.. లిఫ్ట్ ఇచ్చి హత్య..
- పంజాబ్ సీరియల్ కిల్లర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial killer: పంజాబ్లో గత 18 నెలల వ్యవధిలో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత వారిని దోచుకుని హత్యలకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం రూపనగర్ జిల్లాలో పట్టుకున్నారు. నిందితుడిని హోషియార్పూర్ జిల్లాలో గర్శంకర్లోని చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల రామ్ సరూప్గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులందరూ పురుషులే అని, వారితో కిల్లర్ లైంగిక చర్యలకు పాల్పడినట్లు చెప్పారు. ప్రధానంగా వారికి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత, నిందితుడు ఆ వ్యక్తుల్ని దోచుకునే వాడు. డబ్బులు ఇవ్వడానికి బాధితులు నిరాకరించిన పక్షంలో వారిని చంపేవాడు. చాలా కేసుల్లో నిందితుడు, బాధితుల గొంతుకు వస్త్రాన్ని బిగించి చంపారు. కొన్ని కేసుల్లో తలకు గాయాలై చనిపోయారని అధికారులు తెలిపారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
Read Also: Indigo: రైలు అనుకున్నాడో ఏమో? విమానంలో తిరిగి ప్రయాణికులకు టీ అందించిన వ్యక్తి (వీడియో)
ఒక హత్యలో నిందితుడు చంపేసిన వ్యక్తి వీపుపై ‘ధోకేబాజ్’ (మోసగాడు) అని రాశాడు. హత్యకు గురైన వ్యక్తి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మాజీ సైనికుడు. ఆగస్టు 18న టోల్ప్లాజా మెడ్రా వద్ద టీ, నీళ్లు అందించే 37 ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో సరూప్ మరో 10 మందిని హత్య చేసినట్ల వెల్లడైంది. ఇప్పటి వరకు 5 కేసుల్ని నిర్ధారించగా, మిగిలిన హత్యల కోసం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు రూపనగర్, హోషియార్పూర్, ఫతేగర్ జిల్లాల ప్రజల్ని హత్య చేశాడు. కూలీ పనులు చేసుకునే కిల్లర్ డ్రగ్స్కి బానిసైనట్లు అధికారులు తెలిపారు. చంపిన తర్వాత పశ్చాత్తాపంతో మరణించిన వ్యక్తుల పాదాలకు నమస్కరించి, క్షమించమని కోరే వాడని, మద్యం మత్తులో ఉన్న తర్వాతే నేరాలకు పాల్పడుతున్నాడని నిందితుడు వెల్లడించాడు. నిందితుడికి పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారని, స్వలింగ సంపర్కం కారణంగా రెండేళ్ల క్రితం అతడి కుటుంబ సభ్యులు అతడిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేశామని, త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!