Venu Goapl Reddy
Author- NTV Telugu-
Pahalgam Attack: పహల్గామ్ దాడి తర్వాత 21 మంది ఉగ్రవాదులు ఖతం..
Pahalgam Attack: ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల్ని వేటాడి హతమారుస్తు్న్నారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్ జాయింట్ ఆపరేషన్లలో విజయాలు సాధిస్తున్నారు. విదేశీ, స్థానిక ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు ఆరు వేర్వేరు ఎన్కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల్లో 12 మంది పాకిస్తాన్ పౌరులు కాగా, 9 మంది స్థానిక వాసులు. ఆపరేషన్ […] -
Sanatana Remarks: “సనాతన ధర్మం”పై ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్..
Sanatana Remarks: శరద్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘సనాతన ధర్మాన్ని’’ గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర ఆదివారం ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’ పై విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని కించపరచాలని, హిందూ ఉగ్రవాదం వంటి పదాలను ఉపయోగించాలని జితేంద్ర అవద్ నిర్ణయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
China: చైనాను భయపెడుతున్న జనాభా సంక్షోభం.. పిల్లల తల్లిదండ్రులకు సబ్సిడీలు..
China: పాకిస్తాన్ మిత్రదేశం చైనా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా చైనాలో జనాభా తగ్గదల కనిస్తోంది. ముఖ్యంగా, పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి చైనా యువత ఆసక్తి చూపించడం లేదు. దీంతో జననాల రేటు పడిపోతోంది. ప్రస్తుతం, చాలా దేశాలు జనాభాను తమ వ్యూహాత్మక ఆస్తిగా పరిగణిస్తున్నాయి. చాలా దేశాల్లో యవ జనభా తగ్గిపోయి, వృద్ధ జనాభా పెరుగుతోంది. దీంతో ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తున్నాయి. -
Bengaluru: నర్సింగ్ విద్యార్థినిపై పీజీ ఓనర్ అత్యాచారం..
Bengaluru: బెంగళూర్లో దారుణం జరిగింది. పేయింగ్ గెస్ట్గా ఉంటున్న విద్యార్థినిపై పీజీ ఓనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు అష్రఫ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 10 రోజుల క్రితమే తాను అష్రఫ్ ప్రాపర్టీలోకి పేయింగ్ గెస్ట్గా వచ్చానని సదరు విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొంది. Read Also: Viral Video: లగేజీ విషయంలో గందరగోళం.. స్పైస్జెట్ ఉద్యోగులను చితకబాదిన ఆర్మీ అధికారి(వీడియో) సోమవారం రాత్రి అష్రఫ్ తన గదిలోకి వచ్చి, […] -
Wife Kills Husband: కూతురుతో కలిసి భర్తను చంపిన భార్య.. సహాయం చేసిన మరో ఇద్దరు..
Wife Kills Husband: భర్తలను హత్యలు చేస్తున్న భార్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్రమ సంబంధాలు, పెళ్లి తర్వాత వేరే వారితో ప్రేమ వ్యవహరాల కారణంగా కట్టుకున్నవాడిని కడతేరుస్తున్నారు. తాజాగా, అస్సాంలో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, తన కుమార్తెతో కలిసి భర్తను హత్య చేసింది. దీనికి మరో ఇద్దరు యువకులు సహకరించారు. అయితే, హత్యను తప్పుదారి పట్టించేందుకు భార్య కట్టుకథ అల్లింది. -
US Car Crash: తప్పిపోయిన భారత సంతతి కుటుంబ.. 5 రోజుల తర్వాత మృతదేహాల గుర్తింపు..
US Car Crash: ఐదు రోజుల క్రితం అమెరికా రోడ్డు ప్రమాదంలో అదృశ్యమైన భారత సంతతి కుటుంబానికి చెందిన నలుగురు మరణించినట్లు ఆదివారం మార్షల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. 80 ఏళ్ల వయసు ఉన్న సీనియర్ సిటిజన్ కూడా ఈ కారు ప్రమాదంలో మరణించారు. -
Mani Shankar Aiyar: ‘‘పాకిస్తాన్ను ఎవరూ నిందించడం లేదు’’..కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్..
Mani Shankar Aiyar: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతు గురించి తెలియజేయడానికి వెళ్లిన భారత దౌత్య బృందాలపై కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ని టార్గెట్ చేసుకున్నారు. భారత్ దౌత్య బృందాలు వెళ్లిన 33 దేశాల్లో ఏదీ కూడా పహల్గామ్ దాడికి పాకిస్తాన్ను నిందించలేదని అన్నారు. -
Pakistan: బొమ్మ అని భావించి “మోర్టార్ షెల్”తో ఆట, పేలుడుతో ఐదుగురు మృతి..
Pakistan: పాకిస్తాన్లో అనుకోని ప్రమాదం జరిగింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా(కేపీకే) ప్రావిన్సులో ‘‘మోర్టార్ షెల్’’ పేలుడుతో ఐదుగురు పిల్లలు మరణించారు. మరో 13 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. లక్కీ మార్వాట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నలుగురు బాలికలు ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
Tragedy: భార్య “వివాహేతర సంబంధం”.. పిల్లలకు విషమిచ్చి, ఆత్మహత్య చేసుకున్న భర్త..
Tragedy: గుజరాత్లోని సూరత్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. భార్య వేరే వ్యక్తితో ‘‘వివాహేతర సంబంధం’’ ఉందనే కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత వ్యక్తిని అల్పేష్ భాయ్ కాంతిభాయ్ సోలంకి(41)గా గుర్తించారు. అల్పేష్ తన 7,2 ఏళ్ల ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు, ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో భార్య, ఆమె ప్రేమికుడిని అరెస్ట్ చేశారు. Read Also: Transgender In Court: […] -
Rajnath Singh: దమ్ముంటే ఆ ‘‘అణుబాంబు’’ పేల్చు.. రాహుల్ గాంధీకి రాజ్నాథ్ సవాల్..
Rajnath Singh: ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా ‘‘ఓట్ల దొంగతనానికి సంబంధించిన సాక్ష్యాల అణుబాంబు’’ తన వద్ద ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల సంచనల వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం తీవ్రంగా విమర్శించారు. ఆ అణుబాంబును పేల్చాలని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
-
Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్
-
Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!
-
Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?