ఇదిలా ఉంటే, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి కాల్పులను తీవ్రం చేసింది. వీటికి ధీటుగా ఇండియా స్పందించింది. పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ఫతే-1ని భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి ప్రయోగించిన క్షిపణిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది.
ఇదిలా ఉంటే, ఈ రోజు తెల్లవారుజామున 10 గంటలకే ఇండియన్ మిలిటరీ మీడియా సమవేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. పాకిస్తా్న్ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సౌత్ బ్లాక్ లో మీడియా సమావేశం జరగబోతోంది.
Operation Sindoor: భారత్ పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా భారత్, పాకిస్తాన్ ఆర్మీ హెడ్క్వార్టర్స్ ఉన్న రావల్పిండిని టార్గెట్ చేసింది. రావల్పిండిలోని కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై భీకర దాడి చేసింది.
Operation Sindoor: భారత్ మరోసారి ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవార సాయంత్రం పాకిస్తాన్ భారతీయ నగరాలను టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడులకు తెగబడింది. దీనికి ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇండియా పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు చేసింది. ఏకంగా పాకిస్తాన్ మిలిటరీకి హెడ్ క్వార్టర్గా ఉన్న రావల్పిండినే భారత్ టార్గెట్ చేసింది. బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో భారత్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
India Pakistan War:పాకిస్తాన్ వ్యాప్తంగా భారత్ దాడులు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున భారత్ పాకిస్తాన్పై దాడులు చేస్తోంది. నార్వాల్, షార్కోట్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్లను భారత్ ద్వంసం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రజలు సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిపై భారీ దాడి జరిగినట్లు సమాచారం వస్తోంది.
India Pakistan: పాకిస్తాన్ భారతదేశంలో చేస్తు్న్న ఉగ్రవాద దాడుల్ని కవర్ చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వీడియోలను వాడుతోంది. ఇటీవల, పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్నారు
Pakistan Earthquake: పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున 1.44 గంటలకు రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో భూకంప వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(NCS) వెల్లడించింది. ఇటీవల పాకిస్తాన్లో సంభవించిన భూకంపాల్లో ఇది నాలుగవది. మే 5న 4.2 తీవ్రతో భూకంపం వచ్చింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో భూకంప కేంద్రం ఉంది.
India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్పై డ్రోన్ దాడికి తెగబడింది. అయితే, భారత సైన్యం ఈ దాడిని భగ్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
India Pak War: సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్లలోని పలు నగరాలను, ప్రజల ఇళ్లను టార్గెట్ చేస్తూ వరసగా రెండో రోజు పాకిస్తాన్ డ్రోన్ అటాక్ చేసింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే, ఈ దాడిలో పాకిస్తాన్ మిత్ర దేశం టర్కీ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. భయంకరమైన భూకంప సమయంలో మానవతా దృక్పథంలో భారత్ టర్కీకి సాయం చేసినా, ఆ దేశం మాత్రం పాకిస్తాన్కి సహకరిస్తూ వస్తోంది. […]
India Pakistan War: పాకిస్తాన్, తాను ఎంత నాశనం అవుతున్నా భారత్ ఎదగకూడదు, భారత్ ప్రశాంతంగా ఉండకూడదు అనేదే దాని ఉద్దేశ్యం. భారత్ని చికాకు పరుస్తూ పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలకు మద్దతు ఇస్తోంది. ఇటీవల, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి లష్కరే తోయిబా పనే. ఈ దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని ప్రారంభించి పాక్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భీకర దాడులు చేసింది. 100కు […]