Australia terror attack: సిడ్నీ టెర్రర్ అటాక్.. సాజిద్ భారత లింకులపై దర్యాప్తు..
- సిడ్నీ టెర్రర్ అటాక్, నిందితుడి భారత లింకులపై దర్యాప్తు..
- భారత్-ఆస్ట్రేలియా ప్రయాణాలపై ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia terror attack: ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్ షూటింగ్ ఘటనపై సంచలనంగా మారింది. యూదులను టార్గెట్ చేస్తూ 50 ఏళ్ల సాజిద్, అతడి 24 ఏళ్ల కుమారుడు నవీద్లు కాల్పులకు తెగబడ్డారు. యూదులనకు సంబంధించిన హనుక్కా పండగ రోజుల కాల్పుల ఘటన జరిగింది. ఘటనాస్థలంలోనే సాజిద్ను అధికారులు హతమార్చగా, నవీద్పై హత్య, ఉగ్రవాదంతో సహా 59 నేరాల కింద అభియోగాలు మోపారు. అయితే, సాజిద్ ఇండియాతో సంబంధాలు ఉండటం, హైదరాబాద్కు చెందిన వ్యక్తి కావడంతో కేంద్రం, రాష్ట్ర ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి.
READ ALSO: Modi Magic on X: ఎక్స్లో మోడీ మ్యాజిక్… టాప్ 10లో 8 ప్రధానివే!
Also Read
సాజిద్ ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం(PR) పొందడానికి 27 సార్లు ప్రయత్నించాడని, కానీ ఎప్పుడూ PR వీసాను పొందలేదని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. అయితే, అతనికి రెసిడెంట్ రిటర్న్ వీసా మంజూరు చేసినట్లు అధికారులు గుర్తించారు. 1998లో హైదరాబాద్లోని అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో బీఏ పూర్తి చేసినట్లు తెలిసింది. దీని తర్వాత అదే ఏడాది నవంబర్లో విద్యార్థి వీసాపై సాజిద్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 2000 సంవత్సరంలో సాజిద్ ఆస్ట్రేలియాలో అప్పటికే PR హోదా ఉన్న వనెస్సాను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది సాజిద్ వీసా పార్ట్నర్ వీసాగా మారింది. 2008లో అతను రెసిడెంట్ రిటర్న్ వీసాను పొందాడు.
సాజిద్కు 2001లో నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. అతడికి శాశ్వత నివాస హోదా లభించింది. 2003లో సాజిద్ తన భార్య వెనెస్సాతో కలిసి భారత్ వచ్చాడు. వారిద్దరు ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం, భారత్లో మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. 2004లో సాజిద్ తన కొడుకును తన బంధవులకు పరిచయం చేయడానికి భారత్ తీసుకువచ్చాడు. 2006లో తన తండ్రి మరణానంతరం సాజిద్ మరోసారి భారత్ వచ్చాడు. 2012లో మరోసారి భారత్ వచ్చాడు, చివరిసారిగా 2018లో భారత్ వచ్చినట్లు తెలిసింది. ఆ సమయంలో హైదరాబాద్తో తన వారసత్వ ఆస్తిని విక్రయించాడు. అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును అతను ఆస్ట్రేలియాలో ఇళ్లు కొనుగోలుకు ఉపయోగించాడు. శాశ్వత హోదా లేనప్పటికీ సాజిద్ ఆస్ట్రేలియాలో ఎలా నివసించగలిగాడు అనే దానిపై ఎజెన్సీలు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాయి. అతడి ఆర్థిక లావాదేవీలు, వీసా పొడగింపులు, సుదీర్ఘకాలం పాటు విదేశాల్లో నివాసం ఉండటంపై కూడా దర్యాప్తు జరుగుతోంది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..