Bangladesh Unrest: బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక అల్లర్లు.. మీడియా, బంగ్లా జాతిపిత ఇంటిపై దాడులు ఎందుకు..?
- రాడికల్ ఇస్లామిస్ట్ హాది హత్యపై అట్టుడుకుతున్న బంగ్లాదేశ్..
- బంగ్లా వ్యాప్తంగా హింసాత్మక సంఘటను, హిందువులే టార్గెట్..
- బంగ్లా మీడియా, బంగ్లా జాతిపిత ముజిబుర్ రెహమాన్ ఇంటిపై దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Unrest: షేక్ హసీనాపై తిరుగుబాటు సమయంలో అట్టుడికిన బంగ్లాదేశ్, మరోసారి ఉద్రిక్తంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత మరణం తర్వాత, ఆ దేశం అల్లర్లతో హింసాత్మకంగా మారింది. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు, హిందువులను టార్గెట్ చేస్తూ రాడికల్ శక్తులు దాడులకు పాల్పడుతున్నాయి. గురువారం రాత్రి, దైవదూషణ చేశాడనే ఆరోపణలతో మైమన్సింగ్ జిల్లాలో హిందూవ్యక్తి, 30 ఏళ్ల దీపు చంద్ర దాస్ను దారుణంగా కొట్టి, చెట్టుకు కట్టేసి తగలబెట్టారు. ఈ ఘటనతో బంగ్లాలోని హిందువులు, ఇతర మైనారిటీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి.
మరోవైపు, రాడికల్ ఇస్లామిస్ట్ శక్తులు బంగ్లాదేశ్ లౌకిక చరిత్రతో సంబంధం ఉన్న మీడియా సంస్థలైన డైలీ స్టార్, ప్రొథమ్ ఆలో వంటి ప్రముఖ దినపత్రిక కార్యాలయాలపై రాత్రిపూట హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. ఇదే కాకుండా, బంగ్లాదేశ్ జాతిపితగా పిలువబడే షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి నిప్పుపెట్టారు. ముజిబుర్ రెహమాన్ నివసించి, మరణించిన ధన్మొండి 32 వద్ద ఉన్న ఇంటిని నిరసనకారులు కాల్చివేవారు. విధ్వంస సమయంలో నిరసనకారులు జేసీబీ వంటి యంత్రాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పోస్టర్లను కూడా తగలబెట్టారు.
Also Read
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
- Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
Read Also: Bangladesh Violence: హిందూ వ్యక్తి హత్యపై స్పందించిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం..
పెరిగిన భారత వ్యతిరేకత:
తీవ్ర భారత వ్యతిరేకిగా ముద్రపడిన రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదిని కొన్ని రోజులు క్రితం రాజధాని ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చారు. అతను చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఒక్కసారిగా బంగ్లా హింసాత్మకంగా మారింది. మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. అయితే, నిందితులను గుర్తించామని, కాల్పులు జరిపిన వ్యక్తి భారత్ పారిపోయి ఉంటాడని అధికారులు తెలిపారు. ఈ వ్యాఖ్యలు భారత్తో కొత్త వివాదానికి కారణమయ్యాయి. దీనిపై భారత్ బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించి, తన నిరసనను వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ కూడా ఢాకాలోని భారత రాయబారిని పిలిపించి వివరణ కోరింది.
గతేడాది షేక్ హసీనా పదవి కోల్పోయి, భారత్ పారిపోయి రావడానికి హాది ముఖ్యకారణం. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన విద్యార్థి నాయకుల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. నిలువెల్లా భారత వ్యతిరేకత కలిగిన హాది, ఇటీవల భారత భూభాగాలతో కలిపి ‘‘గ్రేటర్ బంగ్లాదేశ్’’ మ్యాప్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది జరిగిన తర్వాత రోజే ఇతను హత్యకు గురయ్యాడు. బంగ్లాదేశ్ మీడియా సంస్థలకు భారత్తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఇస్లామిస్ట్ శక్తులు ఆరోపిస్తూ, దాడులకు పాల్పడుతున్నాయి.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?