PM Modi: గౌహతి విమానాశ్రయం కొత్త టెర్మినల్ను శనివారం ప్రధాని నరంద్రమోడీ ప్రారంభించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నంత కాలం అస్సాం, ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రాంత భద్రత, గుర్తింపును పణంగా పెట్టి చొరబాటుదారుల్ని రక్షించిందని ఆరోపించారు.
Bangladesh: బంగ్లాదేశ్లో రాడికల్ మతోన్మాద విద్యా్ర్థి నాయకుడు షరీప్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత హింస చెలరేగింది. డిసెంబర్ 12న ఢాకాలో అతడిని ఇద్దరు వ్యక్తులు అతి దగ్గర నుంచి కాల్చి, తీవ్రంగా గాయపరిచారు. డిసెంబర్ 19న హాది చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఇతడి మరణం తర్వాత బంగ్లాదేశ్ భగ్గుమంది. రాడికల్ శక్తులు మళ్లీ అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. మైమన్సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిని దైవదూషణ ఆరోపణతో హత్య చేశారు. Read Also: […]
Epstein Files: ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికాను వణికిస్తున్నాయి. లైంగిక నేరస్తుడు, ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైళ్లను 30 రోజుల్లోగా విడుదల చేయాలని గత నెలలో అమెరికా అధ్యక్షుడు ఒక బిల్లుపు సంతకం చేశాడు. శుక్రవారం అమెరికా న్యాయ శాఖ(DOJ) వేలాది ఫైళ్లను విడుదల చేసింది. ఈ ఫైళ్లలో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖల పేర్లు, ఫోటోలు ఉండటం సంచలనంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్తో సహా, ఇప్పటి అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, మైఖెల్ […]
Bangladesh: భారత వ్యతిరేకి, ఇస్లామిస్ట్ రాడికల్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలకు కారణమైంది. శనివారం అతడి అంత్యక్రియలు ఢాకాలో జరిగాయి. దీనికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే, బంగ్లా జాతీయ కవి, విప్లవ కవిగా పేరున్న కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే హాది అంత్యక్రియలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Bangladesh: రాడికల్ ఇస్టామిస్ట్ షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య బంగ్లాదేశ్లో తీవ్ర హింసకు కారణమైంది. ఇదే సమయంలో దేశంలోని మైమన్సింగ్ నగరంలో ఒక హిందూ వ్యక్తిని ‘‘దైవదూషణ’’ ఆరోపణలతో అత్యంత దారుణంగా దాడి చేసి, చెట్టుకు కట్టేసి కాల్చేసి చంపారు. మృతుడిని 25 ఏళ్ల దీపు చంద్ర దాస్గా గుర్తించారు. ఈ ఘటన బంగ్లాలో మైనారిటీల భద్రత, ముఖ్యంగా హిందువుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఈ ఘటనపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కూడా స్పందించి, చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్ట్…
Live-in-relationship:‘‘లిన్- ఇన్ రిలేషన్’’లపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఒక భాగస్వామికి అప్పటికే పెళ్లయి, విడాకులు తీసుకోనట్లయితే, సహజీవనంలో ఉన్న వ్యక్తులు చట్టపరమైన రక్షణ కోరలేరని తీర్పు చెప్పింది. లివ్-ఇన్లో ఉంటున్న ఒక జంట రక్షణ కోరిన తర్వాత, రక్షణ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. డిసెంబర్ 16న ఈ కేసుపై న్యాయమూర్తి వివేక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సంపూర్ణం కాదని, అది అప్పటికే ఉన్న జీవిత భాగస్వామి చట్టబద్ధ హక్కులను ఉల్లంఘించకూడదని అన్నారు.
Rahul Gandhi: జర్మనీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో వివాదానికి కారణమయ్యారు. భారతదేశాన్ని అస్థిరపరచాలని భావించే జార్జ్ సోరోస్ సన్నిహితురాలు ప్రొఫఎసర్ డాక్టర్ కార్నెలియా వోల్ను కలిశారు. సోరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీలను ప్రస్తావిస్తూ బీజేపీ కాంగ్రెస్ నేతపై తీవ్ర విమర్శలు చేస్తోంది.
Bangladesh Violence: బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండంగా మారింది. అక్కడి రాడికల్ ఇస్లామిస్ట్ శక్తులు అరాచకాలకు పాల్పడ్డారు. మైమెన్సింగ్ నగరంలో గురువారం రాత్రి మత దూషణ ఆరోపణల నేపథ్యంలో ఒక మూక దాడిలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్ హత్యకు గురయ్యారు.
PM Modi: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యం, ప్రధాని నరేంద్రమోడీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం కోల్కతా విమానాశ్రయం నుంచి తన వర్చువల్ ర్యాలీ ద్వారా ప్రధాని టీఎంసీపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం సాగిస్తున్న బీహార్ లాంటి జంగిల్ రాజ్ను వదిలించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారని ప్రధాని అన్నారు. Read Also: PM Modi: టీఎంసీ అభివృద్ధిని […]
SIR: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రక్షాళన కోసం చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ తమిళనాడులో నకిలీ ఓటర్లపై పంజా విసిరింది. తమిళనాడులో సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ఈరోజు(డిసెంబర్ 19)న విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో మరణించిన వారు 6,94,672 మంది, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు 66,44,881 మంది, ఒకే వ్యక్తికి అనేక చోట్ల ఓటు ఉన్నవారు 3,39,278 మంది ఓటర్లు ఉన్నారని డేటా పేర్కొంది. Read […]