Bangladesh: బంగ్లా జాతీయ కవి పక్కనే రాడికల్ హాది అంత్యక్రియలు.. ఎందుకు ఇలా చేశారు?
- బంగ్లాదేశ్ జాతీయ కవి పక్కన ఉస్మాన్ హాది అంత్యక్రియలు..
- ఒక లౌకిక వ్యక్తి పక్కన, గుండా అంత్యక్రియలు ఎందుకు..?
- భిన్న వాదనల్ని వినిపిస్తున్న బంగ్లాదేశ్ ప్రజలు..
Bangladesh: భారత వ్యతిరేకి, ఇస్లామిస్ట్ రాడికల్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలకు కారణమైంది. శనివారం అతడి అంత్యక్రియలు ఢాకాలో జరిగాయి. దీనికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే, బంగ్లా జాతీయ కవి, విప్లవ కవిగా పేరున్న కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే హాది అంత్యక్రియలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక గొప్ప లౌకిక వ్యక్తిని, ఒక తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తికి పోలిక తీసుకురావడం ఏంటని బంగ్లాలో ఒక వర్గం ప్రశ్నిస్తోంది. 1976లో నజ్రుల ఇస్లా మరణం తర్వాత, 50 ఏళ్లకు ఆయన సమాధి పక్కనే హాదిని ఖననం చేశారు.
షేక్ హసీనాను గద్దె దింపడంలో కీలకంగా వ్యవహరించిన ‘‘ఇంక్విలాబ్ మంచా’’ అధినేత హాదిని ఈ నెల 12 ఇద్దరు వ్యక్తులు గన్లో కాల్చారు. తీవ్రగాయాలైన అతను 19న మరణించాడు. తరుచుగా, పలు వేదికల్లో హాది, నజ్రుల్ కవితల్ని వినిపించేవాడు. షేక్ హసీనా పదవీచ్యుతి సమయంలో హాదిని కొందరు ఈ కాలపు నజ్రుల్ వారసుడిగా ప్రకటించారు.
Also Read
- Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
నజ్రుల్ సమాధి పక్కనే అంత్యక్రియలు ఎందుకు.?
మహ్మద్ యూనస్ ప్రభుత్వం, జమాతే ఇస్లామీ అనుబంధ విద్యార్థి సంఘం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢాకా యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. అయితే, ఇది హాది కుటుంబం కోరి అని ఇంక్విలాబ్ మంచా చెబుతోంది. శనివారం అంత్యక్రియల సమయంలో షేక్ హసీనా, అవామీలీగ్, అవామీ లీగ్ అనుబంధ విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత వ్యతిరేక నినాదాలు వినిపించాయి. ఎలాంటి హింసాత్మక చర్యలు జరగకుండా పోలీసుల మోహరింపు జరిగింది. షాబాగ్ సర్కిల్ పేరును “షాహీద్ హాది” అని మార్చాలని ఇంకిలాబ్ మంచా డిమాండ్ చేసింది.
భిన్న వాదనలు:
నజ్రుల్ ఇస్లాం సమాధికి పక్కనే హాదిని ఖననం చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాజీ నజ్రుల్ ఇస్లాం సహనానికి, లౌకికవాదానికి ప్రతీక అని, ఉస్మాన్ హాదీ తీవ్రవాదానికి, ద్వేషానికి ప్రతీక అని, ఇలాంటి వ్యక్తిని గొప్ప వ్యక్తితో ఎలా పోలుస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజకీయ లాభం కోసమే చేశారని అవామీ లీగ్ నేతలు అంటున్నారు. ఒక గుండాను గొప్ప కాజీ నజ్రుల్ ఇస్లాం పక్కన ఖననం చేయడం సిగ్గుచేటు అని బంగ్లాదేశ్కు చెందిన కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం, హాదీ ఆధిపత్య శక్తులను ఎదురించాడని, ఇద్దరూ కూడా విప్లవ నేతలే అని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?