Bangladesh: బంగ్లా జాతీయ కవి పక్కనే రాడికల్ హాది అంత్యక్రియలు.. ఎందుకు ఇలా చేశారు?
- బంగ్లాదేశ్ జాతీయ కవి పక్కన ఉస్మాన్ హాది అంత్యక్రియలు..
- ఒక లౌకిక వ్యక్తి పక్కన, గుండా అంత్యక్రియలు ఎందుకు..?
- భిన్న వాదనల్ని వినిపిస్తున్న బంగ్లాదేశ్ ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారత వ్యతిరేకి, ఇస్లామిస్ట్ రాడికల్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలకు కారణమైంది. శనివారం అతడి అంత్యక్రియలు ఢాకాలో జరిగాయి. దీనికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే, బంగ్లా జాతీయ కవి, విప్లవ కవిగా పేరున్న కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే హాది అంత్యక్రియలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక గొప్ప లౌకిక వ్యక్తిని, ఒక తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తికి పోలిక తీసుకురావడం ఏంటని బంగ్లాలో ఒక వర్గం ప్రశ్నిస్తోంది. 1976లో నజ్రుల ఇస్లా మరణం తర్వాత, 50 ఏళ్లకు ఆయన సమాధి పక్కనే హాదిని ఖననం చేశారు.
షేక్ హసీనాను గద్దె దింపడంలో కీలకంగా వ్యవహరించిన ‘‘ఇంక్విలాబ్ మంచా’’ అధినేత హాదిని ఈ నెల 12 ఇద్దరు వ్యక్తులు గన్లో కాల్చారు. తీవ్రగాయాలైన అతను 19న మరణించాడు. తరుచుగా, పలు వేదికల్లో హాది, నజ్రుల్ కవితల్ని వినిపించేవాడు. షేక్ హసీనా పదవీచ్యుతి సమయంలో హాదిని కొందరు ఈ కాలపు నజ్రుల్ వారసుడిగా ప్రకటించారు.
Also Read
- Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
- Trump-Pakistan: ట్రంప్తో పాకిస్థాన్కు కొత్త సంకటం.. సౌదీకి షరీఫ్, మునీర్!
- పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
- Khawaja Asif: ‘‘మా పూర్వీకులు హిందువులే’’.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..
నజ్రుల్ సమాధి పక్కనే అంత్యక్రియలు ఎందుకు.?
మహ్మద్ యూనస్ ప్రభుత్వం, జమాతే ఇస్లామీ అనుబంధ విద్యార్థి సంఘం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢాకా యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. అయితే, ఇది హాది కుటుంబం కోరి అని ఇంక్విలాబ్ మంచా చెబుతోంది. శనివారం అంత్యక్రియల సమయంలో షేక్ హసీనా, అవామీలీగ్, అవామీ లీగ్ అనుబంధ విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత వ్యతిరేక నినాదాలు వినిపించాయి. ఎలాంటి హింసాత్మక చర్యలు జరగకుండా పోలీసుల మోహరింపు జరిగింది. షాబాగ్ సర్కిల్ పేరును “షాహీద్ హాది” అని మార్చాలని ఇంకిలాబ్ మంచా డిమాండ్ చేసింది.
భిన్న వాదనలు:
నజ్రుల్ ఇస్లాం సమాధికి పక్కనే హాదిని ఖననం చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాజీ నజ్రుల్ ఇస్లాం సహనానికి, లౌకికవాదానికి ప్రతీక అని, ఉస్మాన్ హాదీ తీవ్రవాదానికి, ద్వేషానికి ప్రతీక అని, ఇలాంటి వ్యక్తిని గొప్ప వ్యక్తితో ఎలా పోలుస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజకీయ లాభం కోసమే చేశారని అవామీ లీగ్ నేతలు అంటున్నారు. ఒక గుండాను గొప్ప కాజీ నజ్రుల్ ఇస్లాం పక్కన ఖననం చేయడం సిగ్గుచేటు అని బంగ్లాదేశ్కు చెందిన కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం, హాదీ ఆధిపత్య శక్తులను ఎదురించాడని, ఇద్దరూ కూడా విప్లవ నేతలే అని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Moinuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
-
Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
-
DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
-
Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
-
Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!