Bangladesh crisis: 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత, ఇప్పుడు భారతదేశానికి వ్యూహాత్మక సవాల్గా మారుతోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ప్యానెల్ బంగ్లాదేశ్లో రాజకీయ మార్పులు, చైనా, పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ప్రభావం,
Omar Abdullah: బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక కార్యక్రమంలో ముస్లిం మహిళ హిజాబ్ తీసేయాలని చెబుతూ, లాగడం వివాదస్పదమైంది. ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలు ఇస్తున్న కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు, నితీష్ కుమార్కు బీజేపీలో కొంత మంది నేతలు మద్దతు ఇస్తున్నారు. బీజేపీ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మహిళ నియామక పత్రాన్ని అంగీకరించవచ్చు లేదంటే నరకానికి పోవచ్చు అని వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదమైంది.
Trinamool MLA: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా ‘శ్రీరాముడు’ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘శ్రీరాముడు హిందువు కాదు, ముస్లిం’’ అని ఆయన చేసిన కామెంట్స్పై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. బీజేపీ నేత ప్రదీప్ భండారి ఎక్స్లో ఈ వ్యాఖ్యలకు చెందిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు.
Mamata Banerjee: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్తగా ‘‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవక మిషన్ గ్రామీణ్(VB-G RAM G)’’ చట్టం, 2025ను తీసుకురావడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ పేరును ఉద్దేశపూర్వకంగా బీజేపీ తొలగిస్తోందని, గాంధీ అంటే బీజేపీకి పడదని ఆరోపిస్తున్నాయి.
Tata Motors: టాటా ఇయర్ ఎండ్ తన సేల్స్ పెంచుకునేందుకు డిసెంబర్ నెలలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లను ICE (పెట్రోల్–డీజిల్), EV (ఎలక్ట్రిక్) మోడళ్లన్నిటికీ వర్తిస్తున్నట్లు చెప్పింది. ఈ స్కీమ్ డిసెంబర్ 31,2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. కస్టమర్లు ఎంపిక చేసిన టాటా కార్లను నెలకు రూ. 4999 నుంచి ప్రారంభమయ్యే నెలవారీ EMIతో ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఎంట్రీ లెవల్ టియాగో నెలకు రూ. 4999 నుంచి EMIతో అందుబాటులో ఉంది. టిగోర్, […]
Saudi Arabia: వీసా ఆంక్షలు, నో-ఫ్లై జాబితాలు, విదేశాల బహిష్కరణలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లు మాత్రం యథేచ్చగా విదేశాల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, అజన్ బైజాన్ దేశాల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద తమ ఆందోళనల్ని వ్యక్తపరుస్తోంది.
Javed Akhtar: బీహార్లో ఒక కార్యక్రమంలో ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలను అందిస్తూ, సీఎం నితీష్ కుమార్ ఒక ముస్లిం యువతి ‘‘హిజాబ్’’ను లాగడం వివాదాస్పదం అయింది. దీనిపై రాజకీయ రచ్చ మొదలైంది. ప్రముఖ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ కూడా ఈ వివాదంపై సీఎం నితీష్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి ఒమన్ తన దేశ అత్యున్నత గౌరవాన్ని ప్రధానం చేసింది. భారత్-ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోడీ చేసిన కృషికి గానూ గురువారం ఒమన్ సుల్తానేట్ ప్రత్యేకమైన పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ను సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రదానం చేశారు. జోర్డాన్, ఇథియోపియాతో సహా మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరి దేశం ఒమన్లో ప్రధాని మోడీ రెండు రోజులు పర్యటిస్తున్నారు. Read Also: […]
Dhurandhar: బాలీవుడ్ మూవీ ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధిస్తోంది. ఇన్నాళ్లు బాలీవుడ్లో ఉన్న ప్రో-పాకిస్తాన్ నారెటివ్ను పటాపంచలు చేసిందని పలువురు క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ అసలు రూపాన్ని ఈ సినిమా చూపించిందని చెబుతున్నారు.
Crime: ఒక వ్యక్తి ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడం దారుణమైన హత్యలకు దారి తీసింది. డబ్బు, భూ వివాదాలతో పాటు మతాంతర వివాహం వల్ల ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పూర్లో ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల్ని క్రూరంగా హత్య చేశాడు. హత్య తర్వాత ఐదు రోజుల గాలింపు చేపట్టాక వృద్ధ దంపతుల శవాలు గురువారం దొరికాయి. సొంత కొడుకే వారిని హత్య చేసి, వారి శరీరాలను రంపంతో మూడు ముక్కలుగా కోసి, సిమెంట్ బ్యాగులో పెట్టి, స్థానికంగా ఉన్న నదిలో పారేశాడు.