Venu Goapl Reddy
Author- NTV Telugu-
Iran War: ఇరాన్ యుద్ధం.. భారత బాస్మతి వ్యాపారంపై దెబ్బ..
Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు భారత వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. భారత్ నుంచి ఎక్కువగా సరకులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం, ఇరాన్ ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో సముద్ర రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో అటాక్ చేస్తోంది. గగనతలంపై కూడా నిషేధం విధించబడింది. ఈ పరిణామాల గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి ఎగుమతి కావాల్సి వస్తువులు పేరుకుపోతున్నాయి. -
Pakistan: “ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్”.. ఇరాన్ యుద్ధంపై పాక్ నాయకుల భయం..
Pakistan: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్లో కంగారు పెట్టిస్తోంది. తోటి ముస్లిం దేశమైన ఇరాన్ కు మద్దతు ఇవ్వాలో లేదో తేల్చుకోని పరిస్థితుల్లో ఆ దేశ నాయకత్వం ఉంది. మరోవైపు, ఇరాన్పై దాడుల్ని పాకిస్తాన్ ప్రజలు ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ పార్లమెంట్లో గొడవకు కారణమైందని అక్కడి రాజకీయ నాయకులు చెప్పారు. -
Iran Israel War: యుద్ధంలోకి రష్యా ఎంట్రీ.. అమెరికా సంచలన ఆరోపణ..
Iran Israel War: ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్పై భారీ దాడులు చేస్తున్నాయి. గత శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్పై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలో ఉన్న అమెరికన్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలోని చమురు సౌకర్యాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. Read Also: T20 World Cup […] -
LPG Production: LPG ఉత్పత్తిని పెంచండి.. ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు..!
LPG Production: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన రంగ సంక్షోభానికి కారణం కాబోతోంది. ఇప్పటికే ఇరాన్ చమురు రవాణాకు కీలకమైన ‘‘ హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. పెట్రోల్, LPG వంటి పెట్రోలియం నిల్వలు ప్రస్తుతం దేశంలో సరిపడా ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
Israel Iran War: యుద్ధం ఇలాగే కొనసాగితే వినాశనం తప్పదు.. గల్ఫ్ దేశం వార్నింగ్..
Israel Iran War: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. కువైట్, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ ఘర్షణ ప్రారంభమై వారం గడుస్తోంది. ప్రతీ రోజూ కూడా అమాయకులు చనిపోతున్నారు. మరోవైపు హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో చమురు సంక్షోభం […] -
Sukhoi Crash: సుఖోయ్ విషాదం.. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న పైలట్ మృతి..
Sukhoi Crash: గురువారం అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్లో భారత వైమానిక దళం సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మరణించారు. మరణించిన వారిలో ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ ఉన్నారు. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’లో దురాగ్కర్ పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటనలో భారత వైమానికదళం అత్యుత్తమ పైలట్ను కోల్పోయింది. -
UPSC CSE 2025 Final Result: UPSC ఫలితాలు విడుదల.. అనుజ్ అగ్రిహోత్రికి ఫస్ట్ ర్యాంక్..
UPSC CSE 2025 Final Result: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 ఈ రోజు( శుక్రవారం) విడుదలయ్యాయి. అనుజ్ అగ్నిహోత్రి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మొత్తం 958 మంది అభ్యర్థులు IAS, IFS, IPS మరియు ఇతర పోస్టులకు అర్హత సాధించారు. -
Gravity Bomb: ఇరాన్కు యూఎస్ ‘‘గ్రావిటీ బాంబ్’’ వార్నింగ్.. అసలేంటీ ఈ బాంబు, ఎలా పనిచేస్తుంది.?
Gravity Bomb: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా ‘‘గ్రావిటీ బాంబు’’ ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. ఇటీవల యూఎస్ రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్ మాట్లాడుతూ.. "అమెరికా సైనిక చర్య ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయి. ఈ మిషన్ కోసం అమెరికా తన అపరిమిత నిల్వ అయిన ప్రెసిషన్ గ్రావిటీ బాంబులను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది" అని అన్నారు. -
Iran: భారత్ ఆహ్వానం మేరకు వెళ్లిన నౌకను పేల్చేస్తారా.. యూఎస్పై ఇరాన్ ఫైర్..
Iran: శ్రీలంక దక్షిణ సముద్ర తీరంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాను అమెరికా జలాంతర్గామి(సబ్మెరైన్) పేల్చేసింది. అయితే, ఈ ఘటనపై ఇరాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చి ఖండించారు. ఈ సంఘటన ‘‘సముద్రంలో జరిగిన దారుణం’’గా ఆయన అభివర్ణించారు. -
Iran War: ఇరాన్ దాడులకు యూఎస్ భారత్ను ఉపయోగించుకుందా..? వాస్తవం ఇదే..
Iran War: ఇరాన్పై దాడి చేయడానికి భారత్ ఓడరేవుల్ని అమెరికా వాడుకుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది, ఇలాంటి ఊహాగానాలను భారత్ తిరస్కరించింది. అమెరికాకు చెందిన వన్ అమెరికా న్యూస్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ యుఎస్ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్గ్రెగర్, ఇరాన్పై తన యుద్ధంలో అమెరికా భారత నావికా స్థావరాలను ఉపయోగించుకుంటోందని అన్నారు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!