PM Modi: కెనడాకు వెళ్తూ, సైప్రస్లో ఆగనున్న మోడీ.. టర్కీకి బిగ్ మెసేజ్..
- జీ-7 కోసం కెనడాకు వెళ్లనున్న మోడీ..
- మార్గం మధ్యలో సైప్రస్లో ఆగే అవకాశం..
- టర్కీకి బిగ్ మెసేజ్ పంపిస్తున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 15-17 వరకు కెనడాలోని అల్బెర్టాలో జరగబోయే గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెళ్లనున్నారు. ఇటీవల, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసిన జీ-7 సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు, దీనికి మోడీ ఒప్పుకున్నారు. అయితే, కెనడాకు వెళ్తూ, మార్గం మధ్యలో సైప్రస్లో ప్రధాని మోడీ ఆగనున్నట్లు తెలుస్తోంది.
మధ్యదరా ప్రాంతంలోని దేశాలకు భారత్ చాలా ప్రాముఖ్యత ఇస్తోంది. సైప్రస్, గ్రీస్ వంటి దేశాలతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, ఈ ప్రాంతంలో టర్కీతో సైప్రస్, గ్రీస్ దేశాలకు వైరం ఉంది. ఇదే సమయంలో టర్కీ మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి సహకరిస్తోంది. దీంతో, భారత్ శత్రువుకు శత్రువు మిత్రుడు అనే ధోరణిని అవలంబిస్తోంది.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
Read Also: National Security Advisory Council: “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి..
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ సైప్రస్లో కొద్ది సమయం ఆగవచ్చనే సమాచారం ప్రాముఖ్యతను సంతరించుకుంది. సైప్రస్లో ఇంధనం నింపుకునేందుకు ఉపయోగిస్తారని తెలుస్తోంది. ప్రధాని మోడీ తన స్వల్పకాలిక పర్యటనలో ఆ దేశ అగ్రనాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు చెప్పా్యి. ఈ ప్రాంతంలో టర్కీ దుందుడుకు వైఖరి, విస్తరణవాదంపై సైప్రస్, గ్రీస్ దేశాలు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ని విమర్శిస్తున్నాయి.
గ్రీస్ ప్రాదేశిక జలాల్లో చమురు, గ్యాస్ అన్వేషణ ప్రణాళికలు, సైప్రస్ మారిటైమ్ ఎకనామిక్ జోన్లలో డ్రిల్లింగ్ నిర్వహించడంపై టర్కీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, సైప్రస్, గ్రీస్తో తన బంధాన్ని బలోపేతం చేసుకుంటోంది. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో సైప్రస్తో సంబంధాలు బలపడ్డాయి. పలు సందర్భాల్లో టర్కీకి వ్యతిరేకంగా సైప్రస్కి భారత్ మద్దతు తెలిపింది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!