Venu Goapl Reddy
Author- NTV Telugu-
Earthquake: తైవాన్ తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన జపాన్
Earthquake Hits Taiwan: తైవాన్ తీరం ఉలిక్కిపడింది. ఆదివారం తైవాన్ ఆగ్నేయ తీరంలో భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. టైటుంగ్ నగరానికి ఉత్తరాన 50 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం కేంద్రీకృతం అయిందని తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 7.2 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. అయితే దీన్ని ఆ తరువాత 6.9 మాగ్నిట్యూడ్ కు తగ్గించింది. భారీ భూకంపం సంభవించడంతో జపాన్ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. తైవాన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ… -
Gujarat: రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు
Govt Employees, School Teachers, Go On ‘Mass Casual Leave’ in Gujarat: గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాస్ లీవుల్లో విధులను బహిష్కరించారు. తమ డిమాండ్లను అంగీకరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ.. శనివారం వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాద్యాయులు సామూహికంగా సెలవులు తీసుకుని.. విధులకు గైర్హాజరు అయ్యారు. పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తగా వేలాది మంది ఉద్యోగులు, పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం ‘మాస్ క్యాజువల్ లీవ్’ నిరసనల్లో పాల్గొన్నారు. -
Mumbai: స్కూల్ లిఫ్టులో ఇరుక్కొని మహిళా టీచర్ మృతి
teacher killed after getting stuck in school lift in mumbai: ముంబైలోని ఓ స్కూల్ లిఫ్టులో ఇరుకుని 26 ఏళ్ల టీచర్ మరణించింది. ఉత్తర్ ముంబైలోని శివారు ప్రాంతం మలాడ్ లోని చించోలి బందర్ లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ స్కూల్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. లిఫ్టులో ఇరుక్కున జెనెల్ ఫెర్నాండెస్ అనే మహిళా టీచర్ మరణించింది. ఈ ఏడాది జూన్ లోనే అసిస్టెంట్ టీచర్ గా జెనెల్ స్కూల్లో చేరారు. -
Jharkhand: ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు..
Bus Falls Off Bridge In Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హజారీబాగ్ జిల్లాలో శనివారం ఓ బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
Lakhimpur Kheri: లఖీంపూర్ మరణాలు కంటిన్యూ.. మరో బాలికపై దాడి.. మృతి
Lakhimpur Kheri girl dies of assault: ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల లఖీంపూర్ ఖేరీ జిల్లాలో ఇద్దరు దళిత బాలికపై అత్యాచారం చేసి, చెట్టుకు ఉరేసి చంపారు. ఈ ఘటన మరవకు ముందే మరో బాలికపై దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. బాలిక చికిత్స పొందుతూ మరణించింది. నిందితులిద్దరూ కూడా బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. -
Jharkhand: లోన్ రికవరీ ఏజెంట్ల దారుణం.. గర్భిణిపైకి ట్రాక్టర్ ఎక్కించి హత్య
Pregnant woman dies after being mowed down by finance recovery agents in jharkhand: జార్ఖండ్ హజారీ బాగ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రుణ వాయిదా చెల్లించలేదని ట్రాక్టర్ తీసుకువెళ్లేందుకు లోక్ రికవరీ ఏజెంట్లు వచ్చిన క్రమంలో గర్భిణిపై ట్రాక్టర్ ఎక్కించారు. దీంతో మూడు నెలల గర్భిణి మరణించింది. జిల్లాలోని ఇచక్ ప్రాంతానికి చెందిన మిథిలేష్ రైతు స్థానికంగా ఉన్న ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే నెలనెల కట్టాల్సిన వాయిదాలను కొన్ని కారణాల వల్ల… -
Russia-Ukraine War: మెడకు తాళ్లు కట్టి.. కాళ్లు విరగొట్టి దారుణంగా హత్యలు.. రష్యా సైనికుల దురాగతం
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగ బయటపడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు నిష్క్రమించాయి. ఈ ప్రాంతాన్ని మళ్లీ ఉక్రెయిన్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తిరిగి ఆధీనంలోకి తీసుకున్న ప్రాంతాల్లో రష్యా బలగాలు చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇజియమ్ ప్రాంతంలో 400లకు పైగా మృతదేహాలను ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు. దీంట్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. -
Visa-Free Travel To Russia: భారతీయులకు శుభవార్త.. రష్యాకు వీసా ఫ్రీ ట్రావెల్
Visa-Free Travel To Russia: రష్యాను సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇకపై రష్యా సందర్శించాలనుకుంటే వీసా రహితంగా సందర్శించే అవకాశం ఏర్పడింది. శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య ఇరు దేశాల మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ ప్రయాణ ఒప్పందం చర్చలోకి వచ్చింది. ఈ ఒప్పందంపై త్వరలోనే నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
Santosh Yadav: ఆర్ఎస్ఎస్ దసరా వేడుకలకు తొలిసారిగా ఓ మహిళా అతిథి.. ఆమె ఎవరో తెలుసా..?
santosh yadav - The First Woman Chief Guest At RSS Dussehra Event: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) తొలిసారిగా దసరా కార్యక్రమానికి ఓ మహిళను అతిథిగా ఆహ్వానించింది. గత 97 ఏళ్లలో ఓ మహిళను ముఖ్య అతిథిగా ఆహ్మానించడం ఇదే తొలసారి. నాగ్పూర్లో జరిగే వార్షిక దసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రముఖ పర్వతారోహరాలు సంతోష్ యాదవ్ ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథి అని ఆర్ఎస్ఎస్ జాయింట్ పబ్లిసిటీ చీఫ్ నరేందర్ ఠాకూర్… -
Tejashwi Yadav: తేజస్వీ యాదవ్కు జైలు తప్పదా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్
CBI petition to cancel Tejaswi Yadav's bail: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ ఝలక్ ఇచ్చింది. గతంలో రైల్వేలో ఉద్యోగాలకు అక్రమంగా కొందరు అభ్యర్థల నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ స్కామ్ భాగంగా సీబీఐ విచారిస్తున్న సమయంలో అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను బెదిరించిన కేసులో తేజస్వీ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!