Santosh Yadav: ఆర్ఎస్ఎస్ దసరా వేడుకలకు తొలిసారిగా ఓ మహిళా అతిథి.. ఆమె ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
santosh yadav – The First Woman Chief Guest At RSS Dussehra Event: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) తొలిసారిగా దసరా కార్యక్రమానికి ఓ మహిళను అతిథిగా ఆహ్వానించింది. గత 97 ఏళ్లలో ఓ మహిళను ముఖ్య అతిథిగా ఆహ్మానించడం ఇదే తొలసారి. నాగ్పూర్లో జరిగే వార్షిక దసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రముఖ పర్వతారోహరాలు సంతోష్ యాదవ్ ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథి అని ఆర్ఎస్ఎస్ జాయింట్ పబ్లిసిటీ చీఫ్ నరేందర్ ఠాకూర్ తెలిపారు. అక్టోబర్ 5న నాగ్పూర్లోని రేష్మీబాగ్ మైదాన్లో దసరా కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ ఘనంగా నిర్వహించబోతోంది.
Read Also: Doctor Rice For Sugar Patients: షుగర్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. డాక్టర్ రైస్
Also Read
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
- Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
అసలెవరీ సంతోష్ యాదవ్..?
హర్యనా రేవారీ జిల్లా జోనియావాస్ గ్రామాని చెందిన సంతోష్ యాదవ్ (54) ప్రపంచంలో ఎతైన ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన మహిళగా గుర్తింపు పొందారు. 1992,1993లో రెండు సార్లు ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. తొలిసారి అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ ను అధిరోహించిన మహిళగా గుర్తింపు పొందారు. తూర్పున చైనా ముఖంగా ఉన్న కాంగ్షుంగ్ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ కూడా సంతోష్ యాదవే. 14వ ఏటనే పెళ్లి చేయాలని భావించిన తరువాత రాజస్థాన్ జైపూర్ హస్టల్ లో ఉంటూ.. చదువును కొనసాగించింది. ఆ సమయంలో ఆరావళి పర్వతాన్ని చూసేది.. ఇదే ఆమెను పర్వతారోహకురాలని చేసింది.
1992లో కేవలం 20 ఏళ్లలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు సంతోష్ యాదవ్. అత్యంత కష్టతరమైన కాంగ్షుంగ్ పాస్ నుంచి పర్వతాన్ని అధిరోహించారు. ఆ తరువాత 1993లో ఇండో-నేపాల్ జట్టుతో మరోసారి ఎవరెస్టును ఎక్కారు. 1994లో నేషనల్ అడ్వెంచర్ అవార్డును అందుకున్నారు. 2000లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. హర్యానా ప్రభుత్వం 2006లో గురుగ్రామ్ లోని ఓ రోడ్డుకు ఆమె పేరును పెట్టింది.
ప్రతీ ఏడాది ఆర్ఎస్ఎస్ నాగ్ పూర్ కేంద్ర కార్యాలయంలో దసరా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. ప్రతీ ఏడాది వివిధ రంగాల్లో కృషి చేసిన పలువురిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంటారు. ఈ ఏడాది సంతోష్ యాదవ్ ని ఆహ్మానించారు. గతంలో నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది ఆర్ఎస్ఎస్.
राष्ट्रीय स्वयंसेवक संघ का वार्षिक विजयादशमी उत्सव 5 अक्तूबर, 2022 को नागपुर में सम्पन्न होगा। इस उत्सव में प्रमुख अतिथि सुप्रसिद्ध पर्वतारोही पद्मश्री श्रीमती संतोष यादव जी होंगी और परमपूजनीय सरसंघचालक डॉ. मोहनजी भागवत का उद्बोधन होगा। pic.twitter.com/H720QwuYBn
— RSS (@RSSorg) September 15, 2022
తాజావార్తలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!