Santosh Yadav: ఆర్ఎస్ఎస్ దసరా వేడుకలకు తొలిసారిగా ఓ మహిళా అతిథి.. ఆమె ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
santosh yadav – The First Woman Chief Guest At RSS Dussehra Event: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) తొలిసారిగా దసరా కార్యక్రమానికి ఓ మహిళను అతిథిగా ఆహ్వానించింది. గత 97 ఏళ్లలో ఓ మహిళను ముఖ్య అతిథిగా ఆహ్మానించడం ఇదే తొలసారి. నాగ్పూర్లో జరిగే వార్షిక దసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రముఖ పర్వతారోహరాలు సంతోష్ యాదవ్ ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథి అని ఆర్ఎస్ఎస్ జాయింట్ పబ్లిసిటీ చీఫ్ నరేందర్ ఠాకూర్ తెలిపారు. అక్టోబర్ 5న నాగ్పూర్లోని రేష్మీబాగ్ మైదాన్లో దసరా కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ ఘనంగా నిర్వహించబోతోంది.
Read Also: Doctor Rice For Sugar Patients: షుగర్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. డాక్టర్ రైస్
Also Read
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
అసలెవరీ సంతోష్ యాదవ్..?
హర్యనా రేవారీ జిల్లా జోనియావాస్ గ్రామాని చెందిన సంతోష్ యాదవ్ (54) ప్రపంచంలో ఎతైన ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన మహిళగా గుర్తింపు పొందారు. 1992,1993లో రెండు సార్లు ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. తొలిసారి అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ ను అధిరోహించిన మహిళగా గుర్తింపు పొందారు. తూర్పున చైనా ముఖంగా ఉన్న కాంగ్షుంగ్ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ కూడా సంతోష్ యాదవే. 14వ ఏటనే పెళ్లి చేయాలని భావించిన తరువాత రాజస్థాన్ జైపూర్ హస్టల్ లో ఉంటూ.. చదువును కొనసాగించింది. ఆ సమయంలో ఆరావళి పర్వతాన్ని చూసేది.. ఇదే ఆమెను పర్వతారోహకురాలని చేసింది.
1992లో కేవలం 20 ఏళ్లలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు సంతోష్ యాదవ్. అత్యంత కష్టతరమైన కాంగ్షుంగ్ పాస్ నుంచి పర్వతాన్ని అధిరోహించారు. ఆ తరువాత 1993లో ఇండో-నేపాల్ జట్టుతో మరోసారి ఎవరెస్టును ఎక్కారు. 1994లో నేషనల్ అడ్వెంచర్ అవార్డును అందుకున్నారు. 2000లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. హర్యానా ప్రభుత్వం 2006లో గురుగ్రామ్ లోని ఓ రోడ్డుకు ఆమె పేరును పెట్టింది.
ప్రతీ ఏడాది ఆర్ఎస్ఎస్ నాగ్ పూర్ కేంద్ర కార్యాలయంలో దసరా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. ప్రతీ ఏడాది వివిధ రంగాల్లో కృషి చేసిన పలువురిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంటారు. ఈ ఏడాది సంతోష్ యాదవ్ ని ఆహ్మానించారు. గతంలో నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది ఆర్ఎస్ఎస్.
राष्ट्रीय स्वयंसेवक संघ का वार्षिक विजयादशमी उत्सव 5 अक्तूबर, 2022 को नागपुर में सम्पन्न होगा। इस उत्सव में प्रमुख अतिथि सुप्रसिद्ध पर्वतारोही पद्मश्री श्रीमती संतोष यादव जी होंगी और परमपूजनीय सरसंघचालक डॉ. मोहनजी भागवत का उद्बोधन होगा। pic.twitter.com/H720QwuYBn
— RSS (@RSSorg) September 15, 2022
తాజావార్తలు
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!