Jharkhand: ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Falls Off Bridge In Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హజారీబాగ్ జిల్లాలో శనివారం ఓ బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గిరిదిహ్ జిల్లా నుంచి రాజధాని రాంచీకి వెళ్తున్న బస్సు హజారీబాగ్ జిల్లా తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో సివాన్నే నదిపై వంతెన నుంచి నదిలో పడిపోయింది. వంతెన రెయిలింగ్ విరిగిపోయిన ప్రదేశంలో ప్రమాదం జరిగినట్లు ఎస్పీ మనోజ్ రతన్ చోతే తెలిపారు. ప్రయాణ సమయంలో మొత్తం బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మరికొంత మంది బస్సులో చిక్కుకుని ఉండటంతో సహాయచర్యలను కొనసాగిస్తున్నారు అధికారులు.
Also Read
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
Read Also: Cows Theft: అక్కడ ఆవుల్నీ వదల్లేదు కేటుగాళ్లు
ఇద్దరు ప్రయాణికులు ప్రమాద సమయంలోనే మరణించగా.. మరో నలుగురు హజారీ బాగ్ లోని సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరికొంత మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సు నది మధ్యలో పడి ఉంటే మరింత నష్టం జరిగేదని అధికారులు వెల్లడించారు. గ్యాస్ కట్టర్ సాయంతో బస్సు బాడీని కట్ చేసి ప్రయాణికులను రక్షించారు అధికారులు.
ఈ వారం పలు రాష్ట్రాల్లో వరసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ఒడిశాలోని ఝార్సుగూడ ప్రాంతంలో జె ఎస్ డబ్ల్యూ కంపెనీ నుంచి విధులు ముగించుకుని వస్తున్న క్రమంలో ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సును, బొగ్గుతో వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. గురువారం జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. బుధవారం కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో ఇలాగే ఓ మినీ బస్సు లోయలో పడిన ఘటనలో 11 మంది మరణించారు.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
-
Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!