Jharkhand: ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Falls Off Bridge In Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హజారీబాగ్ జిల్లాలో శనివారం ఓ బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గిరిదిహ్ జిల్లా నుంచి రాజధాని రాంచీకి వెళ్తున్న బస్సు హజారీబాగ్ జిల్లా తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో సివాన్నే నదిపై వంతెన నుంచి నదిలో పడిపోయింది. వంతెన రెయిలింగ్ విరిగిపోయిన ప్రదేశంలో ప్రమాదం జరిగినట్లు ఎస్పీ మనోజ్ రతన్ చోతే తెలిపారు. ప్రయాణ సమయంలో మొత్తం బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మరికొంత మంది బస్సులో చిక్కుకుని ఉండటంతో సహాయచర్యలను కొనసాగిస్తున్నారు అధికారులు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Cows Theft: అక్కడ ఆవుల్నీ వదల్లేదు కేటుగాళ్లు
ఇద్దరు ప్రయాణికులు ప్రమాద సమయంలోనే మరణించగా.. మరో నలుగురు హజారీ బాగ్ లోని సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరికొంత మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సు నది మధ్యలో పడి ఉంటే మరింత నష్టం జరిగేదని అధికారులు వెల్లడించారు. గ్యాస్ కట్టర్ సాయంతో బస్సు బాడీని కట్ చేసి ప్రయాణికులను రక్షించారు అధికారులు.
ఈ వారం పలు రాష్ట్రాల్లో వరసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ఒడిశాలోని ఝార్సుగూడ ప్రాంతంలో జె ఎస్ డబ్ల్యూ కంపెనీ నుంచి విధులు ముగించుకుని వస్తున్న క్రమంలో ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సును, బొగ్గుతో వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. గురువారం జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. బుధవారం కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో ఇలాగే ఓ మినీ బస్సు లోయలో పడిన ఘటనలో 11 మంది మరణించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!