Lakhimpur Kheri: లఖీంపూర్ మరణాలు కంటిన్యూ.. మరో బాలికపై దాడి.. మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakhimpur Kheri girl dies of assault: ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల లఖీంపూర్ ఖేరీ జిల్లాలో ఇద్దరు దళిత బాలికపై అత్యాచారం చేసి, చెట్టుకు ఉరేసి చంపారు. ఈ ఘటన మరవకు ముందే మరో బాలికపై దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. బాలిక చికిత్స పొందుతూ మరణించింది. నిందితులిద్దరూ కూడా బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని భీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడ్డారు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చికిత్స పొందుతూ..భీజూ సీహెచ్సీలో చికిత్స పొందుతూ బాధితురాలు మరణించింది. అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులను సలీముద్దీన్, ఆసిఫ్ గా గుర్తించారు. నిందితులు, బాధిత బాలిక అదే గ్రామానికి చెందిన వారు. బాలిక తన గ్రామం మూసేపూర్: లో తన ఇంటి వద్ద కూర్చుని ఉన్నప్పుడు.. వీరిద్దరు ఆమెపై దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలైన బాలికకు చికిత్స తీసుకుంటున్న క్రమంలో చనిపోయింది.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
Read Also: Jharkhand: లోన్ రికవరీ ఏజెంట్ల దారుణం.. గర్భిణిపైకి ట్రాక్టర్ ఎక్కించి హత్య
నిందితులపై ఐపీసీ 323, 504,506,304 ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు. బాధిత కుటుంబ సభ్యులు ఔట్ పోస్ట్ ఇంఛార్జ్ సునీల్ నిర్లక్ష్యం కారణంగానే తన బిడ్డ చనిపోయిందని కుటుంబీకులు ఆరోపణలు చేశారు. దీంతో ఆయన్ను ఎస్పీ సంజీవ్ సుమన్ విధుల నుంచి సస్పెండ్ చేశారు. బాధితురాలి కుటుంబం నిందితులపై అత్యాచారం ఆరోపణలు చేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
ఇటీవల లఖీంపూర్ జిల్లాలో ఇద్దరు దళిత బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, అత్యాచారం చేసి, చెట్టుకు ఉరేసి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు పారిపోవడానికి ప్రయత్నించడంతో తుపాకీతో కాలి కింద కాల్చి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సెప్టెంబర్ 14న జరిగింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మరో బాలిక ఘటన వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!