Gujarat: రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt Employees, School Teachers, Go On ‘Mass Casual Leave’ in Gujarat: గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాస్ లీవుల్లో విధులను బహిష్కరించారు. తమ డిమాండ్లను అంగీకరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ.. శనివారం వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాద్యాయులు సామూహికంగా సెలవులు తీసుకుని.. విధులకు గైర్హాజరు అయ్యారు. పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తగా వేలాది మంది ఉద్యోగులు, పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం ‘మాస్ క్యాజువల్ లీవ్’ నిరసనల్లో పాల్గొన్నారు.
అయితే అనేక సంఘాలు శుక్రవారం ప్రభుత్వం చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో ఉద్యోగుల అన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో శుక్రవారం ఆందోళనలను విరమించుకున్నాయి. అయితే ఓపీఎస్ తమ ప్రధాన డిమాండ్ అని.. దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య రాష్ట్రంలోని ప్రతీ ఉద్యోగిని ప్రభావితం చేస్తుందని.. అందుకే శనివారం అంతా సామూహిక క్యాజువల్ లీవ్ తీసుకుని ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నట్లు సౌరాష్ట్ర ప్రాంత రాష్ట్రీయ సంయుక్త మోర్చా కన్వీనర్ మహేష్ మోరి అన్నారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
Read Also: Thank God: బాలీవుడ్ సినిమాకి షాక్.. బ్యాన్ విధించిన ప్రభుత్వం
ఒక్క భావ్ నగర్ జిల్లాలోనే 7 వేల మంది, కఛ్ జిల్లాలో 8వేల మంది ప్రభుత్వ ఉపాద్యాయులు శనివారం సెలవులో ఉన్నారు. ఓపీఎస్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్ లోని పాత సచివాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీ తీశారు. 2005 కన్నా ముందు సర్వీసులో చేరిన వారికి మాత్రమే ఓపీఎస్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. అయితే చాలా మంది ఉద్యోగులు 2005 తరువాత సర్వీసుల్లో చేరారని ఉద్యోగసంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే ప్రభుత్వానికి తేలిసే విధంగా నిరసనలు తెలుపుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. శుక్రవారం బీజేపీ ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రులతో సమావేశం అయ్యారు పలు సంఘాల నేతలు.. ఓపీఎస్ మినహా ప్రభుత్వం అన్ని డిమాండ్లకు అంగీకరించిందని.. సంఘాల నేతలు చెప్పారు. ప్రభుత్వం చాలా డిమాండ్లను అంగీకరించడంతో ఉద్యమాన్ని విరమించాలని ఉద్యోగసంఘాల నేతలు కోరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?