Gujarat: రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govt Employees, School Teachers, Go On ‘Mass Casual Leave’ in Gujarat: గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాస్ లీవుల్లో విధులను బహిష్కరించారు. తమ డిమాండ్లను అంగీకరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ.. శనివారం వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాద్యాయులు సామూహికంగా సెలవులు తీసుకుని.. విధులకు గైర్హాజరు అయ్యారు. పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తగా వేలాది మంది ఉద్యోగులు, పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం ‘మాస్ క్యాజువల్ లీవ్’ నిరసనల్లో పాల్గొన్నారు.
అయితే అనేక సంఘాలు శుక్రవారం ప్రభుత్వం చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో ఉద్యోగుల అన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో శుక్రవారం ఆందోళనలను విరమించుకున్నాయి. అయితే ఓపీఎస్ తమ ప్రధాన డిమాండ్ అని.. దీన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య రాష్ట్రంలోని ప్రతీ ఉద్యోగిని ప్రభావితం చేస్తుందని.. అందుకే శనివారం అంతా సామూహిక క్యాజువల్ లీవ్ తీసుకుని ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నట్లు సౌరాష్ట్ర ప్రాంత రాష్ట్రీయ సంయుక్త మోర్చా కన్వీనర్ మహేష్ మోరి అన్నారు.
Also Read
- Supreme Court: నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
- Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్... లక్ష్మణ్కే ఓటు..
Read Also: Thank God: బాలీవుడ్ సినిమాకి షాక్.. బ్యాన్ విధించిన ప్రభుత్వం
ఒక్క భావ్ నగర్ జిల్లాలోనే 7 వేల మంది, కఛ్ జిల్లాలో 8వేల మంది ప్రభుత్వ ఉపాద్యాయులు శనివారం సెలవులో ఉన్నారు. ఓపీఎస్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్ లోని పాత సచివాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీ తీశారు. 2005 కన్నా ముందు సర్వీసులో చేరిన వారికి మాత్రమే ఓపీఎస్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. అయితే చాలా మంది ఉద్యోగులు 2005 తరువాత సర్వీసుల్లో చేరారని ఉద్యోగసంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే ప్రభుత్వానికి తేలిసే విధంగా నిరసనలు తెలుపుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. శుక్రవారం బీజేపీ ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రులతో సమావేశం అయ్యారు పలు సంఘాల నేతలు.. ఓపీఎస్ మినహా ప్రభుత్వం అన్ని డిమాండ్లకు అంగీకరించిందని.. సంఘాల నేతలు చెప్పారు. ప్రభుత్వం చాలా డిమాండ్లను అంగీకరించడంతో ఉద్యమాన్ని విరమించాలని ఉద్యోగసంఘాల నేతలు కోరారు.
తాజావార్తలు
-
Supreme Court: నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!