Tejashwi Yadav: తేజస్వీ యాదవ్కు జైలు తప్పదా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్
CBI petition to cancel Tejaswi Yadav’s bail: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ ఝలక్ ఇచ్చింది. గతంలో రైల్వేలో ఉద్యోగాలకు అక్రమంగా కొందరు అభ్యర్థల నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ స్కామ్ భాగంగా సీబీఐ విచారిస్తున్న సమయంలో అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను బెదిరించిన కేసులో తేజస్వీ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో 2006లో రాంచీ, ఒడిశాలోని పూరిలలోని రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ ఒప్పందాన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించే క్రమంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే తేజస్వీ యాదవ్ కు సీబీఐ నోటీసులు జారీ చేసి అతని స్పందన కోరింది.
Also Read
- Grok's Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
- Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
Read Also: PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీని తెగ పొగిడిన అమెరికా మీడియా..
ఈ కేసుపై గత నెలలో తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. సీబీఐ అధికారులకు తల్లి, పిల్లలు లేరా..? వారికి కుటుంబం లేదా..? వారు ఎప్పుడూ సీబీఐ అధికారులుగానే ఉంటారా..? పదవీ విరమణ చేయరా..? బీజేపీ మాత్రమే ఎప్పుడూ అధికారంలో ఉంటుందా..? మీరు ఏ సందేశం పంపాలనుకుంటున్నారు..? రాజ్యాంగ సంస్థ బాధ్యతలను మీరు నిజాయితీగా నిర్వర్తించాలని అధికారులను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ కేసుపై ఆయనకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించింది. ఆయన కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు విన్నవించింది.
తేజస్వీ యాదవ్ తండ్రి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ యూపీఏ-1 ప్రభుత్వం హాయాంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ లో స్కామ్ జరిగింది. రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారని..ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. అనంతరం తేజస్వీ యాదవ్ విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆర్జేడీ పార్టీ జేడీయూతో కలిసి బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!