Tejashwi Yadav: తేజస్వీ యాదవ్కు జైలు తప్పదా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI petition to cancel Tejaswi Yadav’s bail: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ ఝలక్ ఇచ్చింది. గతంలో రైల్వేలో ఉద్యోగాలకు అక్రమంగా కొందరు అభ్యర్థల నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ స్కామ్ భాగంగా సీబీఐ విచారిస్తున్న సమయంలో అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను బెదిరించిన కేసులో తేజస్వీ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో 2006లో రాంచీ, ఒడిశాలోని పూరిలలోని రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ ఒప్పందాన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించే క్రమంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే తేజస్వీ యాదవ్ కు సీబీఐ నోటీసులు జారీ చేసి అతని స్పందన కోరింది.
Also Read
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
Read Also: PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీని తెగ పొగిడిన అమెరికా మీడియా..
ఈ కేసుపై గత నెలలో తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. సీబీఐ అధికారులకు తల్లి, పిల్లలు లేరా..? వారికి కుటుంబం లేదా..? వారు ఎప్పుడూ సీబీఐ అధికారులుగానే ఉంటారా..? పదవీ విరమణ చేయరా..? బీజేపీ మాత్రమే ఎప్పుడూ అధికారంలో ఉంటుందా..? మీరు ఏ సందేశం పంపాలనుకుంటున్నారు..? రాజ్యాంగ సంస్థ బాధ్యతలను మీరు నిజాయితీగా నిర్వర్తించాలని అధికారులను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ కేసుపై ఆయనకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించింది. ఆయన కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు విన్నవించింది.
తేజస్వీ యాదవ్ తండ్రి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ యూపీఏ-1 ప్రభుత్వం హాయాంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ లో స్కామ్ జరిగింది. రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారని..ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. అనంతరం తేజస్వీ యాదవ్ విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆర్జేడీ పార్టీ జేడీయూతో కలిసి బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..