Tejashwi Yadav: తేజస్వీ యాదవ్కు జైలు తప్పదా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI petition to cancel Tejaswi Yadav’s bail: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ ఝలక్ ఇచ్చింది. గతంలో రైల్వేలో ఉద్యోగాలకు అక్రమంగా కొందరు అభ్యర్థల నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ స్కామ్ భాగంగా సీబీఐ విచారిస్తున్న సమయంలో అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను బెదిరించిన కేసులో తేజస్వీ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో 2006లో రాంచీ, ఒడిశాలోని పూరిలలోని రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ ఒప్పందాన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించే క్రమంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే తేజస్వీ యాదవ్ కు సీబీఐ నోటీసులు జారీ చేసి అతని స్పందన కోరింది.
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
Read Also: PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీని తెగ పొగిడిన అమెరికా మీడియా..
ఈ కేసుపై గత నెలలో తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. సీబీఐ అధికారులకు తల్లి, పిల్లలు లేరా..? వారికి కుటుంబం లేదా..? వారు ఎప్పుడూ సీబీఐ అధికారులుగానే ఉంటారా..? పదవీ విరమణ చేయరా..? బీజేపీ మాత్రమే ఎప్పుడూ అధికారంలో ఉంటుందా..? మీరు ఏ సందేశం పంపాలనుకుంటున్నారు..? రాజ్యాంగ సంస్థ బాధ్యతలను మీరు నిజాయితీగా నిర్వర్తించాలని అధికారులను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ కేసుపై ఆయనకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించింది. ఆయన కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు విన్నవించింది.
తేజస్వీ యాదవ్ తండ్రి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ యూపీఏ-1 ప్రభుత్వం హాయాంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ లో స్కామ్ జరిగింది. రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారని..ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. అనంతరం తేజస్వీ యాదవ్ విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆర్జేడీ పార్టీ జేడీయూతో కలిసి బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీష్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
-
Dhurandhar 2: ఓటీటీలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్తో మరో రికార్డు?
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!