Venu Goapl Reddy
Author- NTV Telugu-
Surat Fire Accident: సూరత్లో భారీ అగ్నిప్రమాదం… ఒకరి మృతి, 20 మందికి గాయాలు
Surat Fire Accident: గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సూరత్ నగరంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సచిన్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో ఉన్న అనుమప్ రసయాన్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉంచే కంటైనర్ లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. -
PM Narendra Modi: స్వామి వివేకానందను గుర్తు చేసుకున్న మోదీ.. సెప్టెంబర్ 11తో ప్రత్యేక అనుబంధం
Swami Vivekananda chicago speech: ప్రధాని నరేంద్ర మోదీ, స్వామి వివేకనందను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 11, 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్ లో భారత దేశ విలువను ప్రపంచానికి పరిచయం చేశారు స్వామి వివేకానంద. సెప్టెంబర్ 11తో స్వామి వివేకనందకు ప్రత్యేక అనుబంధం ఉంది. 1893లో ఇదే రోజున, ఆయన చేసిన ప్రసంగం అత్యుత్తమ ప్రసంగాల్లో ఒకటిగా నిలిచిందని.. స్వామిజీ ప్రసంగం భారతదేశ సంస్కృతి, నైతికత గురించి ప్రపంచానికి పరిచయం చేసిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. -
Krishnam Raju: కృష్ణం రాజు మరణంపై ప్రధాని మోదీ, అమిత్ షా సంతాపం
Krishnam Raju: లెజండరీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు(83) మరణంపై యావత్ సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఓ గొప్ప నటుడు మరణించడంతో దేశవ్యాప్తంగా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్త విని ఒక్కసారిగా సినీలోకం, ఆయన అభిమానులు షాక్ అయ్యారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో కన్నుముశారు. -
Yogi Adityanath: 15 మంది అధికారులను సస్పెండ్ చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్
UP CM suspends 15 officials for Lucknow hotel fire incident: లక్నో హోటల్ అగ్నిప్రమాదంపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు మొదలు పెట్టారు. ఈ ప్రమాదానికి కారణం అయిన అధికారులను సస్పెండ్ చేశారు. పలు శాఖల్లోని 15 మంది అధికారులు సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల క్రితం లక్నోలోని ఓ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగి నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంపై లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ షిరాద్కర్, కమిషనర్ రోషన్ జాకబ్ తో… -
Satya Pal Malik: “మాట్లాడటం మానేస్తే” ఉపరాష్ట్రపతి అయ్యే వాడిని.. కానీ అలా చేయను
Meghalaya Governor Satyapal malik comments on Rahul Gandhi: కేంద్రప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు చేస్తుంటారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. పలు అంశాలు, సమస్యలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో రైతు ఉద్యమం, లఖీంపూర్ ఖేరీ ఘటనపై కేంద్రాన్నికి వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం మానేస్తే తనను ఉపరాష్ట్రపతి చేస్తారని ప్రజలు సూచించారని.. ఈ సూచనలు నాకు కూడా వినిపించాయని శనివారం అన్నారు. కానీ నేను మాట్లాడకుండా… -
Vande Bharat Train: సెప్టెంబర్ 30న వందే భారత్ 2 ట్రైన్ ప్రారంభం.. వీబీ2 టాప్ స్పీడెంతో తెలుసా..?
Vande Bharat 2 Train start on sep 30: దేశంలో రైల్వేలను మరింత ఆధునీకీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైళ్లలో సౌకర్యాలతో పాటు ప్రజల కంఫర్ట్ ప్రధానంగా కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే దేశంలో అత్యంత స్పీడుగా ప్రయాణించే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. తాజాగా వందే భారత్ 2(వీబీ2) రైళ్లు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఈ హై స్పీడు రైలు 20 రోజుల ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. రైల్వే సేఫ్టీ కమిషనర్( సీఆర్ఎస్) ఈ రైలుకు ఆమోదం తెలిపింది. సెప్టెంబర్… -
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి పెళ్లి ప్రతిపాదన.. ఒప్పుకుంటే ఆ అమ్మాయితోనే పెళ్లి
Rahul Gandhi get a marriage proposal during Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా బలోపేతం చేసే పనిలో ఉన్నారు రాహుల్ గాంధీ. తమిళనాడులో మొదలైన రాహుల్ యాత్ర.. నిన్న రాత్రి కేరళకు చేరింది. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. -
Papua New Guinea: పాపువా న్యూగినియాలో భారీ భూకంపం.. 7.6 తీవ్రతతో కంపించిన భూమి
Papua New Guinea earthquake: ద్వీపదేశం పాపువా న్యూగినియాలో ఆదివారం ఉదయం తీవ్రమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో ఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. -
Afghanistan: అమెరికా వదిలిన హెలికాఫ్టర్ నడపాలనుకున్న తాలిబాన్లు.. చివరకు..
Taliban Try Flying Chopper Left Behind By US, Crash It: ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అధికారం చేజిక్కించుకున్న తాలిబాన్లు.. సైనికపరంగా కూడా బలపడాలని కోరుకుంటున్నారు. గతంలో యూఎస్ మిలిటరీ, ఆప్ఘన్ సైన్యంలో పనిచేసిన వారిని తిరిగి విధుల్లో చేరాలని అధికారం చేపట్టిన తర్వాత కోరారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఉండటం, అంతర్గతంగా కూడా ఐసిస్ ప్రభావం ఎక్కువ అవుతుండటంతో తాలిబన్ ప్రభుత్వం తమకు సైన్యం ఉండాలని కోరుకుంటోంది. -
Asia Cup 2022: నేడు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక
Asia Cup Final 2022 Match: ఆసియా కప్ తుది సమరం ఈ రోజు జరగబోతోంది. పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీలో సూపర్ ఫోర్ దశలో ఇరు జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్స్ కు చేరాయి. సూపర్ 4లో శ్రీలంక మొత్తం మూడు మ్యాచుల్లో గెలవగా.. పాకిస్తాన్ రెండు మ్యాచుల్లో గెలిచింది. ఇక ఈ సారి ఆసియా కప్ ఎవరు…
తాజావార్తలు
-
TGSRTC: ఆర్టీసీ సమ్మె షురూ.. రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు..
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
-
Cherlopalli Incident: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. 50 మంది కార్మికులపై యజమాని..!
-
PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
-
MS Dhoni Return: వాంఖడేలో హై వోల్టేజ్ పోరు.. సీఎస్కేకు గుడ్ న్యూస్, దిగ్గజం దిగుతున్నాడు!
ట్రెండింగ్
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!