Nepal-India: ఇండియా భూభాగాలపై నేపాల్ పార్లమెంట్ లో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. మనం మిత్రదేశంగా భావిస్తున్నప్పటికీ.. భారత భూభాగాలపై ఎప్పటికప్పుడు పేచీ పెడుతూనే ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీ చైనాకు మద్దతుగా ఉండీ.. భారత్ భూభాగాలైన లిపులేక్, లింఫియాధురా, కాలాపానీ ప్రాంతాలను తమ దేశానికి చెందినవిగా వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మరోసారి నేపాల్ ఈ మూడు ప్రాంతాలపై పార్లమెంట్ లో చర్చించింది. ఈ మూడు ప్రాంతాలపై నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యను ఇరు దేశాలు దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న విధానాల్లో ఈ వివాదాస్పద ప్రాంతాల సమస్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. నేపాల్ తన భూభాగాలను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. సరిహద్దు సమస్య చాలా సున్నితమైనదని.. నేపాల్ కు లిఫులేక్, లింపియాదురా, కాలాపానీ ప్రాంతాలపై అవగాహన ఉందని అన్నారు. నేపాల్ అలీన విధానాన్ని అనుసరిస్తుందని.. జాతీయ ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు.
Also Read
ఈ వివాదం 2019, నవంబర్ లో ప్రారంభం అయింది. భారత్ జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కొత్తగా ఇండియా మ్యాప్ విడుదల చేసింది. ఆ సమయంలో దీంట్లో కాలాపానీ రిజియన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిత్తోర్ గఢ్ జిల్లాలో భాగంగా చూపింది. దీంతో నేపాల్, ఇండియాల మధ్య వివాదం రాజుకుంది. దీన్ని వ్యతిరేఖిస్తూ 2020, జనవరిలో నేపాల్ దిగువ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇటీవల భారత్ లిపులేక్ వద్ద భారత్ రోడ్డు నిర్మాణాలు చేపట్టడాన్ని నేపాల్ వ్యతిరేఖించింది. ఈ మూడు ప్రాంతాలు భౌగోళికంగా, రక్షణ పరంగా కీలక ప్రాంతాలు. అయితే కేపీ ఓలీ శర్మ నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో చైనాతో అంటకాగే వాడు. భారత్ అంటే పూర్తిగా వ్యతిరేఖించేవాడు. దీంతో భారత్ పై ఈ వివాదాస్పద ప్రాంతాలను అడ్డు పెట్టుకుని తీవ్రంగా విమర్శలు చేశాడు. కరోనా భారత్ లోనే పుట్టిందని.. శ్రీరాముడు జన్మస్థలం నేపాలే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!