Nepal-India: ఇండియా భూభాగాలపై నేపాల్ పార్లమెంట్ లో చర్చ
నేపాల్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. మనం మిత్రదేశంగా భావిస్తున్నప్పటికీ.. భారత భూభాగాలపై ఎప్పటికప్పుడు పేచీ పెడుతూనే ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీ చైనాకు మద్దతుగా ఉండీ.. భారత్ భూభాగాలైన లిపులేక్, లింఫియాధురా, కాలాపానీ ప్రాంతాలను తమ దేశానికి చెందినవిగా వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మరోసారి నేపాల్ ఈ మూడు ప్రాంతాలపై పార్లమెంట్ లో చర్చించింది. ఈ మూడు ప్రాంతాలపై నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యను ఇరు దేశాలు దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న విధానాల్లో ఈ వివాదాస్పద ప్రాంతాల సమస్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. నేపాల్ తన భూభాగాలను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. సరిహద్దు సమస్య చాలా సున్నితమైనదని.. నేపాల్ కు లిఫులేక్, లింపియాదురా, కాలాపానీ ప్రాంతాలపై అవగాహన ఉందని అన్నారు. నేపాల్ అలీన విధానాన్ని అనుసరిస్తుందని.. జాతీయ ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు.
Also Read
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
- EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
ఈ వివాదం 2019, నవంబర్ లో ప్రారంభం అయింది. భారత్ జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కొత్తగా ఇండియా మ్యాప్ విడుదల చేసింది. ఆ సమయంలో దీంట్లో కాలాపానీ రిజియన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిత్తోర్ గఢ్ జిల్లాలో భాగంగా చూపింది. దీంతో నేపాల్, ఇండియాల మధ్య వివాదం రాజుకుంది. దీన్ని వ్యతిరేఖిస్తూ 2020, జనవరిలో నేపాల్ దిగువ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇటీవల భారత్ లిపులేక్ వద్ద భారత్ రోడ్డు నిర్మాణాలు చేపట్టడాన్ని నేపాల్ వ్యతిరేఖించింది. ఈ మూడు ప్రాంతాలు భౌగోళికంగా, రక్షణ పరంగా కీలక ప్రాంతాలు. అయితే కేపీ ఓలీ శర్మ నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో చైనాతో అంటకాగే వాడు. భారత్ అంటే పూర్తిగా వ్యతిరేఖించేవాడు. దీంతో భారత్ పై ఈ వివాదాస్పద ప్రాంతాలను అడ్డు పెట్టుకుని తీవ్రంగా విమర్శలు చేశాడు. కరోనా భారత్ లోనే పుట్టిందని.. శ్రీరాముడు జన్మస్థలం నేపాలే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
-
IPL 2026 Centuries: ‘వంద’ కొడితే ఓటమే.. ఐపీఎల్ 2026లో ఆసక్తికర ట్రెండ్!
-
Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
-
Vivo S50t 5G: 50MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్తో.. వివో S50t 5G విడుదల
-
Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!