Nepal-India: ఇండియా భూభాగాలపై నేపాల్ పార్లమెంట్ లో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. మనం మిత్రదేశంగా భావిస్తున్నప్పటికీ.. భారత భూభాగాలపై ఎప్పటికప్పుడు పేచీ పెడుతూనే ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీ చైనాకు మద్దతుగా ఉండీ.. భారత్ భూభాగాలైన లిపులేక్, లింఫియాధురా, కాలాపానీ ప్రాంతాలను తమ దేశానికి చెందినవిగా వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మరోసారి నేపాల్ ఈ మూడు ప్రాంతాలపై పార్లమెంట్ లో చర్చించింది. ఈ మూడు ప్రాంతాలపై నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యను ఇరు దేశాలు దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న విధానాల్లో ఈ వివాదాస్పద ప్రాంతాల సమస్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. నేపాల్ తన భూభాగాలను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. సరిహద్దు సమస్య చాలా సున్నితమైనదని.. నేపాల్ కు లిఫులేక్, లింపియాదురా, కాలాపానీ ప్రాంతాలపై అవగాహన ఉందని అన్నారు. నేపాల్ అలీన విధానాన్ని అనుసరిస్తుందని.. జాతీయ ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు.
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
ఈ వివాదం 2019, నవంబర్ లో ప్రారంభం అయింది. భారత్ జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కొత్తగా ఇండియా మ్యాప్ విడుదల చేసింది. ఆ సమయంలో దీంట్లో కాలాపానీ రిజియన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిత్తోర్ గఢ్ జిల్లాలో భాగంగా చూపింది. దీంతో నేపాల్, ఇండియాల మధ్య వివాదం రాజుకుంది. దీన్ని వ్యతిరేఖిస్తూ 2020, జనవరిలో నేపాల్ దిగువ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇటీవల భారత్ లిపులేక్ వద్ద భారత్ రోడ్డు నిర్మాణాలు చేపట్టడాన్ని నేపాల్ వ్యతిరేఖించింది. ఈ మూడు ప్రాంతాలు భౌగోళికంగా, రక్షణ పరంగా కీలక ప్రాంతాలు. అయితే కేపీ ఓలీ శర్మ నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో చైనాతో అంటకాగే వాడు. భారత్ అంటే పూర్తిగా వ్యతిరేఖించేవాడు. దీంతో భారత్ పై ఈ వివాదాస్పద ప్రాంతాలను అడ్డు పెట్టుకుని తీవ్రంగా విమర్శలు చేశాడు. కరోనా భారత్ లోనే పుట్టిందని.. శ్రీరాముడు జన్మస్థలం నేపాలే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!