IND vs SA 3rd ODI: 270 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్.. చెలరేగిన కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ
- విశాఖ వన్డేలో భారత్ టార్గెట్ 271 పరుగులు..
- 47. 5 ఓవర్లలో సౌతాఫ్రికా 270 పరుగులకి ఆలౌట్..
- చెరో నాలుగు వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సఫారీ జట్టును 270 పరుగులకు ఆలౌట్ చేశారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాంచీలో టీమిండియా.. రాయ్పూర్లో సౌతాఫ్రికా గెలిచి 1-1తో సమంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మూడో వన్డేలో గెలుపు ద్వారా సిరీస్ ఫలితం తేలనుంది. కాగా, విశాఖపట్నం వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
Read Also: Pushpa 3: ఇక ఇప్పట్లో పుష్ప 3 లేనట్టే?
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
- Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
- Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్లోకి ఎంట్రీ..
ఇక, తొలుత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికాకు టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ ప్రారంభంలోనే గట్టి షాకిచ్చాడు. మొదటి ఓవర్ ఐదో బంతికే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (0)ను డగౌట్ కు పంపాడు. అయితే, మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి స్కోర్ బోర్డును చక్కదిద్దాడు. ఈ క్రమంలో డికాక్ సెంచరీ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 106 రన్స్ ) పూర్తి చేసుకుని జోరు మీదున్న అతడ్ని ప్రసిద్ కృష్ణ బౌల్డ్ చేశాడు. అలాగే, హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న బవుమా రవీంద్ర జడేజా బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి 48 పరుగులకే స్టేడియం నుంచి నిష్క్రమించాడు.
Read Also: Avatar & Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కి.. అవతార్ 3 భారీ షాక్
అయితే, దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మాథ్యూ బ్రీట్జ్కే (24), డెవాల్డ్ బ్రెవిస్ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ పరుగులు చేశారు. ప్రధాన బ్యాటర్లలో మార్క్రమ్ (1) దారుణంగా ఫెయిల్ కాగా.. ఆల్రౌండర్లలో మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) కనీసం మైదానంలో నిలవలేకపోయారు. లుంగి ఎంగిడి ఒక్క పరుగుకే అవుట్ కాగా.. చివర్లో కేశవ్ మహరాజ్ 20 పరుగులతో అలరించాడు.
Read Also: Kasuri – Masood: జైషే అగ్ర కమాండర్ల ‘రహస్య సమావేశం’.. భారత్పై భారీ కుట్రకు ప్లాన్!
ఈ క్రమంలో 47.5 ఓవర్లలో ప్రొటిస్ జట్టు 270 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్ ప్రసిద్ కృష్ణ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అలాగే, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. దక్షిణాఫ్రికా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!