Venu Goapl Reddy
Author- NTV Telugu-
Pakistan: ఇంట్లో ఖరీదైన కార్లు.. చేసేది భిక్షాటన.. మోసపోయిన డాక్టర్..
Pakistan: పాకిస్తాన్ లో ఇప్పుడో యువతి వీడియో తెగవైరల్ అవుతోంది. ఎంబీబీఎస్ డాక్టర్ అయిన పాకిస్థానీ అమ్మాయి షాజీయా ఎలా మోసపోయిందనే వీడియోని ఫిబ్రవరి 20న సయ్యద్ బాసిత్ అలీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ చాలా వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి మోసపోయిన తీరును చూసి చాలా మంది బాధపడుతున్నారు. ఇంపోర్ట్-ఎక్పోర్ట్ వ్యాపారం అని చెప్పుకున్న ఓ కుటుంబంలోకి డాక్టర్ అయిన షాజియా కోడలుగా వెళ్లింది. తీరా ఐదారు నెలల తర్వాత అసలు విషయం బయటపడింది. -
Google: ఉద్యోగులను తీసేశారు.. ఇప్పుడు రోబోలను తొలగించిన గూగుల్..
Google now lays off robots: గతేడాది టెక్ ఉద్యోగుల లేఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగతున్నాయి. జనవరి నెలలో ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గూగుల్ ఇటీవల 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉంటే ఉద్యోగులనే కాదు, సంస్థలో పనిచేస్తున్న రోబోలను కూడా తొలగిస్తున్నట్లు గూగుల్ నిర్ణయం తీసుకుంది. -
Delhi Liquor Case: లిక్కర్ కేసులో సీబీఐ విచారణ.. మనీష్ సిసోడియా “జైల్” ట్వీట్
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించనుంది. ఈ కేసులో నమోదు అయిన ఛార్జీషీట్ లో సిసోడియా పేరు కూడా ఉంది. అయితే గత ఆదివారమే సీబీఐ ముందు సిసోడియా హాజరుకావాాల్సి ఉన్నా, విచారణకు మరింత సమయం కోరారు. తాను బడ్జెట్ సిద్ధం చేసే పనిలో ఉన్నానని అందుకే మరింత గడువు కావాలని కోరారు. దీంతో ఈ రోజు విచారణకు హాజరుకాబోతున్నారు. -
Pakistan: పాక్ తొలి ట్రాన్స్జెండర్ న్యూస్ యాంకర్పై కాల్పులు..
Pakistan: పాకిస్తాన్ లో ఇస్లామిక్ మతఛాందసవాదులు ఎంతలా పెరిగి పోయారంటే దైవదూషణ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ల పై దాడులు చేస్తూ ప్రజలను చంపేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ తొలి ట్రాన్స్జెండర్ న్యూస్ యాంకర్ పై కాల్పులు జరిపారు దుండగులు. మార్వియా మాలిక్ (26) లాహోర్ లో ఫార్మసీ నుంచి తన ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో తుపాకీ దాడికి గురైంది. -
Nikki Haley: పాక్, చైనాలు చెడ్డ దేశాలు.. అధికారంలోకి వస్తే శత్రు దేశాలకు నిధులు ఇవ్వం..
Nikki Haley Comments on Pakistan, China: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు భారతసంతతికి చెందిన నిక్కీ హేలీ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ నుంచి ఆమె పోటీలో నిలబడనున్నారు. ఈ మేరకు ఆమె ఇప్పటి నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తాజాగా ఆమె పాకిస్తాన్, చైనా దేశాలపై విరుచుకుపడ్డారు. ఈ రెండు దేశాలను చెడ్డ దేశాలుగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలను నిధులను ఇవ్వబోమని స్పష్టం చేశారు. -
Asaduddin Owaisi: ముస్లింలు శరద్ పవార్, ఠాక్రే, షిండేలా ఉండలేరా..?
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర థానే జిల్లాలోని ముంబ్రా సబర్బన్ ప్రాంతంలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్దవ్ ఠాక్రే పార్టీ, పార్టీ గుర్తను కోల్పోవడంపై తనకు సానుభూతి లేదని ఆయన అన్నారు. ముంబ్రా ఎందుకు ఉనికిలోకి వచ్చింది.. ముంబై నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చే బలవంతం చేసింది ఎవరు..? టాడా కింద ప్రజలను జైళ్లలోకి నెట్టిన రోజులను తాను మరిచిపోలేదని అసద్ అన్నారు. ఎన్సీపికి చెందిన అజిత్ పవార్, సుప్రియా సూలే నాయకులు కాగలిగితే, ఉద్ధవ్ ఠాక్రే తండ్రి పుణ్యమా… -
Russia: జీ20 సమావేశాలను అస్థిర పరిచేందుకు ఆ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
Russia Accuses West: భారత్ లో జరుగుతున్న జీ20 సమావేశాలను అస్థిర పరిచేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా మండిపడింది. రష్యాకు వ్యతిరేకంగా ఈ వేదికను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయని శనివారం ఆరోపించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జీ7 దేశాలు రష్యా వ్యతిరేక మార్గంలో సమావేశాలను వాడుకుంటున్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
Khalistan: భారత్పై విషాన్ని చిమ్మిన అమృత్పాల్ సింగ్.. పంజాబ్ స్వతంత్రం అవుతుందని ప్రగల్భాలు..
Khalistan sympathiser Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని సవాల్ చేస్తూ హెచ్చరించారు. ఇటీవల అజ్నాలా పోలీస్ స్టేషన్ పై సాయుధులుగా వచ్చి దాడి చేశారు అమృత్ పాల్ సింగ్ మద్దతుదారులు. అతని అనుచరుడిని అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఖలిస్తానీ మద్దతుదారులు వచ్చి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. -
Bird Flu: జార్ఖండ్లో బర్డ్ ఫ్లూ కలకలం.. 4000 కోళ్లను చంపనున్న ప్రభుత్వం
Bird Flu Outbreak In Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. బొకారో జిల్లాలో ప్రభుత్వం నడిపే ఓ ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో అక్కడి ప్రభుత్వం రక్షణ చర్యలు ప్రారంభించింది. వ్యాధి ప్రభావిత ప్రాంతంలోని 4000 కోళ్లు, బాతులను చంపే ప్రక్రియ ప్రారంభం అయింది. హెచ్5ఎన్1, ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ రకం ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ‘కడక్ నాథ్’ కొళ్లలో గుర్తించారు. దీనివల్ల జిల్లాలోని లోహాంచల్ లోని కోళ్ల ఫారమ్ లో 800… -
Alzheimers: 19 ఏళ్లకే అల్జీమర్స్ వ్యాధి.. అతి చిన్న వయసులో వ్యాధి బారిన పడటం ఇదే తొలిసారి
Alzheimers: చైనాలో 19 ఏళ్ల వ్యక్తికి మెదడుకు సంబంధించిన అరుదైన వ్యాధి ‘అల్జీమర్స్’ సోకినట్లు నిర్దారణ అయింది. జ్ఞాపకశక్తిపై ఈ వ్యాధి తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా వయసు పైబడిన వారికి మాత్రమే అరుదుగా ఈ వ్యాధి వస్తుంది. అయితే 19 ఏళ్ల వ్యక్తికి రావడం ప్రపంచంలో ఇదే తొలిసారని బీజింగ్ లోని క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ, జువాన్ వు హాస్పిటల్ పరిశోధకులు వెల్లడించారు. యువకుడి జ్ఞాపకశక్తి రెండేళ్ల కాలంలో వేగంగా క్షీణించిందని పరిశోధకులు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!