Nirav Modi: నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు అనుమతి..
Nirav Modi To Be Extradited To India, Loses Appeal In UK Court: భారతదేశంలో బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో ఉంటున్న నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తాకింది. ఇండియాకు రాకుండా బ్రిటన్ లో ఉంటున్న నీరవ్ మోదీని భారత్ అప్పగించాలంటూ అక్కడి కోర్టు తీర్పు చెప్పింది. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని భారత్ అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వేసిన పిటిషన్ ను యూకే హైకోర్టు బుధవారం తిరస్కరించింది. నీరవ్ మోదీ అప్పగింత అన్యాయం, అణచివేత కానది కోర్టు పేర్కొంది.
Read Also: Bandi Sanjay: మోడీ తెలంగాణ పర్యటన.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
నీరవ్ మోదీని భారత్ కు అప్పగించాలని యూకే కోర్టు తీర్పు చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీగా లోన్లు తీసుకుని మోసం చేశాడు. అప్పటి నుంచి భారత్ కు రాకుండా విదేశాల్లో ఉంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. తనను భారత్ పంపించడాన్ని వ్యతిరేకిస్తూ నీరవ్ మోదీ బ్రిటన్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రూ. 11,000 కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేశాడు నీరవ్. గుజరాత్ కు చెందిన ఈ వజ్రాల వ్యాపారిని యూకే నుంచి ఇండియాకు తీసుకురావడానికి మన దేశం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ రోజు లండన్ లోని వెస్ట్ మినిస్టర్స్ కోర్టు ఆయన వేసిన పిటిషన్ ను వ్యతిరేకించింది. లార్డ్ జస్టిస్ జెరెమీ సువర్ట్ స్మిల్ , జస్టిస్ రాబర్ట్ జేలు, నీరవ్ మోదీని భారతదేశానికి అప్పగించేందుకు అనుమతిస్తూ తీర్పు వెలువరించారు.
మోడీని లండన్ నుంచి ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలుు తీసుకురావడానికి మార్గం సుగమం అయింది. నీరవ్ మోదీ లాగే అతని మేనమామ మోహుల్ చోక్సీ కూడా పీఎన్బీని మోసం చేసి ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నాడు. భారత్ ఏజెన్సీలు ఇతడిని కూడా అప్పగించాలని కోరుతున్నాయి.
ఇదిలా ఉంటే మరో 14 రోజుల్లో హైకోర్టు ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ బ్రిటన్ సుప్రీంకోర్టును నీరవ్ మోదీ ఆశ్రయించవచ్చు. అయితే దీన్ని హైకోర్టు అంగీకరిస్తేనే బ్రిటన్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. నీరవ్ మోదీ యూరోపియన్ మానవహక్కుల న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. ఇండియాలో నీరవ్ మోదీ కేసును ఈడీ, సీబీఐలు విచారిస్తున్నాయి. నీరవ్ మోదీ కేసులో భారత ఏజెన్సీలు బ్రిటన్ కోర్టు ముందు అన్ని ఆధారాలను సమర్పించారు.
తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!